ఈ నెల 14న పెద్ద పండుగ సినిమాల్లో భాగంగా విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ విడుదల అయింది. కామెడీ బేస్గా రిలీజ్ అయిన ఈ సినిమా బిగ్ హి కొట్టింది. మూడు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్లో జాయిన్ అయిపోయింది. దీంతో సంక్రాంతికి వస్తున్నాం టీమ్ అంతా సంబరాల్లో మునిగి తేలుతోంది. తాజాగా చిత్ర బృందం మరొకసారి పార్టీ చేసుకుంది. దీంట్లో సినిమా కాస్ట్ అంతా పాల్గొన్నారు వెంకటేష్, హీరోయిన్లు ఐశ్వర్య, మీనాక్షి చౌదరి, డైరెక్టర్ అనిల్ రావిపూడి తదితరులు పాల్గొన్నారు. ఈపార్టీ స్పెషల్ గెస్ట్గా చిన్నోడు...అదే మన టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కూడా పాల్గొన్నారు. తన భార్య నమ్రతతో కలసి పార్టీలో పాల్గొన్నారు. ఈ పార్టీకి మరో దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా వచ్చారు. ఫోటోలకు ఫోజులిచ్చారు. ఇక ఈసినిమా గురించి మహష్ రీసెంట్గ ఒక పోస్ట్ పెట్టారు. సినిమా బావుంది అని...అసలైన పండగ సినిమా అంటూ పొగడ్తల్లో ముంచెత్తారు. వెంకటేశ్, హీరోయిన్లు ఐశ్వర్యా రాజేశ్, మీనాక్షి చౌదరి, బుల్లిరాజు పాత్ర పోషించిన బాలుడి నటన అద్భుతమని కొనియాడారు.
మూడు రోజుల్లోనే..
విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh), అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్లో రూపొందిన ‘సంక్రాంతికి వస్తున్నాం’..జనవరి 14న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి తొలి షో నుంచే బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. సినిమాలో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఉండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ మూవీకి క్యూ కడుతున్నారు. దీంతో కలెక్షన్ల పరంగా కూడా మంచి వసూళ్లు రాబడుతోంది. తొలి రోజే రూ.45 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి వెంకటేష్ కెరీర్లోనే అత్యంత భారీ ఓపెనింగ్ కలెక్షన్లు సాధించిన చిత్రంగా ‘సంక్రాతికి వస్తున్నాం’ నిలిచింది. ఈ సినిమా విడుదలైన తొలి రోజే రికార్డ్ స్థాయి వసూళ్లను నమోదు చేయగా, రెండో రోజు రూ. 32 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. మూడో రోజుకి రూ. 29 కోట్ల వసూళ్లను సాధించింది. మొత్తం మూడు రోజుల్లో ఈ చిత్రం రూ. 106 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించిందని చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది.
Also Read: Telecom: స్పామ్ కాల్స్కు చెక్..సంచార్ సాథీ మొబైల్ యాప్