central election commission:నేడు హైదరాబాద్ కి కేంద్ర ఎన్నికల బృందం.

తెలంగాణకు ఎన్నికల ఫీవర్ స్టార్ట్ అయింది. దీన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ మరింత పెంచనుంది. కేంద్ర ఎలక్షన్ కమిషన్ అధికారులు ఈరోజు నుంచి 3 రోజుల పాటూ తెలంగానలో పర్యటించనున్నారు. ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు, సన్నద్ధత మీద ఎన్నికల అధికారులు, సంస్థలతో సమీక్షించనున్నారు.

New Update
central election commission:నేడు హైదరాబాద్ కి కేంద్ర ఎన్నికల బృందం.

కేంద్ర ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ సారథ్యంలో 17మంది అధికారుల బృందం హైదరాబాద్ కు చేరుకోనున్నారు. తాజ్ కృష్ణ హోటల్లో బస చేయనున్నారు. నేటి నుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్ లో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశాలు నిర్వహించనుంది. ఇవాళ మధ్యాహ్నం 2.30 నుండి 4.30 వరకు గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలతో సమావేశం జరుగుతంది. తర్వాత సాయంత్రం 5 గంటల నుండి 7.30 గంటల వరకు పలు ఎన్ఫోర్స్ మెంట్ ఏజెన్సీలతో రివ్యూ, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి, అధికారుల ప్రెజెంటేషన్ ఉంటుంది.

election commission tour

ఇక రేపు అంటే 4 వ తేదీన ఉదయం 6.30 కు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జీపై సైక్లోథాన్, వాక్ థాన్ లో కేంద్ర ఎన్నికల బృందం పాల్గొననుంది. తర్వాత ఉదయం 9.30 నుండి సాయంత్రం 7 వరకు జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు, సీపీలతో సమావేశం అవుతుంది. అలాగే 5 వ తేదీ ఉదయం 9 గంటలకు టెక్ మహీంద్రలో స్టేట్ ఐకాన్స్, దివ్యాంగ ఓటర్లు, యువ ఓటర్లతో ఇంటరాక్షన్ అవనుంది కేంద్ర బృందం. తర్వాత 11 గంటలకు సీఎస్ శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్ లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనుంది. తర్వాత మధ్యాహ్నాం 1 గంటకు ప్రెస్ కాన్ఫరెన్స్ కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు నిర్వహిస్తారు. దీంతో పాటూ ఓటర్ల జాబితా,ఎన్నికల ఏర్పాట్లు, నిఘా పై ఆరా తీయనుంది.

ఇది కూడా చదవండి:తెలంగాణలో తగ్గని కారు జోరు.. టౌమ్స్ నౌ సర్వే సంచలన లెక్కలివే!

వీటన్నింటితో పాటూ రాజకీయ పార్టీ ప్రతినిధులు, కలెక్టర్లు, ఎస్పీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజన్ కుమార్ లతో ఈసీ సమావేశం కానుంది. సీఈసీ బృందం పర్యటన తర్వాత త్వరలో ఎన్నికల షెడ్యూల్ విడుదల రిలీజ్ కాబోతోంది. తెలంగాణలో పలు భాగాల అధికారులతో చర్చించిన తర్వాతనే ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. వారంలో తెలంగాణ షెడ్యూల్‌ ప్రకటించే ఛాన్స్‌ ఉందని తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకటనకు ముందు తెలంగాణలో పరిస్థితులపై పూర్తిగా సమీక్ష చేయనున్నారు కేంద్ర ఎన్నికల బృందం.

election commission tour

ఇది కూడా చదవండి:తెలంగాణలో ఈరోజు ప్రధాని మోదీ పర్యటన

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ఖమ్మం వరదల్లో చనిపోయిన అగ్రికల్చర్ సైంటిస్ట్‌కు అరుదైన గౌరవం

గతేడాది వరదల్లో వ్యవసాయ శాస్త్రవేత్త నునావత్ అశ్విని చనిపోయారు. భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ కొత్తగా రూపొందించిన పూస శనగ 4037 రకానికి అశ్విని పేరు పెట్టి గౌరవించింది. ఆమె తండ్రితో వెళ్తున్న క్రమంలో మహబూబాబాద్ ఆఖేరు వాగు వరద ప్రవాహంలో కారు కొట్టుకుపోయింది.

New Update
scientist ashwini

scientist ashwini

వ్యవసాయ శాస్త్రవేత్త అశ్వినికి అరుదైన గుర్తింపు లభించింది. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గంగారం తండాకు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త అశ్విని గత సంవత్సరం వరదలో మృతి చెందిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఆమె తండ్రితోపాటు కారులో ప్రయాణిస్తుండగా ఇద్దరు చనిపోయారు. శాస్త్రవేత్త అశ్విని మృతి చెందినప్పటికీ భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ కొత్తగా రూపొందించిన పూస శనగ 4037 రకానికి వ్యవసాయ శాస్త్రవేత్త నునావత్ అశ్విని పేరు పెట్టి అరుదైన గౌరవం ఇచ్చింది. 

Also read: Mirabhai Chanu: ఒలంపిక్స్ విజేత మీరాభాయ్ చానుకు కీలక పదవి

ఢిల్లీలో సోమవారం ఈ కొత్త వంగడానికి అశ్విని పేరు పెట్టి విడుదల చేసింది. దివంగత అశ్విని రాజేంద్రనగర్‌లోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీలో PG, Phd పూర్తి చేసి గోల్డ్ మెడల్ సాధించారు. ఛతీష్‌గడ్ రాజధాని రాయపూర్‌లో వ్యవసాయ శాస్త్రవేత్తగా ఉద్యోగం సాధించింది. అక్కడ జరిగే సెమినార్‌లో పాల్గొనేందుకు వెళ్తున్న క్రమంలో మహబూబాబాద్ జిల్లా ఆఖేరు వాగు సమీపంలో భారీ వరద ప్రవాహంలో ఆమె ప్రయాణిస్తున్న కారు కొట్టుకుపోయింది. హెక్టారుకు 36.4 క్వింటాళ్ల దిగుబడిని ఇచ్చే కొత్త శనగ రకానికి IARI నునావత్ అశ్విని పేరు పెట్టడం పట్ల తల్లిదండ్రులు, కారేపల్లి మండల ప్రజలు సంతోషాన్ని వ్యక్తపరిచారు.

Also read: Heavy rains: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఉరుములు, మెరుపులతో

Advertisment
Advertisment
Advertisment