Amaran: ఓటీటీలోకి వచ్చేస్తున్న అమరన్.. ఎప్పుడంటే ?

వరల్డ్ వైడ్‌గా అమరన్ మూవీ రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డిసెంబరు 5న తెలుగు, తమిల్, మలయాళం, కన్నడ తో పాటు హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌ కానుంది.

New Update
Amaran

కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘అమరన్’. రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించింది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 

Also Read: ఎన్నికల ఫలితాలపై మీ అనుమానాలు వింటాం.. కాంగ్రెస్‌కు ఈసీ పిలుపు

Amaran Movie On OTT

ఇండియన్ ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్‌గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా అలరించింది. దీపావళి కానుకగా తమిళ్, తెలుగు, మళయాలం భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ అందుకుంది. ఈ చిత్రాన్ని రాజ్ కమల్ బ్యానర్‌పై కమల్ హాసన్, సోనీ పిక్చర్స్ సంయుక్తగా నిర్మించారు. 

Also Read: బైక్‌ను తప్పించబోయి బస్సు బోల్తా... అక్కడికక్కడే 10 మందికి పైగా మృతి

ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అన్ని భాషల్లో సూపర్ హిట్ అందుకుంది. ఇప్పటి వరకు ఒక మంచి హిట్ కోసం ఎదురుచూసిన శివ కార్తికేయకు ఈ సినిమా అదిరిపోయే హిట్ ఇచ్చిందనే చెప్పాలి. ఈ మూవీలో ముఖ్యంగా లవ్, ఎమోషన్ ప్రేక్షకుల మదిని దోచుకున్నాయి. దానికి తోడు సాంగ్స్ అయితే సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లాయనే చెప్పాలి. 

Also Read: ఫడ్నవిస్‌కు బిగ్ షాక్.. మహారాష్ట్ర సీఎంగా కేంద్రమంత్రికి ఛాన్స్

ఇలా స్టోరీ, సాంగ్స్‌తో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పటికి వరల్డ్ వైడ్‌గా అమరన్ మూవీ రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇలా హిట్ టాక్‌తో ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ బయటకొచ్చింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను భారీ ధరకు కొనుగోలు చేసిన నెట్ ఫ్లిక్స్.. ఓటీటీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసింది. అమరన్ సినిమాను డిసెంబరు 5న తెలుగు, తమిల్, మలయాళం, కన్నడ తో పాటు హిందీ భాషలలోను స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు తెలిపింది.

Also Read :  దేశానికే అవమానం.. బంగ్లాదేశ్ విద్యార్థులు ఇండియా జాతీయ జెండాపై..

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam Terror Attack: ఉగ్రదాడిలో 28 మంది మృతి.. తనికెళ్ల భరణి కన్నీటి కవిత

పహల్గాం టెర్రరిస్టు అటాక్‌పై సినీ నటుడు తనికెళ్ల భరణి స్పందించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక కన్నీటి కవితను షేర్ చేసారు. కాశ్మీరంలోనే కుంకం పువ్వెందుకు పూస్తుందో నా కర్ధమైపోయింది! అంటూ ఆ కవిత సాగుతుంది. ప్రస్తుతం అది నెట్టింట వైరల్‌గా మారింది.

New Update
Pahalgam Terror Attack

Pahalgam Terror Attack

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అందమైన ప్రదేశాలను చూసేందుకు వచ్చిన టూరిస్టులపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో దాదాపు 28 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ముస్లిమేతరులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడినట్లు సాక్ష్యులు చెబుతున్నారు. 

ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

అమాయక ప్రజల మృతిపై ఇప్పటికే సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు, వ్యాపార వేత్తలు సంతాపం తెలిపారు. ఈ చర్యలకు పాల్పడిన వారిని అస్సలు వదలకూడదని.. కఠినంగా శిక్షించాలంటూ భారతీయులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ సీనియర్ యాక్టర్ తనికెళ్ల భరణి స్పందించారు. ఈ మేరకు ఒక కవితతో ఉన్న పోస్టర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

కన్నీటి కవిత

కాశ్మీరంలోనే కుంకం పువ్వెందుకు పూస్తుందో నా కర్ధమైపోయింది!
అక్కడ ఉన్నట్టుండి పాకే పాకే పసిబిడ్డ నెత్తురు ముద్దై పోతుంది. 

సామగానం చేసే కాశ్మీరీ పండితుల కంఠాల్లోంచి వేదం ఆగి- రుధిరం బైటికొస్తుంది.

అక్కడ రేపు పల్లకీ లెక్కి ఊరేగాల్సిన పెళ్ళికొడుకులు ఇవాళే పాడెక్కుతారు...

ఆ లోయలో హిమాలయాలు సైతం మూర్తీభవించిన వైధవ్యాల్లా ఉంటాయ్

భరతమాత కిరీటం వొరుసుకునీ నిరంతరం అక్కడ నెత్తురోడుతూ ఉంటుంది !

బుద్ధుడు కూడా కళ్ళూ నోరూ మూసుకుని మళ్ళీ అంతర్ముఖుడౌతాడు !!

ఎప్పుడో 40 ఏళ్ళ క్రితం రాసిన కవిత, ఇంకా తడిగానే ఉంది!! అంటూ తనికెళ్ల భరణి ఒక కవితను పంచుకున్నారు. ఇప్పుడది నెట్టింట వైరల్‌గా మారింది. 

 

pahalgam | Pahalgam attack | pahalgam breaking news | tanikella-bharani | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment