BIG BREAKING: హీరో వేణుపై కేసు!

హీరో వేణు పై హైదరాబాద్‌ పోలీస్‌ స్టేషన్ లో కేసు నమోదైంది.ఓ కన్‌స్ట్రక్షన్‌ కు సంబంధించిన విషయంలో వేణు పై కేసు నమోదైంది.సదరు సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని వేణు,ప్రోగ్రెసివ్‌ కన్‌స్ట్రక్షన్‌ నిర్వహకులు రద్దు చేసుకోవడంతో కంపెనీ ఎండీ ఫిర్యాదు చేశారు.

New Update
venu

venu

తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడు వేణు తొట్టెంపూడి గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు.తన సూపర్‌ యాక్షన్‌తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈయన ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి కొన్ని సినిమాల్లో యాక్ట్‌ చేశారు. కానీ మళ్ళీ ఏమైందో తెలియదు కానీ ఆయన ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. అలాంటి ఈయన ఇన్నాళ్లు మీడియాకు దూరంగా ఉండి, ఇప్పుడు సడన్గా వార్తల్లో నిలిచారు.

Also Read: Top 10 Countries: ప్రపంచంలో టాప్‌ 10 శక్తిమంతమైన దేశాల జాబితా విడుదల.. భారత్ ఎన్నో స్థానమంటే ?

తాజాగా రూ.1000 కోట్ల స్కామ్ లో ఈయనపై కేసు నమోదైనట్లు సమాచారం. ఈ విషయం తెలిసి, అటు అభిమానులతో పాటు ఇటు సినీ సెలబ్రిటీలు సైతం షాక్‌ అవుతున్నారు. అసలు ఏం జరిగిందంటే...ప్రముఖ నటుడు వేణు తొట్టెంపూడి, ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ సంస్థ నిర్వాహకులు హేమలత, భాస్కరరావు, శ్రీవాణి, ఎండి పాతూరి ప్రవీణ్ పై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు మంగళవారం కేస్ నమోదు చేసినట్లు సమాచారం. 

Also Read: Bullet Train: హైదరాబాద్‌కు బుల్లెట్ రైలు.. ముంబై, చెన్నై, బెంగళూరుకు ఇక గంటల్లోనే రయ్‌..రయ్‌!

పోలీసులు తెలిపిన వివరాల మేరకు గతంలో ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ.. ఉత్తరాఖండ్ లో జల విద్యుత్ ప్రాజెక్టుకి సంబంధించిన ఒక పనిని తెహ్రీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా సొంతం చేసుకుంది. బంజారాహిల్స్ లోని రిత్విక్ ప్రాజెక్ట్స్, స్వాతి కన్స్ట్రక్షన్స్ సబ్ కాంట్రాక్టుకి తీసుకున్నాయి. అయితే స్వాతీ కన్స్ట్రక్షన్స్ మధ్యలో తప్పుకోవడంతో రిత్విక్ ప్రాజెక్ట్ వారు 2002లో పనులు మొదలుపెట్టారు. ఇక ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్, బీ.హెచ్.డీ.సీ మధ్య వివాదం తలెత్తడంతో ఇరుపక్షాలు ఢిల్లీ కోర్టును ఆశ్రయించాయి. అటు పనులకు సంబంధించి రూ.1,010.25 కోట్లు డీహెచ్డీసీ ఖాతాలో జమ అయ్యాయి. 

రిత్విక్ సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని వేణు, ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ నిర్వహకులు రద్దు చేశారు. దీంతో ఎండీ రవికృష్ణ ఫిర్యాదు మేరకు బంజారా హిల్స్ పోలీసులు ఛార్జీ షీట్ దాఖలు చేయగా.. నాంపల్లి రెండో అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ నిర్వహకులపై అలాగే వేణుపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

Also Read: Trump: గాజాను స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ హెచ్చరికలు!

Also Read: Summer Effect: భగభగమంటున్న భానుడు..రానున్న 15 రోజులు జర జాగ్రత్త.. అధికారుల హెచ్చరికలు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Mass Jathara Song: 'చూపుల్తో గుచ్చి గుచ్చి’ మాస్ జాతర ప్రోమో సాంగ్ అదిరిపోయిందిగా..!

మాస్ మహారాజ్ రవితేజ "మాస్ జాతర" మూవీ నుండి ‘తు మేరా లవర్’ పాట టీజర్‌ రిలీజ్ చేసారు మేకర్స్. ఇందులో ‘చూపుల్తో గుచ్చి గుచ్చి’ పాట ను మళ్ళీ రీ క్రియేట్ చేసారు. ఈ ఎనర్జిటిక్ సాంగ్‌ను ఏప్రిల్ 14న పూర్తిగా రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

New Update
Mass Jathara Song

Mass Jathara Song

మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) తన 75వ చిత్రంగా "మాస్ జాతర"తో మరోసారి తెరపై సందడి చేయడానికి రెడీ అవుతున్నారు. శ్రీలీల ఈ మూవీలో కథానాయికగా నటిస్తుండగా, ఈ చిత్రానికి భాను భోగవరపు దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

Chiranjeevi: డ్యాన్స్ చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయిన చిరంజీవి..!

‘చూపుల్తో గుచ్చి గుచ్చి’ రీ క్రియేట్..

ఇటీవల రిలీజ్ చేసిన ‘తు మేరా లవర్’ పాట టీజర్‌ మాస్ ఆడియన్స్ లో ఫుల్ జోష్ నింపింది. ఈ పాటలో ‘ఇడియట్’ సినిమాలోని పాపులర్ బీట్ ‘చూపుల్తో గుచ్చి గుచ్చి’ను మళ్ళీ రీ క్రియేట్ చేసారు. అంతేకాదు, అప్పట్లో రవితేజ వేసిన ఐకానిక్ స్టెప్పులను కూడా రీ-క్రియేట్ చేశారు. ఈ మాస్ మూమెంట్స్ అభిమానులకు కిక్ ఇస్తున్నాయి.

Also Read: మహేష్ హీరోయిన్ పై కన్నేసిన బన్నీ..!

ఈ ఎనర్జిటిక్ సాంగ్‌ను ఏప్రిల్ 14న పూర్తిగా రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. శ్రీలీలతో కలిసి రవితేజ చేసే డ్యాన్స్ ఈసారి ఎలాంటి మాస్ హంగామా చేస్తుందో చూడాల్సిందే!

Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!

Also Read: 'మంగపతి' గెటప్‌లో శివాజీ స్పెషల్ వీడియో వైరల్

 

Mass Jathara Song | Hero Ravi Teja | actress-sreeleela | 2025 Tollywood movies | latest tollywood updates | telugu-cinema-news | telugu-film-news | latest-telugu-news | today-news-in-telugu | telugu-news

Advertisment
Advertisment
Advertisment