ఆర్జీవీకి ఏపీ పోలీసులు బిగ్ షాక్.. మరోసారి నోటీసులు

డైరెక్టర్ ఆర్జీవీకి ఏపీ పోలీసులు మరోసారి నోటీసులు పంపారు. అసభ్యకర పోస్టులు చేసిన కేసులో ఫిబ్రవరి 4న విచారణకు హాజరు కావాలని ఒంగోలు పోలీసులు ఆర్జీవీ వాట్సాప్ నంబర్‌కి నోటీసులు జారీ చేశారు. అయితే ఫిబ్రవరి 7న విచారణకు వస్తానని చెప్పినట్లు సమాచారం.

New Update
RGV notice

RGV notice Photograph: (RGV notice)

వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఏపీ పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. అసభ్యకర పోస్టులు చేసిన కేసులో ఫిబ్రవరి 4న విచారణకు హాజరు కావాలని ఆర్జీవీ వాట్సాప్ నంబర్‌కి ఒంగోలు పోలీసులు నోటీసులు పంపారు. అయితే ఫిబ్రవరి 4వ తేదీన షూటింగ్ వల్ల హాజరు కాలేనని ఫిబ్రవరి 7న విచారణకు రావడానికి ప్రయత్నిస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే విచారణకు హాజరు కావాలని ఇప్పటికే పలుమార్లు ఏపీ పోలీసులు నోటీసులు పంపారు. కానీ పలు కారణాల వల్ల విచారణకు హాజరు కాలేదు.

ఇది కూడా చూడండి: Maha Kumbh Mela 2025: కుంభమేళాలో తొక్కిసలాటతో స్పెషల్ రైళ్లు రద్దు.. రైల్వేశాఖ క్లారిటీ!

ఇది కూడా చూడండి: Suryapet Murder: చంపింది నాన్నమ్మనే.. ప్రైవేట్‌ పార్ట్స్‌ను కసితీరా తొక్కి.. భార్గవి సంచలన నిజాలు!

కేసు ఎందుకంటే?

రాం గోపాల్ వర్మ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ ఫోటోలను మార్ఫించి చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో టీడీపీ ప్రధాన కార్యదర్శి రామలింగయ్య ఆర్జీవీపై మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు గతేడాది కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు నవంబర్ 19, 25 తేదీల్లో ఆర్జీవీకి నోటీసులు పంపించారు. అయినా కూడా ఆర్జీవీ విచారణకు హాజరు కాలేదు. ఈ క్రమంలోనే ఒంగోలు పోలీసులు మరోసారి ఆర్జీవీకి నోటీసులు పంపారు.

ఇది కూడా చూడండి: Mazaka Movie: రోడ్లపై సందీప్ కిషన్, రావు రమేష్ డాన్సులు.. 'బ్యాచిలర్స్ ఆంథెమ్' వచ్చేసింది !

ఇది కూడా చూడండి: TG, AP MLC Elections: తెలంగాణ, ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్.. వివరాలివే!

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

మలయాళ నటితో రొమాన్స్.. గోపీచంద్ కొత్త సినిమా ముహూర్తం! ఫొటోలు వైరల్

మాచో స్టార్ గోపీచంద్ కొత్త మూవీని అనౌన్స్ చేశారు. SVCC బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈరోజు పూజ కార్యక్రమాలతో మూవీని లాంచ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

New Update

Gopichand టాలీవుడ్ స్టార్ హీరో గోపీచంద్ SVCC(శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర)  బ్యానర్ లో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. గోపీచంద్ సూపర్ హిట్  'సాహసం' తర్వాత రెండోసారి ఈ నిర్మాణ సంస్థతో చేతులు కలిపారు. SVCC 39వ చిత్రంగా ఈ మూవీ రూపొందనుంది. ఈ సందర్భంగా ఈరోజు పూజ కార్యక్రమాలతో సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేశారు. నిర్మాతలు BVSN ప్రసాద్, బాపీనీడు, గోపిచంద్ తదితరులు పూజ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

మలయాళ నటి హీరోయిన్ గా 

కుమార్ సాయి దర్శకత్వం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్యామ్ దత్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ఇందులో గోపిచంద్ సరసన కథానాయికగా మలయాళ నటి మీనాక్షి దినేష్ నటిస్తోంది. మే లేదా జూన్ లో షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. సినిమాలోని ఇతర నటీనటుల విషయాలు కూడా త్వరలోనే వెల్లడించనున్నారు.

latest-news | cinema-news | actor-gopichand 

Also Read: Pahalgam Attack: పహల్గాంలో నా బర్త్ డే వేడుకలు, షూటింగ్ కూడా.. విజయ్ దేవరకొండ సంచలన ట్వీట్!

Advertisment
Advertisment
Advertisment