తారక్, చరణ్ ను కలిపిన థమన్.. ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ, వైరల్ అవుతున్న పిక్

సంగీత దర్శకుడు థమన్ తాజాగా తన సోషల్ మీడియాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో కలిసి దిగిన ఒక ఫోటోను పంచుకున్నారు. దానికి..'దోప్ మూమెంట్.. వాట్ ఫన్. బ్రదర్స్ లవ్' అని క్యాప్షన్ పెట్టాడు. చరణ్, తారక్ లను చాలా రోజులకు ఒకే ఫ్రేమ్ లో చూసి ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.

New Update
ntr ram charan thaman

ntr ram charan thaman

టాలీవుడ్ స్టార్స్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఉన్న బాండింగ్ గురించి తెలిసిందే. 'RRR' తర్వాత వీళ్ళ ఫ్రెండ్షిప్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. సినిమా సమయంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ తరచూ కలిసి కనిపిస్తూ తమ స్నేహబంధాన్ని అందరికీ చాటిచెప్పారు. 

సినిమా విడుదల నుండి ఆస్కార్ వేడుకల వరకు వారిద్దరూ కలిసే ఉన్నారు. ఆ తరువాత, మళ్ళీ కలిసి కనిపించింది చాలా తక్కువ. అయితే, సంగీత దర్శకుడు తమన్ తాజాగా తన సోషల్ మీడియాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో కలిసి దిగిన ఒక ఫోటోను పంచుకున్నారు. 

ఇది కూడా చదవండి: 'నీ కంటే సమంత, మంచులక్ష్మి నయం..అర్థరాత్రి పబ్బుల్లో, గోవాలో పార్టీలు'

దోప్ మూమెంట్..

తమన్ ఈ ఫోటోను షేర్ చేస్తూ..'దోప్ మూమెంట్.. వాట్ ఫన్. బ్రదర్స్ లవ్' అని పోస్ట్ చేసాడు. దీంతో ఈ ఫొటో వైరల్ గా మారింది. ఇటీవల అమెరికాలో 'గేమ్ చేంజర్' ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరిగిన విషయం తెలిసిందే. రామ్ చరణ్, తమన్ ఈ వేడుక కోసం అమెరికా వెళ్లారు.

publive-image

ఇప్పుడు తమన్ ఈ ఫోటోను షేర్ చేయడంతో ఎన్టీఆర్ కూడా అమెరికా వెళ్లారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే తమన్ షేర్ చేసిన పిక్ అమెరికాలో దిగింది. అందులో తారక్ ఉండటం చూసి అందరూ షాక్ అవుతున్నారు.

ఇది కూడా చదవండి: సంధ్య థియేటర్‌ ఘటన.. బాధిత కుటుంబానికి మైత్రీ మూవీస్‌ భారీ సాయం

 'వార్ 2' షూటింగ్ తో ముంబైలో బిజీగా ఉండాల్సిన ఎన్టీఆర్.. అమెరికాలో ఏం చేస్తున్నాడని ఈ పిక్ చూసిన ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా చరణ్, తారక్ ఇలా చాల రోజులకు ఒకే ఫ్రేమ్ లో చూసి ఫ్యాన్స్ కడుపు నిండిపోయింది. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట ట్రెండ్ అవుతోంది.

#junior-ntr #thaman #Ram Charan #telugu-film-news #latest-news
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి

MS Dhoni రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎం...

MS Dhoni రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎంట్రీ? వీడియో షేర్ చేసిన కరణ్ జోహార్

చిత్రనిర్మాత కరణ్ జోహార్ ఇండియన్ క్రికెటర్ ఎం. ఎస్ ధోని అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే ధోని ఓ కొత్త రొమాంటిక్ అవతార్ లో కనిపించబోతున్నట్లు వీడియో రిలీజ్ చేశారు. దీంతో ధోని హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

New Update
MS DHONI VIDEO

MS DHONI VIDEO

MS Dhoni టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎం. ఎస్ ధోని క్రికెట్ తో పాటు సినిమా రంగంలోకి కూడా అడుగుపెట్టారు. 2023లో  'లెట్స్ గెట్ మ్యారీడ్' అనే సినిమాకు డిస్ట్రిబ్యూటర్ గా పనిచేశారు. అయితే ఇప్పుడు ధోని హీరోగా కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి కారణం బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ షేర్ చేసిన వీడియో.  ధోని ఓ కొత్త రొమాంటిక్ అవతార్ లో కనిపించబోతున్నారు అంటూ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో ధోని హార్ట్  సింబల్ బెలూన్ చేతిలో పట్టుకొని కనిపించారు. దీంతో ఫ్యాన్స్ ధోని హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అని అనుకుంటున్నారు. అంతేకాదు కరణ్ ఈ వీడియోను షేర్ చేయడంతో.. ధోనిని కరణ్ జోహార్ పరిచయం చేయబోతున్నారా అని కామెంట్లు పెడుతున్నారు. కానీ.. ఇంతలోనే అసలు విషయం బయటపడింది.

యాడ్ ఫిల్మ్ షూట్

 ఆ వీడియో ఒక యాడ్ ఫిల్మ్ షూట్ కి సంబంధించినదని తెలిసింది. ఈ వీడియోకి గల్ఫ్ ఆయిల్ కంపెనీని ట్యాగ్ చేయడంతో.. ఇది యాడ్ షూట్ కి సంబంధించిన వీడియో అని అర్థమైంది. ఏదేమైనా మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అయితే గతంలో కూడా ధోని సినిమాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. ఇటీవలే రామ్ చరణ్ - బుచ్చిబాబు rc16 లో ధోని క్యామియో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత చిత్రబృందం అలాంటిదేమి లేదని చెప్పడంతో పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది.  

ప్రస్తుతం ధోని  CSK కెప్టెన్‌గా గా వ్యవహరిస్తున్నారు. వరుసగా ఐదు మ్యాచుల పరాజయాల తర్వాత.. తాజాగా జరిగిన లక్నో సూపర్ జెయింట్స్‌ వర్సెస్ CSK మ్యాచ్ లి చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. ఈ విజయంలో ధోని కీలక పాత్ర పోషించడం విశేషం. 

telugu-news | latest-news | ms-dhoni | karan-johar

Advertisment
Advertisment
Advertisment