Unstoppable: ఎన్టీఆర్ కు షాక్ ఇచ్చిన బాలయ్య.. మళ్ళీ అదే తప్పు చేస్తూ?

అన్‌స్టాపబుల్ షోలో ఎన్టీఆర్ పేరును ప్రస్తావించకపోవడంపై చర్చ మొదలైంది. తాజా ఎపిసోడ్ లో బాబీ పని చేసిన హీరోలందరి గురించి బాలయ్య అడిగాడు. కానీ ఎన్టీఆర్ పేరు గానీ, జై లవకుశ సినిమా గురించి కానీ ఎక్కడా ప్రస్థావించలేదు. దీంతో ఫ్యాన్స్ బాలయ్యపై ఫైర్ అవుతున్నారు.

New Update
balayya ntr

బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోపై వివాదం నెలకొంది. ఇటీవల షోకి హాజరైన డైరెక్టర్ బాబీ వ్యాఖ్యలే ఈ వివాదానికి కారణం. ఆ ఇంటర్వ్యూ నందమూరి ఫ్యాన్స్ లో అగ్గి రాజేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీని గురించే చర్చ సాగుతోంది. మ్యాటర్ ఏంటంటే.. అన్‌స్టాపబుల్ షోలో ఎన్టీఆర్ పేరును, అలాగే ఆయన నటించిన సినిమాల పేర్లను ఉద్దేశపూర్వకంగా ప్రస్తావించకపోవడంపై చర్చ మొదలైంది. 

Also Read : 'గేమ్ ఛేంజర్' ట్రైలర్ కు భారీ రెస్పాన్స్.. 24 గంటల్లోనే అన్ని వ్యూసా?

ఇది తాజాగా టెలికాస్ట్‌ అయిన ఎపిసోడ్ లో స్పష్టంగా అర్థమవుతోంది. ఈ ఎపిసోడ్‌లో దర్శకుడు బాబీ చేసిన అన్ని సినిమాలను ప్రస్తావించగా, ఆయన పని చేసిన హీరోల గురించి బాలకృష్ణ అనేక ప్రశ్నలు అడిగారు. అయితే, బాబీతో చేసిన ఎన్టీఆర్ సినిమా జై లవకుశ గురించి లేదా ఎన్టీఆర్ పేరును ఎక్కడా ప్రస్తావించకపోవడం ఎన్టీఆర్ అభిమానులను నిరుత్సాహానికి గురి చేసింది.

Also Read : ఆరు సెంటర్లలో 100 రోజులు.. 'దేవర' సంచలన రికార్డ్

 అంతకుముందు మహేశ్, ప్రభాస్, రామ్‌చరణ్‌ షోకి వచ్చినప్పుడు కూడా షోలో ఎన్టీఆర్ ప్రస్తావన ఎక్కడా రాలేదు. దీంతో కావాలనే ఎన్టీఆర్‌ను కార్నర్ చేస్తున్నారంటూ బాలకృష్ణపై జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. బాలయ్యకు, ఎన్టీఆర్‌ తో మనస్పర్థలపై ఎప్పటినుంచో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన పరిణామంతో అది నిజమేనేమో అనే సందేహాలు సైతం వ్యక్తం అవుతున్నాయి.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

MS Dhoni రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎంట్రీ? వీడియో షేర్ చేసిన కరణ్ జోహార్

చిత్రనిర్మాత కరణ్ జోహార్ ఇండియన్ క్రికెటర్ ఎం. ఎస్ ధోని అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే ధోని ఓ కొత్త రొమాంటిక్ అవతార్ లో కనిపించబోతున్నట్లు వీడియో రిలీజ్ చేశారు. దీంతో ధోని హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

New Update
MS DHONI VIDEO

MS DHONI VIDEO

MS Dhoni టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎం. ఎస్ ధోని క్రికెట్ తో పాటు సినిమా రంగంలోకి కూడా అడుగుపెట్టారు. 2023లో  'లెట్స్ గెట్ మ్యారీడ్' అనే సినిమాకు డిస్ట్రిబ్యూటర్ గా పనిచేశారు. అయితే ఇప్పుడు ధోని హీరోగా కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి కారణం బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ షేర్ చేసిన వీడియో.  ధోని ఓ కొత్త రొమాంటిక్ అవతార్ లో కనిపించబోతున్నారు అంటూ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో ధోని హార్ట్  సింబల్ బెలూన్ చేతిలో పట్టుకొని కనిపించారు. దీంతో ఫ్యాన్స్ ధోని హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అని అనుకుంటున్నారు. అంతేకాదు కరణ్ ఈ వీడియోను షేర్ చేయడంతో.. ధోనిని కరణ్ జోహార్ పరిచయం చేయబోతున్నారా అని కామెంట్లు పెడుతున్నారు. కానీ.. ఇంతలోనే అసలు విషయం బయటపడింది.

యాడ్ ఫిల్మ్ షూట్

 ఆ వీడియో ఒక యాడ్ ఫిల్మ్ షూట్ కి సంబంధించినదని తెలిసింది. ఈ వీడియోకి గల్ఫ్ ఆయిల్ కంపెనీని ట్యాగ్ చేయడంతో.. ఇది యాడ్ షూట్ కి సంబంధించిన వీడియో అని అర్థమైంది. ఏదేమైనా మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అయితే గతంలో కూడా ధోని సినిమాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. ఇటీవలే రామ్ చరణ్ - బుచ్చిబాబు rc16 లో ధోని క్యామియో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత చిత్రబృందం అలాంటిదేమి లేదని చెప్పడంతో పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది.  

ప్రస్తుతం ధోని  CSK కెప్టెన్‌గా గా వ్యవహరిస్తున్నారు. వరుసగా ఐదు మ్యాచుల పరాజయాల తర్వాత.. తాజాగా జరిగిన లక్నో సూపర్ జెయింట్స్‌ వర్సెస్ CSK మ్యాచ్ లి చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. ఈ విజయంలో ధోని కీలక పాత్ర పోషించడం విశేషం. 

telugu-news | latest-news | ms-dhoni | karan-johar

Advertisment
Advertisment
Advertisment