సినీ ఇండస్ట్రీ ఐదారుగురు హీరోలదే కాదు.. మంత్రి కోమటిరెడ్డి ఫైర్!

హైదరాబాద్ లో తెలంగాణ ఫిలిం ఛాంబర్ నూతన కర్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్యఅతిథిగా మంత్రి కోమటిరెడ్డి హాజరయ్యారు. ఈ మేరకు సినీ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో ఐదారుగురు హీరోలు మాత్రమే కాదని.. ఆసక్తి, ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరిదన్నారు.

New Update
Komatireddy Venkat Reddy

సినిమా ఇండస్ట్రీ ఐదారుగురి హీరోలదే కాదని.. ఆసక్తి, ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరిదీ అని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో సినీ పరిశ్రమను మరింతగా అభివృద్ధి చేయటమే తమ ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు. ఇటీవల హైదరాబాద్ లో తెలంగాణ ఫిలిం ఛాంబర్ నూతన కర్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సినీ ఇండస్ట్రీపై షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. 

Also Read:  Varra Ravindra Reddy: వర్రా రవీందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌!

పాన్ ఇండియా పేరుతో సినిమాలు తీశామని.. టికెట్ ధరలు పెంచుకునేందుకు అవకాశం కల్పించాలంటూ తన దగ్గరికి వచ్చే నిర్మాతలకు ఇక నుంచి సమయం ఇచ్చేది లేదని అన్నారు. ఇక తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు ఆరోసారి ఛైర్మన్‌గా ఎన్నికైన రామకృష్ణ గౌడ్‌కి శుభాకాంక్షలు తెలిపారు. 

సినీ ఇండస్ట్రీ ఐదారుగురు హీరోలదే కాదు

Also Read:  BC Janardhan Reddy: కుటుంబాన్ని కలవనివ్వకుండా..32 రోజులు నిర్బంధించారు

రాష్ట్రంలో సినీ ఇండస్ట్రీని డెవలప్ చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీలో ఐదారుగురు హీరోలు మాత్రమే ఎదుగుతున్నారని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. దీని వల్ల నిజమైన ప్రతిభ కలిగిన నటీనటులకు గుర్తింపు దక్కడం లేదని అన్నారు. సినిమా పరిశ్రమ ఐదారుగురు పెద్దలు, హీరోలది కాదని.. ఆసక్తి, ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరిదని అన్నారు. 

Also Read:  Ap Assembly: ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌‌‌‌గా ఆయనే..!

అంతేకాకుండి సినిమా కార్మికులు కోసం నిర్మించిన చిత్రపురి కాలనీలో చాలామంది బయటి వ్యక్తులే ఉన్నారని ఆరోపించారు. అందువల్ల ఇప్పుడు కొత్తగా కట్టబోయే ఫ్లాట్స్ కేటాయింపులో తెలంగాణ ప్రాంతానికి చెందిన వారికే ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. మరోవైపు తన దగ్గరకు థియేటర్లు ఇప్పించమని వచ్చే ప్రతి చిన్న సినిమా యూనిట్ కు సహకారం అందిస్తున్నానని చెప్పుకొచ్చారు. 

సినిమా టికెట్ల ధరలు పెంచుకోవడానికి సీఎం కావాలి

Also Read:  AP: ఏపీ విద్యార్థులకు శుభవార్త..ఒక్కొక్కరికి రూ.15వేలు..!

నటుడు, నిర్మాత బండ్ల గణేష్ సినీ ఇంస్ట్రీలోని ప్రముఖులను ఉద్దేశించి ఇండస్ట్రీని షేక్ చేసేలా ట్వీట్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టిన రోజు నాడు ఎంతో మంది శుభాకాంక్షలు తెలిపారని అన్నారు. అందులో రాజకీయ ప్రముఖులు, సినీ ఇండస్ట్రీ వారు కూడా ఉన్నారని తెలిపారు. అయితే కొంతమంది సినిమా వాళ్లు మాత్రం రేవంత్ రెడ్డి పుట్టిన రోజున ఆయనకు శుభాకాంక్షలు తెలపలేదని ఫైర్ అయ్యాడు. ఇందులో భాగంగానే కేవలం సినిమా టికెట్ల ధరలను పెంచుకోవడానికి మాత్రం సీఎం కావాలని అంటూ ఓ ట్వీట్ షేర్ చేశాడు. దీంతో ఈ ట్వీట్ ఒక్కసారిగా సంచలనం సృష్టించింది. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Manchu Lakshmi - Manoj: అక్కా ఏడవకే.. మనోజ్‌ను చూడగానే కన్నీళ్లు పెట్టుకున్న మంచు లక్ష్మి - VIDEO

ఫ్యామిలీ వివాదాలతో సతమతమవుతున్న తమ్ముడు మంచు మనోజ్‌ని ఓ ఫంక్షన్లో చూసి మంచు లక్ష్మి ఏడ్చేసింది. ఆమె స్టేజ్‌పై ఉన్న సమయంలో మనోజ్ దంపతులు వెళ్లారు. వారిని చూడగానే లక్ష్మి కంటనీరు పెట్టుకుని ఎమోషనల్ అయింది. పక్కనే ఉన్న మౌనిక అక్కా తమ్ముళ్ళను ఓదార్చింది.

New Update
manchu lakshmi gets emotional over seeing manchu manoj

manchu lakshmi gets emotional over seeing manchu manoj

అక్కా తమ్ముళ్ల బంధం ఎన్నటికీ వీడనిది.. విడదీయలేనిది. ఎన్ని గొడవలు జరిగినా.. తిరిగి మళ్లీ ఒక్కటి కావాల్సిందే. అదే మరోసారి నిజమైంది. మంచు ఫ్యామిలీలో  గత కొన్నాళ్లుగా వివాదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. నువ్వా నేనా అన్నట్లుగా మంచు ఫ్యామిలీ గొడవలు చెలరేగాయి. పోలీస్ స్టేషన్ వరకు చేరుకున్నాయి. అక్కడితో ఆగలేదు. ఆఖరికి కోర్టు మెట్లు కూడా ఎక్కారు. 

Also Read :  కల్యాణ్‌రామ్‌ ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’ ట్రైలర్‌ చూశారా? కెవ్ కేక

మంచు మోహన్ బాబు, మంచు విష్ణు ఒకవైపు- మంచు మనోజ్ మరోవైపు. సినిమాను తలపించేలా వీరి వివాదం నడిచింది. ఇప్పటికీ వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా గొడవలు జరుగుతున్నాయి. ఇది ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. ఆ మధ్య వీరు ఒకరినొకరు తిట్టుకుని.. పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చుకున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులు కాస్త సైలెంట్ అయ్యారు. 

Also Read :  'చూపుల్తో గుచ్చి గుచ్చి’ మాస్ జాతర ప్రోమో సాంగ్ అదిరిపోయిందిగా..!

కానీ ఇప్పుడు మరోసారి మంచు ఫ్యామిలీలో చిచ్చు రాజుకుంది. మంచు మనోజ్ మరోసారి తీవ్రమైన ఆరోపణలు చేశాడు. తన కార్లను విష్ణు దొంగిలించాడంటూ తన తండ్రి మోహన్ బాబు ఇంటి ముందు ఆందోళనకు దిగాడు. కూతురి పుట్టినరోజు వేడుకల కోసం రాజస్థాన్ వెళ్లిన వెంటనే మంచు విష్ణు ఈ చోరీకి పాల్పడ్డాడని మనోజ్ ఆరోపణలు చేశాడు. ఇప్పుడు ఇదే రచ్చ కొనసాగుతోంది. 

Also Read :  ట్రెడిషనల్ లుక్ తో కట్టిపడేసిన మిల్కీబ్యూటీ..

ఇలా వరుస వివాదాలతో మంచు ఫ్యామిలీకి కంటి మీద కునుకు లేకుండా పోయింది. మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి ఈ వివాదాలపై నోరు విప్పేందుకు ఇష్టపడటం లేదు. అయితే మంచు లక్ష్మికి తమ్ముడు మనోజ్‌ మీదే ఎక్కువ ప్రేమ ఉన్నట్లు ఎప్పటి నుంచో వార్తలు నడుస్తున్నాయి. గతంలో ఆమె ముంబై నుంచి వచ్చి గొడవలను సరిచేయాలని చూసింది. కానీ ఆమె మాట ఎవరూ వినలేదని.. అక్కడ నుంచి వెంటనే మళ్లీ ఆమె వెళ్లిపోయిందని వార్తలు వినిపించాయి. 

Also Read :  'సూర్య 45'లో మలయాళ బ్యూటీ అనఘా రవి

అక్కా తమ్ముళ్ల అనుబంధం

ఇదిలా ఉంటే తాజాగా మంచు లక్ష్మి, తమ్ముడు మంచు మనోజ్ కలిసారు. ‘టీచ్ ఫర్ ఛేంజ్’ అనే వార్షిక ఫండ్‌రైజర్ కార్యక్రమాన్ని మంచు లక్ష్మి ఏర్పాటు చేసింది. అందులో తన కూతురితో కలిసి ర్యాంప్ వాక్ చేసింది. అదే సమయంలో మంచు లక్ష్మి స్టేజ్ మీద ఉండగానే.. వెనుక నుంచి మంచు మనోజ్ దంపతులు సర్‌ప్రైజ్ చేశారు. దీంతో ఒక్కసారిగా తమ్ముడు మనోజ్‌ను చూసిన మంచు లక్ష్మీ మనసారా హత్తుకుని ఏడ్చేసింది. దీంతో పక్కనే ఉన్న మనోజ్ భర్య ఆమెను ఓదార్చింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇది చూసి నెటిజన్లు.. అక్కా తమ్ముళ్ల అనుబంధం విడదీయలేనిది అంటూ కామెంట్లు పెడుతున్నారు.

(manchu-manoj | manchu lakshmi | manchu family | latest-telugu-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment