Jr NTR : ఫ్యామిలీతో లండన్ లో చిల్ అవుతున్న తారక్.. వీడియో వైరల్

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి చిల్ అవుతున్నాడు. షూటింగ్ నుంచి విరామం తీసుకుని ప్రస్తుతం లండన్‌లో తన కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతున్నారు. అక్కడ హైడ్ పార్క్‌లో పిల్లలతో కలిసి ఎన్టీఆర్ ఎంజాయ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది .

New Update
Jr Ntr Family London Trip

Jr Ntr Family London Trip

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ఈ ఇయర్ 'దేవర' తో భారీ విజయాన్ని అందుకున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. 'RRR' లాంటి మల్టీస్టారర్ తర్వాత ఎన్టీఆర్ అందుకున్న సోలో పాన్ ఇండియా హిట్ ఇది.

ఈ సక్సెస్ తో మళ్ళీ వరుస సినిమాలను లైన్ లో పెట్టిన తారక్.. ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి చిల్ అవుతున్నాడు. షూటింగ్ నుంచి విరామం తీసుకుని, కుటుంబంతో సమయాన్ని ఆస్వాదిస్తున్నారు. ఆయన ప్రస్తుతం లండన్‌లో తన కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతున్నారు.

Also Read: పవన్ ను ఇబ్బంది పెట్టకండి.. ఫ్యాన్స్ కు 'ఓజీ' మేకర్స్ రిక్వెస్ట్

Also Read: యూట్యూబ్ ను షేక్ చేసిన ఏకైక ఇండియన్ సాంగ్..'కుర్చీ మడతపెట్టి' నయా రికార్డ్

లండన్ లో వెకేషన్..

అక్కడ హైడ్ పార్క్‌లో పిల్లలతో కలిసి ఎన్టీఆర్ ఎంజాయ్ చేస్తున్న వీడియో ఒకటి బయటికొచ్చింది. ఆ వీడియోను ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తున్నారు. తారక్ ఫ్యామిలీతో కలిసి న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం లండన్ వెళ్లినట్లు తెలుస్తోంది. సెలెబ్రేషన్స్ అయిపోగానే తిరిగి ఇండియాకు రానున్నారు.

వచ్చిన వెంటనే షూటింగ్ తో బిజీ కానున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ హృతిక్ రోషన్‌తో కలిసి వార్ 2 సినిమా చేస్తున్నారు. ఈ మూవీ ఇప్పటికే పలు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. దీని   తరువాత, కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ సినిమాలో నటించబోతున్నాడు. ఇటీవలే ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. ఫిబ్రవరిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

MS Dhoni రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎంట్రీ? వీడియో షేర్ చేసిన కరణ్ జోహార్

చిత్రనిర్మాత కరణ్ జోహార్ ఇండియన్ క్రికెటర్ ఎం. ఎస్ ధోని అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే ధోని ఓ కొత్త రొమాంటిక్ అవతార్ లో కనిపించబోతున్నట్లు వీడియో రిలీజ్ చేశారు. దీంతో ధోని హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

New Update
MS DHONI VIDEO

MS DHONI VIDEO

MS Dhoni టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎం. ఎస్ ధోని క్రికెట్ తో పాటు సినిమా రంగంలోకి కూడా అడుగుపెట్టారు. 2023లో  'లెట్స్ గెట్ మ్యారీడ్' అనే సినిమాకు డిస్ట్రిబ్యూటర్ గా పనిచేశారు. అయితే ఇప్పుడు ధోని హీరోగా కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి కారణం బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ షేర్ చేసిన వీడియో.  ధోని ఓ కొత్త రొమాంటిక్ అవతార్ లో కనిపించబోతున్నారు అంటూ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో ధోని హార్ట్  సింబల్ బెలూన్ చేతిలో పట్టుకొని కనిపించారు. దీంతో ఫ్యాన్స్ ధోని హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అని అనుకుంటున్నారు. అంతేకాదు కరణ్ ఈ వీడియోను షేర్ చేయడంతో.. ధోనిని కరణ్ జోహార్ పరిచయం చేయబోతున్నారా అని కామెంట్లు పెడుతున్నారు. కానీ.. ఇంతలోనే అసలు విషయం బయటపడింది.

యాడ్ ఫిల్మ్ షూట్

 ఆ వీడియో ఒక యాడ్ ఫిల్మ్ షూట్ కి సంబంధించినదని తెలిసింది. ఈ వీడియోకి గల్ఫ్ ఆయిల్ కంపెనీని ట్యాగ్ చేయడంతో.. ఇది యాడ్ షూట్ కి సంబంధించిన వీడియో అని అర్థమైంది. ఏదేమైనా మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అయితే గతంలో కూడా ధోని సినిమాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. ఇటీవలే రామ్ చరణ్ - బుచ్చిబాబు rc16 లో ధోని క్యామియో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత చిత్రబృందం అలాంటిదేమి లేదని చెప్పడంతో పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది.  

ప్రస్తుతం ధోని  CSK కెప్టెన్‌గా గా వ్యవహరిస్తున్నారు. వరుసగా ఐదు మ్యాచుల పరాజయాల తర్వాత.. తాజాగా జరిగిన లక్నో సూపర్ జెయింట్స్‌ వర్సెస్ CSK మ్యాచ్ లి చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. ఈ విజయంలో ధోని కీలక పాత్ర పోషించడం విశేషం. 

telugu-news | latest-news | ms-dhoni | karan-johar

Advertisment
Advertisment
Advertisment