/rtv/media/media_files/2024/12/30/qCbWIiCtZXGYysLf6Np6.jpg)
chiranjeevi
భారత్ ను గ్లోబల్ ఎంటర్ టైన్ మెంట్ హబ్ గా మార్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది చివర్లో వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ ను నిర్వహించనున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో కొందరు ప్రముఖ నటీనటులు , వ్యాపారవేత్తలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమ్మిట్ కోసం వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నారు.
తాజాగా ఇందులో భాగం కావడం ఎంతో ఆనందంగా ఉందని చిరంజీవి పోస్ట్ పెట్టారు.మోడీతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతోన్న వీడియోను పంచుకున్నారు.అడ్వైజరీ బోర్డ్ లో భాగం కావడం ఆనందంగా ఉందంటూ మోడీకి ధన్యవాదాలు తెలిపారు.
Also Read: Trump-America: అమెరికాలోని భారతీయులకు బిగ్ రిలీఫ్.. ఆ ఉత్తర్వులను కొట్టిపారేసిన కోర్టు
వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్ మెంట్ సమ్మిట్ కోసం అడ్వైజరీ బోర్డ్ లో భాగం కావడం ఇతర సభ్యులతో కలిసి నా ఆలోచనలను పంచుకోవడం నిజంగా సంతోషంగా ఉంది.మోడీ ఆలోచనలు భారతదేశాన్ని ముందుకు నడిపిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. అని చిరంజీవి పేర్కొన్నారు.
ఇక ఈ సమావేశంలో అమితాబ్ బచ్చన్ ,మిథున్ చక్రవర్తి, రజనీకాంత్ ,చిరంజీవి,నాగార్జున,షారుక్ ఖాన్ అమిర్ ఖాన్ అక్షయ్ కుమార్ అనిల్ కపూర్ అనుపమ్ ఖేర్,హేమామాలిని,దీపిక పదుకొణె లతో పాటు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ,ఆనంద్ మహీంద్ర కూడా ఈ సమావేశంలో పాల్గొని సమ్మిట్ పై వారి అభిప్రాయాలు పంచుకున్నారు.
Thank you Hon’ble Prime Minister Shri @narendramodi ji for this honor. 🙏🙏
— Chiranjeevi Konidela (@KChiruTweets) February 8, 2025
It was indeed a privilege to be part of the Advisory Board for WAVES ( World Audio Visual Entertainment Summit ) and share my two cents along with other esteemed members.
I have no doubts that #WAVES,… https://t.co/zYxpiWVgli pic.twitter.com/VvFj0XGjzt
Also Read: Kshama Sawanth: ఇండో అమెరికన్ నాయకురాలు క్షమా సావంత్కు భారత్ వీసా తిరస్కరణ