ఆర్జీవీకి బిగ్ షాక్.. మరో కేసులో సీఐడీ నోటీసులు

రాం గోపాల్ వర్మకి ఏపీ సీఐడీ సీఐ తిరుమలరావు నోటీసులు పంపారు. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా కొందరి మనోభావాలు దెబ్బతీసేలా తీశారని బండారు వంశీకృష్ణ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 10న గుంటూరు సీఐడీ కార్యాలయానికి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు.

New Update
rgv new year tweet

rgv

దర్శకుడు రాంగోపాల్‌ వర్మ మెడకు ఉచ్చు బిగుస్తోంది. వరుస కేసులు ఆయనని వదలడం లేదు. అసభ్యకర పోస్టులు పెట్టిన కేసులో శుక్రవారం ఒంగోలు రూరల్‌ పోలీస్ స్టేషన్‌లో ఆర్జీవీ విచారణకు హాజరయ్యారు. దాదాపు 9 గంటల పాటు పోలీసులు అతన్ని ప్రశ్నించారు. అయితే ఈ సమయంలోనే మరో కేసు విషయంలో కూడా ఏపీ సీఐడీ నుంచి ఆర్జీవీకి నోటీసులు వెళ్లాయి.

ఇది కూడా చూడండి: Jeeth Adani: గుజరాతీ సంప్రదాయంలో వేడుకగా గౌతమ్‌ అదానీ చిన్న కుమారుడి వివాహం!

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా వల్ల..

ఈ నెల 10వ తేదీన గుంటూరు సీఐడీ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలని సీఐడీ సీఐ తిరుమలరావు నోటీసులు పంపారు. 2019లో ఆర్జీవీ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమాను తీశారు. కొందరు మనోభావాలు దెబ్బతీసే విధంగా సినిమా తీశారని గతేడాది తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు ఆర్జీవీకి ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఉన్నప్పుడే నోటీసులు ఇచ్చారు. ఈ కేసు విషయంలో ఆర్జీవీ విచారణకు వెళ్తాడో లేదో చూడాలి. 

ఇది కూడా చూడండి: Horoscope Today:నేడు ఈ రాశి వారికి ఆదాయం పదింతలు అవుతుంది...మీ రాశేనేమో చూసుకోండి మరి!

ఇదిలా ఉండగా మద్దిపాడు కేసు విషయంలో ఆర్జీవీ ఒంగోలు రూరల్ సీఐ కార్యాలయంలో విచారణకు వెళ్లారు. అయితే ఈ కేసులో కోర్టు ఆర్జీవీకి ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయినా కూడా పోలీసు విచారణకు సహకరించాలని కోర్టు ముందుగానే ఆదేశించింది. దీంతో ఇవాళ పోలీసు విచారణకు ఆర్జీవీ హాజరయ్యారు. ఈ విచారణలో ఆర్జీవిని పలు ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Venky - Trivikram: వెంకీ - త్రివిక్రమ్ కాంబో ఫిక్స్..

వెంకటేష్, త్రివిక్రమ్ కాంబోలో ఓ ఫ్యామిలీ డ్రామా రాబోతోంది. 'సంక్రాంతికి వస్తున్నాం' భారీ హిట్‌ తరువాత ఎన్నో కథలు విన్న వెంకీ త్రివిక్రమ్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. త్రివిక్రమ్ వెంకీ చిత్రాన్ని పూర్తి చేసి తర్వాత బన్నీతో మరో సినిమా ప్లాన్ చేస్తున్నాడు .

New Update
Venky - Trivikram

Venky - Trivikram

Venky - Trivikram: టాలీవుడ్ లో ఎంతో కాలంగా ఎదురు చూసిన కాంబో, చివరికి నిజమవుతోంది. స్టార్ హీరో వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి త్వరలో ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. గతంలో 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లేశ్వరి' వంటి హిట్ చిత్రాలకు త్రివిక్రమ్ కథ, మాటలు అందించగా, ఆ సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. కానీ త్రివిక్రమ్ డైరెక్షన్లో వెంకీ సినిమా చేయలేదు. మధ్యలో అనేక ప్రయత్నాలు జరిగినప్పటికీ, అవన్నీ వర్కౌట్ కాలేకపోయాయి.

Also Read: వీకెండ్ కలెక్షన్స్ లో దుమ్ము దులిపేసిన ‘జాట్’..

అయితే ఇప్పుడు వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ కొత్త చిత్రం ఖరారైంది. ఇటీవలే 'సంక్రాంతికి వస్తున్నాం' వంటి భారీ హిట్‌ తరువాత, వెంకటేష్ తన తదుపరి సినిమాపై ఎంతో జాగ్రత్తగా ఆలోచిస్తున్నాడు. ఎన్నో కథలు విన్న తరువాత, త్రివిక్రమ్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

Also Read: ఒక్క మాటతో ప్రభాస్ 'స్పిరిట్'ని ఆకాశానికి ఎత్తేసిన రాజమౌళి..

ఇక త్రివిక్రమ్ ప్రస్తుతం అల్లు అర్జున్‌తో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఆ ప్రాజెక్ట్ కు ముందు అట్లీ- బన్నీ సినిమా మొదలవడంతో, త్రివిక్రమ్‌కి  ఖాళీ సమయం లభించింది. ఈ సమయంలో వెంకటేష్ సినిమా పూర్తి చేసి, ఆ తర్వాత బన్నీ ప్రాజెక్ట్‌పై ఫోకస్ పెట్టాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడు.

Also Read: నరరూప రాక్షసుడిని చూస్తారు.. మే 1న థియేటర్లలో కలుద్దాం: నాని

వెంకటేష్- త్రివిక్రమ్ కలయికలో రాబోయే సినిమా ఫ్యామిలీ డ్రామాగా రూపొందనుందని టాక్. ఫ్యామిలీ డ్రామా కాబట్టి షూటింగ్ పనులు వేగంగా ముగించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లకు పేరున్న ఈ కాంబోపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు