Children  Eating Sweets: మీ పిల్లలు ఎక్కువగా స్వీట్లు తింటున్నారా?.. ఇలా మానిపించండి

స్వీట్లు ఎక్కువగా తినడం ఆరోగ్యానికి హానికరం. అయితే చిన్న పిల్లల స్వీట్లు తినడానికి ఎక్కువ ఇష్టపడతారు.స్వీట్లు ఎక్కువగా తినడం వల్ల భవిష్యత్తులో మధుమేహం లాంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువ. ఈ అలవాటు ఎలా మానిపించాలో తెలుసుకునేందుకు ఆర్టికల్ లోకి వెళ్లండి.

New Update
Children  Eating Sweets: మీ పిల్లలు ఎక్కువగా స్వీట్లు తింటున్నారా?.. ఇలా మానిపించండి

Children  Eating Sweets: ప్రతి ఒక్కరూ తీపి ఆహారాన్ని ఇష్టపడతారు. అది స్వీట్లు, చాక్లెట్ లేదా ఏదైనా ఇతర తీపి వంటకం కావచ్చు. కానీ స్వీట్లు ఎక్కువగా తినడం ఆరోగ్యానికి హానికరం. చిన్న పిల్లల గురించి చెప్పాలంటే స్వీట్లు తినడానికి ఎక్కువ ఇష్టపడతారు. దాని వల్ల ఎక్కువగా రోగాల బారిన పడే ప్రమాదం ఉందని ఆరోగ్య వైద్యులు హెచ్చరిస్తున్నారు. తల్లిదండ్రులు ఎంత ప్రయత్నించినా పిల్లలతో స్వీట్లు మానిపించలేరు. అలాంటి పరిస్థితిలో చాలా మంది తల్లిదండ్రులు ఆందోళన చెందుతుంటారు. పిల్లలు ఎక్కువ స్వీట్లు తింటే ఎలాంటి ఇబ్బందులు వస్తాయో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

ఆరోగ్యానికి హానికరం:

  • తీపి పదార్ధాల పేరు వినగానే మన నోటిలో నీళ్లు వస్తాయి. కానీ తీపిని ఎక్కువగా తినడం ఆరోగ్యానికి ప్రమాదకరం. చిన్న పిల్లలు ఎక్కువ మోతాదులో స్వీట్లు తింటారు. దాని కారణంగా వారు బరువు పెరుగుతారు. చిన్న వయస్సులోనే అనేక రోగాల బారిన పడుతుంటారు. అంతే కాదు స్వీట్లు ఎక్కువగా తినడం వల్ల భవిష్యత్తులో మధుమేహం వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. పిల్లలు చాక్లెట్, టోఫీ లేదా స్వీట్లు తిన్నప్పుడు వాళ్ల దంతాలు కుళ్ళిపోతాయి. దాని కారణంగా పిల్లవాడు క్రమంగా అనారోగ్యానికి గురవుతాడు.

అలవాటు ఎలా మానిపించాలి?

  • స్వీట్లు తినే వ్యసనం వదిలించుకోవటం సులభం కాదు. దీని కోసం నెమ్మదిగా ప్రారంభించాలి. చిన్న పిల్లలు స్వీట్లు తినాలని కోరుకుంటే వారిని పెరుగు, పండ్లు లేదా జ్యూస్ తినేలా చేస్తే వారి కడుపు నిండుగా ఉంటుంది. పిల్లలకు స్వీట్లు తినాలనే కోరిక కూడా తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. కొన్నిసార్లు భావోద్వేగానికి లోనై పిల్లలకు చాక్లెట్లు ఇస్తాం. కానీ అలా చేయడం చాలా తప్పు. ఇంట్లో ఉన్న అన్ని స్వీట్ ఐటమ్స్ ఎవరికైనా ఇచ్చేయాలి. దీంతో ఇంట్లో స్వీట్లు కనిపించకపోతే పిల్లలు కూడా కావాలని అడగరు.

ఇది కూడా చదవండి: ఉల్లిపాయలు ఎక్కువ రోజు నిల్వ ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

HariHaraVeeraMallu Release: వీరమల్లు విడుదల డౌటే..? పవన్ ఫ్యాన్స్ కి షాకింగ్ న్యూస్

పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ 'హరిహర వీరమల్లు' మరోసారి వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. మే 9న విడుదల కానుండగా.. ఇంకా షూటింగ్ పనులు పెండింగ్ ఉన్నట్లుగా సమాచారం. పవన్ ఆరోగ్యం, అలాగే కొడుకుకు ప్రమాదం జరగడం ఆలస్యానికి కారణమని టాక్.

New Update

HariHaraVeeraMallu Release:  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు మరోసారి షాక్ తగిలింది. ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడిన  'హరిహర వీరమల్లు' మళ్ళీ పోస్ట్ ఫోన్ కానున్నట్లు తెలుస్తోంది. నాలుగేళ్ళ క్రితం మొదలుపెట్టిన ఈ సినిమాకు ఇంకా థియేటర్ మోక్షం కలగడం లేదు. మే 9న విడుదల చేయాలని మేకర్స్ ప్రకటించగా.. షూటింగ్ పనులు ఇంకా పెండింగ్ ఉండడంతో మళ్ళీ వాయిదా వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వారం పవన్ కు సంబంధించిన షూట్ పూర్తి చేయాలని అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఆయన కుమారుడు అగ్ని ప్రమాదానికి గురవడం, పవన్ ఆరోగ్యం కూడా బాగోలేకపోవడంతో  షెడ్యూల్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. దీంతో అనుకున్న టైంకి మూవీని  రిలీజ్ చేయగలమా? లేదా అనే  టెన్షన్ లో ఉన్నారు మేకర్స్. మరోవైపు  ఫ్యాన్స్ కూడా  తీవ్ర నిరాశ చెందుతున్నారు.  ఇప్పుడు రిలీజ్ కాకపోతే..? ఇకపై  'హరిహరవీరమల్లు' విడుదల డౌటే? అని కామెంట్లు పెడుతున్నారు కొంతమంది. 

Also Read: HIT 3 బాహుబలి, RRR రికార్డులను మించి.. 'హిట్ 3' ట్రైలర్ ట్రెండింగ్ .. ఎన్ని మిలియన్ల వ్యూస్ అంటే!

ఇప్పటికే మూడు సార్లు

ఇప్పటికే ఈ చిత్రాన్ని మూడు సార్లు పోస్ట్ ఫోన్ చేశారు.  మొదటగా 2021లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేయగా.. కరోనా కారణంగా  2022 మార్చి 28కి పోస్ట్ ఫోన్ చేశారు. ఆ తర్వాత  2023, 2024లో పవన్ రాజకీయాలతో బిజీ అయిపోవడంతో 2025 మార్చి 28కి రిలీజ్ వాయిదా వేశారు. అయితే అప్పటికి కూడా ఈ సినిమా చూసే భాగ్యం దక్కలేదు  ఫ్యాన్స్ కి. మళ్ళీ మే 9కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పుడు కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు టాక్. 

మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై AM. రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని  క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో నిధి అగర్వాల్, బాబీ డియోల్, ఎం. నాసర్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు, నోరా ఫతేహి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇదిఇలా ఉంటే ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాకు సూపర్ బజ్ క్రియేట్ చేశాయి. 

cinema-news | latest-news | harihara-veeramallu-movie

Also Read: ఆ నరుకుడు ఏంది సామి.. రక్తం ఏరులైపారిందిగా..! హిట్-3' ట్రైలర్ రిలీజ్..

Advertisment
Advertisment
Advertisment