Helicopter Crash: కుప్పకూలిన హెలికాప్టర్‌.. బ్యాంక్ సీఈఓ సహా ఆరుగురు మృతి

అమెరికాలోని కాలిఫోర్నియా - నెవడా సరిహద్దుల్లో ఓ హెలికాప్టర్‌ కూప్పకూలింది. ఈ ఘటనలో నైజీరియాకు చెందిన'యాక్సెస్ బ్యాంక్‌' సీఈఓతో పాటు మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.

New Update
Helicopter Crash: కుప్పకూలిన హెలికాప్టర్‌.. బ్యాంక్ సీఈఓ సహా ఆరుగురు మృతి

California Helicopter Crash: అమెరికాలోని కాలిఫోర్నియా - నెవడా సరిహద్దుల్లో ఓ హెలికాప్టర్‌ కూప్పకూలడం కలకలం రేపింది. ఈ దుర్ఘటనలో నైజీరియాకు చెందిన అతిపెద్ద బ్యాంక్ సీఈఓతో పాటు మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. 'యాక్సెస్ బ్యాంక్‌' సీఈఓ హెర్బర్ట్‌ విగ్వే (Access Bank CEO Herbert Wigwe) తన భార్య, కొడుకు మరికొందరితో కలిసి హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్నారు. మోజువా ఎడారిపై వెళ్తుండగా.. శాన్‌ బ్రెనార్డినో కౌంటీ వద్ద శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది.

Also Read: ఐపీఎల్ బ్యూటీ నవ్వింది.. సోషల్ మీడియా షేక్ అయింది!

సుమారు 3 వేల అడుగుల ఎత్తు నుంచి అది కుప్పకూలడంతో.. అందులో ప్రయాణిస్తున్నవారు ఎవరూ కూడా ప్రాణలతో బయటపడలేదు. దగ్గర్లోని ఓ జాతీయ రహదారిపై ప్రయానిస్తున్నవారు ఈ ప్రమాదాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ప్రమాదంపై ఎఫ్‌ఏఏ (FAA) విచారణ చెపట్టింది. ఇందులో చనిపోయినవారిలో నైజీరియాకు (Nigeria) చెందిన ఎన్‌జీఎక్స్‌ గ్రూపు మాజీ ఛైర్మన్‌ అబింబోలా (Abimbola), ఇద్దరు పైలట్లు కూడా ఉన్నారు.

ఈ ఘటన జరిగిన అనంతరం.. ఆఫ్రికా బ్యాంకింగ్ రంగానికి ఇది పెద్ద షాక్ అంటూ వరల్డ్‌ ట్రేడ్ ఆర్గనైజేషన్ డైరెక్టర్‌ జనరల్ ఎవాలా ఎక్స్‌లో స్పందించారు. హెర్బర్ట్‌ విగ్వే గతంలో గ్యారెంటీ ట్రస్ట్ అనే బ్యాంకులో కూడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేశారు. అయితే నైజీరియా యాక్సెస్‌ బ్యాంక్ ఆఫ్రికాలోని పలు దేశాల్లో సేవలను అందిస్తోంది. ఇదిలాఉండగా.. ఈ మధ్యే అమెరికాలోని శాన్‌ డియాగో వద్ద ఓ ఆర్మీ హెలికాప్టర్‌ కుప్పకూలి ఐదుగురు సిబ్బంది మృతి చెందారు. ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకే తాజాగా ఈ ఘటన జరిగింది.

Also Read: రిగ్గింగ్, రీపోలింగ్ రగడ.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pak: ఉగ్రవాదులు స్వాతంత్ర సమరయోధులు..పాక్ ఉప ప్రధాని ప్రేలాపన

ఏం జరిగినా...ఎవరేం అన్నా తమ నోటిని మాత్రం కంట్రోల్ లో పెట్టుకోమంటున్నారు పాక్ నేతలు. ఒకవైపు యుద్ధం జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దాన్ని మరింత ఎగదోస్తూ.. పహల్గామ్ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు స్వాత్రంత్య సమరయోధులంటూ పాక్‌ ఉప ప్రధాని వ్యాఖ్యలు చేశారు.

New Update
pak

Pakistan Deputy Pm Ishaq

పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని భారత్ మండిపడుతోంది. పహల్గామ్ దాడి దానికి సంబంధించినదే అని విరుచుకుపడింది. అయితే ఈ దాడితో తమకే సంబంధం లేదని పాక్ కప్పిపుచ్చుకోవడానికి ట్రై చేసింది. కానీ మరోవైపు నుంచి నోటికొచ్చినట్లు మాట్లాడ్డం మాత్రం ఆపడం లేదు. మొన్న పాక్ రక్షణ మంత్రి కాశ్మీర్ దాడి భారత్ తప్పేనంటూ మాట్లాడారు. ఈరోజు ఆ దేశ ఉప ప్రధాని ఇషాక్ దార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

వాళ్ళు స్వాతంత్ర సమరయోధులు..

ఇస్లామాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఇషాక్  కాశ్మీర్ లోని పహల్గామ్ లోదాడి చేసిన ఉగ్రవాదులు స్వాతంత్ర సమరయోధులై ఉంటారంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అలాగే సింధు జలాల ఒప్పందం రద్దు గురించి మాట్లాడుతూ ఈ ఏక పక్ష నిర్ణయాన్ని తాము ఎప్పటికీ అంగీకరించమని ఇషాక్ అన్నారు. భారత్ తీసుకున్న నిర్ణయానికి ప్రతిచర్య తప్పందటూ రెచ్చగొట్టే మాటలు మాట్లాడారు. 

అధికారికంగా లేఖ..

 మరోవైపు సింధు జలాల ఒప్పందం అమలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన భారత్..ఆ విషయాన్ని అధికారికంగా పాకిస్తాన్ కు చెప్పారు. భారత నీటి వనరుల కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ పాక్‌ అధికారి సయీద్‌ అలీ ముర్తుజాకు లేఖ పంపారు. ఏ ఒప్పందాన్నైనా నిజాయతీగా గౌరవించడం అనేది ప్రాథమిక బాధ్యత. కానీ, జమ్మూ-కాశ్మీర్ ‌ను లక్ష్యంగా చేసుకొని పాకిస్థాన్‌ సీమాంతర ఉగ్రవాదాన్ని కొనసాగిస్తోంది. దీని వలన మా దేశం నష్టపోతోంది. అందుకే ఈ ఒప్పందాన్ని నిలిపివేస్తున్నమంటూ లేఖలో రాశారు. 

today-latest-news-in-telugu | pakistan | comments | terrorists | freedom-fighters

Also Read: Israel: పాక్ ను సర్వనాశనం చేద్దాం...రంగంలోకి ఇజ్రాయెల్

 

Advertisment
Advertisment
Advertisment