Game Changer OTT: ఓటీటీలోకి ‘గేమ్ ఛేంజర్’.. ఎప్పుడో తెలిసిపోయిందిగా!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ మూవీ ఓటీటీ రిలీజ్‌పై ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రం ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ రూ.105 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో దాదాపు 6వారాల తర్వాతే ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందని సమాచారం.

New Update
ram charan game changer streaming on amazon prime soon

ram charan game changer streaming on amazon prime soon

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ భారీ అంచనాలతో తెరకెక్కింది. ఈ చిత్రం పట్టాలెక్కిన 3ఏళ్ల తర్వాత నేడు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత రామ్ చరణ్ చేసిన మొదటి సినిమా ఇదే కావడంతో ఒకవైపు మెగా ఫ్యాన్స్, మరోవైపు సినీ అభిమానుల్లోనూ ఊహకందని అంచనాలు ఉన్నాయి. అందులోనూ స్టార్ అండ్ క్రియేటివ్ దర్శకుడు శంకర్ డైరెక్షన్‌లో ఈ సినిమా రూపొందడంతో ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అంతా అనుకున్నారు. 

Also Read: ఒకవైపు మంచు తుఫాను..మరోవైపు కార్చిచ్చు..అల్లాడిపోతున్న అమెరికా

అంచనాలు తలకిందులు

కానీ ఇవాళ థియేటర్లలో బొమ్మ పడిన తర్వాత అందరి అంచనాలు తలకిందులయ్యాయి. శంకర్ ఏంటి సినిమాను ఇలా తీశాడు అంటూ అందరూ ఆశ్చర్యపోయారు. అనుకున్నది ఒకటి.. అయినది ఒకటి అంటూ దర్శకుడు శంకర్‌పై మండిపడుతున్నారు. సినిమా అంతా ఔట్‌డేటెడ్ స్టోరీ అంటూ చెప్పుకొస్తున్నారు. ఎక్కడా శంకర్ మార్క్ కనిపించలేదంటూ గగ్గోలు పెడుతున్నారు. 

Also Read: తగలబడుతున్నHollywood.. షూటింగ్ లు బంద్.. స్టార్ నటీనటుల ఇళ్ళు కూడా

వన్ మ్యాన్ షో

సినిమా మొత్తంలో రామ్ చరణ్ యాక్టింగ్ చాలా నచ్చిందంటూ చెబుతున్నారు. రామ్ చరణ్ వన్ మ్యాన్ షో అంటున్నారు. అలాగే ఏపీ రాజకీయాలకు సంబంధించినట్లుగా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని కొందరు చెప్పుకొస్తున్నారు. ఈ సినిమా కోసమేనా 3 ఏళ్లు వెయిట్ చేయించిందంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఆర్ఆర్ఆర్‌ సినిమా తర్వాత చరణ్ ఒక మంచి హిట్ కొడతాడు అనుకుంటే ఇలా అయిందేంటి అని అభిమానులు నిరాశ చెందుతున్నారు. 

Also Read: మహా కుంభమేళాకు రానున్న స్టీవ్‌జాబ్స్‌ భార్య

ఓటీటీలోకి ఎప్పుడంటే?

ఇదిలా ఉంటే ఈ మూవీ ఓటీటీపై తాజాగా ఓ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. దాదాపు రూ. 450 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ త్వరలో ఓటీటీలోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ పార్మ్ అమెజాన్ ప్రైమ్ ఈ మూవీ ఓటీటీ హక్కులను భారీ ధరకే దక్కించుకున్నట్లు సమాచారం. దాదాపు రూ.105 కోట్లకు పైగా కొనుక్కున్నట్లు తెలుస్తోంది. దీంతో 6 వారాల తర్వాతే ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేశాయి.

Also Read: నేనూ మనిషినే తప్పులు చేస్తాను దేవుడిని కాదు–ప్రధాని మోదీ

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి

Vijay Devarakonda: "లవ్‌ యూ అన్నా".. అల్లు అర్జున్‌కు విజయ్‌ దేవరకొండ సర్ప్రైజ్‌ గిఫ్ట్‌..

విజయ్‌ దేవరకొండ హైదరాబాద్ లో తన కొత్త రౌడీ బ్రాండ్ స్టోర్‌ను ప్రారంభించిన సందర్భంగా అల్లు అర్జున్‌ కు గిఫ్ట్‌ పంపగా, బన్నీ‘‘స్వీట్‌ బ్రదర్‌’’ అంటూ స్పందించాడు. వీరిద్దరి మధ్య ఉన్న స్నేహ బంధం మరోసారి హైలైట్ అయింది.

New Update
Vijay Devarakonda - Allu Arjun

Vijay Devarakonda - Allu Arjun

Vijay Devarakonda: టాలీవుడ్‌ యూత్ ఐకాన్ అల్లు అర్జున్‌(Allu Arjun), రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ ఇద్దరూ మంచి స్నేహితులని సినీ పరిశ్రమలో అందరికి తెలిసిన విషయమే. అయితే ఇద్దరికీ ఫ్యాన్స్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకరిపై ఒకరికి ఉన్న సాన్నిహిత్యాన్ని తాజాగా సోషల్ మీడియా వేదికగా మరోసారి తెలిపారు.

Also Read: "హై అలర్ట్…!! మే మరింత వేడెక్కనుంది!" రాజాసాబ్ అప్‌డేట్ ఆన్‌ ది వే..!

మై స్వీట్‌ బ్రదర్‌..

హైదరాబాద్‌లో తన "రౌడీ" బ్రాండ్ స్టోర్‌ను(Rowdy Brand Store) ప్రారంభించిన విజయ్‌ దేవరకొండ, ఈ సందర్భంగా అల్లు అర్జున్‌కి ప్రత్యేకంగా బ్రాండ్‌కు చెందిన దుస్తులు, పిల్లల కోసం బర్గర్లను గిఫ్ట్‌గా పంపారు. ఈ చిన్న సర్ప్రైజ్‌ బన్నీ మనసును గెలుచుకుంది. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఈ గిఫ్ట్ ఫొటోను షేర్ చేస్తూ, "మై స్వీట్‌ బ్రదర్‌.. నువ్వు ఎప్పుడూ ఇలాగే ఆశ్చర్యపరుస్తూ ఉంటావు. సో స్వీట్‌!" అంటూ అల్లు అర్జున్‌ హృదయపూర్వకంగా స్పందించాడు.

Also Read: లవర్‌తో బాగోదు.. అందుకే సీత పాత్ర రిజెక్ట్ చేశా : శ్రీనిధి

ఇది తొలిసారి కాదు ‘పుష్ప 2’ విడుదల సమయంలో కూడా విజయ్‌ ప్రత్యేకంగా డిజైన్ చేసిన ‘పుష్ప’ టీషర్ట్‌లు బన్నీకి పంపిన సంగతి తెలిసిందే. అప్పుడు కూడా అల్లు అర్జున్‌ ఆనందంతో, ‘‘నా స్వీట్‌ బ్రదర్‌.. నీ ప్రేమకు ధన్యవాదాలు’’ అంటూ అభినందించాడు. దీనికి విజయ్‌ దేవరకొండ ‘‘లవ్ యూ అన్నా.. మన స్నేహం ఇలానే కొనసాగుతుంది’’ అని రిప్లై ఇచ్చాడు.

Also Read: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

ప్రస్తుతం ఈ ఇద్దరూ తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. అల్లు అర్జున్, అట్లీ దర్శకత్వంలో రూపొందనున్న భారీ సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో మరో సినిమాకు సిద్ధమవుతున్నాడు. మరోవైపు విజయ్‌ దేవరకొండ ‘కింగ్‌డమ్‌’ అనే స్పై థ్రిల్లర్‌లో నటిస్తున్నాడు, దీనిని గౌతమ్‌ తిన్ననూరి డైరెక్ట్‌ చేస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు