Manchu Vishnu: వీధిలో మొరిగే కుక్క.. మంచు మనోజ్ ను మళ్లీ గెలికిన విష్ణు!

మంచు విష్ణు పెట్టిన ఓ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఆ ట్వీట్ లో..' సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది. కానీ వీధిలో మొరగడానికి, అడవిలో గర్జించడానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలో అయినా తెలుసుకుంటావన్న ఆశ' అని మోహన్ బాబు చెప్పిన డైలాగ్ ను షేర్ చేశారు.

New Update
vishnu manchu latest tweet

manchu familiy

Manchu Vishnu: మంచు ఫ్యామిలీలో గొడవలు మరింత ఎక్కువయ్యాయి. హైదరాబాద్‌లో స్టార్ట్ అయిన మంచు ఫ్యామిలీ తగాదా ఇప్పుడు తిరుపతికి మారింది. జల్‌పల్లి ఫార్మ్‌హౌస్‌ వద్ద చోటుచేసుకున్న వివాదం భౌతిక దాడుల నుంచి కేసులు పెట్టుకునే వరకు వెళ్ళింది. తాజాగా, మనోజ్‌.. మోహన్‌బాబు యూనివర్సిటీలో దర్శనమివ్వడం తో ఈ ఫ్యామిలీ వివాదం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది.

Also Read: ఆయుష్మాన్ భారత్ ఒప్పందం.. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలకు సుప్రీం కోర్టు బ్రేక్

 మంచు కుటుంబంలోని గొడవలు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. అసలు ఇది అన్నదమ్ముల మధ్య వివాదమా? లేక తండ్రి-కొడుకుల గొడవా? అన్న విషయంపై ఎలాంటి క్లారిటీ లేదు. అయితే ఈ గొడవకు మరింత ఆజ్యం పోస్తూ మంచు విష్ణు పెట్టిన ఓ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఆ ట్వీట్ లో RGV డైరెక్షన్ లో మోహన్ బాబు నటించిన 'రౌడీ' సినిమాలో ఓ డైలాగ్ ఆడియోను పంచుకున్నారు.

వీధిలో మొరిగే కుక్క.. 

' సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది. కానీ వీధిలో మొరగడానికి, అడవిలో గర్జించడానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలో అయినా తెలుసుకుంటావన్న ఆశ..' అనే డైలాగ్ ను షేర్ చేస్తూ..' ఇది నా ఫేవరెట్ డైలాగ్. ఇందిలో ప్రతీ డైలాగ్ ఓ స్టేట్మెంట్..' అని రాసుకొచ్చారు. 

మంచు ఫ్యామిలీ వార్ నేపథ్యంలో విష్ణు ఉన్నట్టుండి మోహన్ చెప్పిన డైలాగ్ ను షేర్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. విష్ణు ఇన్ డైరెక్ట్ గా మనోజ్ కు మోహన్ బాబు రూపంలో వార్నింగ్ ఇస్తున్నాడంటూ నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. కొందరైతే మనోజ్ ను విష్ణు కావాలనే టార్గెట్ చేస్తున్నాడనే కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఈ టైంలో విష్ణు ఇలాంటి ట్వీట్ పెట్టడం వెనక అంతరార్థం ఏంటో ఆయనకే తెలియాలి.  

Also Read: ఘోర ప్రమాదం.. 40మంది పాకిస్థానీ వలసదారులను మింగేసిన సముద్రం.. ఎక్కడంటే?

#manchu vishnu vs manchu manoj #manchu vishnu tweet #rtv telugu news #manchu-manoj #mohan-babu #manchu-vishnu #latest-telugu-news #latest-movie-updates
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి

Manchu Lakshmi - Manoj: అక్కా ఏడవకే.. మనోజ్‌ను చూడ...

Manchu Lakshmi - Manoj: అక్కా ఏడవకే.. మనోజ్‌ను చూడగానే కన్నీళ్లు పెట్టుకున్న మంచు లక్ష్మి - VIDEO

ఫ్యామిలీ వివాదాలతో సతమతమవుతున్న తమ్ముడు మంచు మనోజ్‌ని ఓ ఫంక్షన్లో చూసి మంచు లక్ష్మి ఏడ్చేసింది. ఆమె స్టేజ్‌పై ఉన్న సమయంలో మనోజ్ దంపతులు వెళ్లారు. వారిని చూడగానే లక్ష్మి కంటనీరు పెట్టుకుని ఎమోషనల్ అయింది. పక్కనే ఉన్న మౌనిక అక్కా తమ్ముళ్ళను ఓదార్చింది.

New Update
manchu lakshmi gets emotional over seeing manchu manoj

manchu lakshmi gets emotional over seeing manchu manoj

అక్కా తమ్ముళ్ల బంధం ఎన్నటికీ వీడనిది.. విడదీయలేనిది. ఎన్ని గొడవలు జరిగినా.. తిరిగి మళ్లీ ఒక్కటి కావాల్సిందే. అదే మరోసారి నిజమైంది. మంచు ఫ్యామిలీలో  గత కొన్నాళ్లుగా వివాదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. నువ్వా నేనా అన్నట్లుగా మంచు ఫ్యామిలీ గొడవలు చెలరేగాయి. పోలీస్ స్టేషన్ వరకు చేరుకున్నాయి. అక్కడితో ఆగలేదు. ఆఖరికి కోర్టు మెట్లు కూడా ఎక్కారు. 

Also Read :  కల్యాణ్‌రామ్‌ ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’ ట్రైలర్‌ చూశారా? కెవ్ కేక

మంచు మోహన్ బాబు, మంచు విష్ణు ఒకవైపు- మంచు మనోజ్ మరోవైపు. సినిమాను తలపించేలా వీరి వివాదం నడిచింది. ఇప్పటికీ వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా గొడవలు జరుగుతున్నాయి. ఇది ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. ఆ మధ్య వీరు ఒకరినొకరు తిట్టుకుని.. పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చుకున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులు కాస్త సైలెంట్ అయ్యారు. 

Also Read :  'చూపుల్తో గుచ్చి గుచ్చి’ మాస్ జాతర ప్రోమో సాంగ్ అదిరిపోయిందిగా..!

కానీ ఇప్పుడు మరోసారి మంచు ఫ్యామిలీలో చిచ్చు రాజుకుంది. మంచు మనోజ్ మరోసారి తీవ్రమైన ఆరోపణలు చేశాడు. తన కార్లను విష్ణు దొంగిలించాడంటూ తన తండ్రి మోహన్ బాబు ఇంటి ముందు ఆందోళనకు దిగాడు. కూతురి పుట్టినరోజు వేడుకల కోసం రాజస్థాన్ వెళ్లిన వెంటనే మంచు విష్ణు ఈ చోరీకి పాల్పడ్డాడని మనోజ్ ఆరోపణలు చేశాడు. ఇప్పుడు ఇదే రచ్చ కొనసాగుతోంది. 

Also Read :  ట్రెడిషనల్ లుక్ తో కట్టిపడేసిన మిల్కీబ్యూటీ..

ఇలా వరుస వివాదాలతో మంచు ఫ్యామిలీకి కంటి మీద కునుకు లేకుండా పోయింది. మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి ఈ వివాదాలపై నోరు విప్పేందుకు ఇష్టపడటం లేదు. అయితే మంచు లక్ష్మికి తమ్ముడు మనోజ్‌ మీదే ఎక్కువ ప్రేమ ఉన్నట్లు ఎప్పటి నుంచో వార్తలు నడుస్తున్నాయి. గతంలో ఆమె ముంబై నుంచి వచ్చి గొడవలను సరిచేయాలని చూసింది. కానీ ఆమె మాట ఎవరూ వినలేదని.. అక్కడ నుంచి వెంటనే మళ్లీ ఆమె వెళ్లిపోయిందని వార్తలు వినిపించాయి. 

Also Read :  'సూర్య 45'లో మలయాళ బ్యూటీ అనఘా రవి

అక్కా తమ్ముళ్ల అనుబంధం

ఇదిలా ఉంటే తాజాగా మంచు లక్ష్మి, తమ్ముడు మంచు మనోజ్ కలిసారు. ‘టీచ్ ఫర్ ఛేంజ్’ అనే వార్షిక ఫండ్‌రైజర్ కార్యక్రమాన్ని మంచు లక్ష్మి ఏర్పాటు చేసింది. అందులో తన కూతురితో కలిసి ర్యాంప్ వాక్ చేసింది. అదే సమయంలో మంచు లక్ష్మి స్టేజ్ మీద ఉండగానే.. వెనుక నుంచి మంచు మనోజ్ దంపతులు సర్‌ప్రైజ్ చేశారు. దీంతో ఒక్కసారిగా తమ్ముడు మనోజ్‌ను చూసిన మంచు లక్ష్మీ మనసారా హత్తుకుని ఏడ్చేసింది. దీంతో పక్కనే ఉన్న మనోజ్ భర్య ఆమెను ఓదార్చింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇది చూసి నెటిజన్లు.. అక్కా తమ్ముళ్ల అనుబంధం విడదీయలేనిది అంటూ కామెంట్లు పెడుతున్నారు.

(manchu-manoj | manchu lakshmi | manchu family | latest-telugu-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment