Mumbai Indians: రోహిత్‌ శర్మ జట్టులో కొనసాగుతాడా? తేల్చేసిన ముంబై హెడ్‌ కోచ్!

MI కెప్టెన్సీ మార్పుపై ఆ జట్టు హెడ్‌ కోచ్‌ మహేల జయవర్ధనే స్పందించారు. అభిమానుల ఆగ్రహం న్యాయమైనదేనని.. కానీ ఇది ఏదో ఒక సమయంలో తీసుకోవలసిన నిర్ణయమేనని వివరించారు. నాయకత్వంలో మార్పు వచ్చినప్పటికీ రోహిత్ శర్మ జట్టులో కీలక పాత్ర పోషిస్తాడని జయవర్ధనే స్పష్టం చేశారు.

New Update
Pandya Vs Rohit: 'రోహిత్ శర్మ నా కింద...' పాండ్యా షాకింగ్‌ కామెంట్స్‌!

ముంబై ఇండియన్స్‌(Mumbai Indians) తీసుకున్న కెప్టెన్సీ మార్పు నిర్ణయంపై ఇప్పటికీ సెగ చల్లారలేదు. ఐపీఎల్‌(IPL) ఆక్షన్‌తో సమానంగా ఈ కెప్టెన్సీ మార్పుపై ఇప్పటికీ తీవ్రంగా చర్చ జరుగుతోంది. రోహిత్‌ శర్మ(Rohit Sharma) ఇంక రిటైర్‌మెంట్ ప్రకటించకుండానే అతని స్థానంలో హార్దిక్‌ పాండ్యా(Hardik Pandya)కు కెప్టెన్సీ ఇవ్వడం పట్ల ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. సోషల్‌మీడియాలో నిరసన వ్యక్తం చేస్తూ ముంబై ఇండియన్స్‌ సోషల్‌మీడియా హ్యాండిల్స్‌ను అన్‌ఫాలో చేస్తున్నారు. కొందరు ముంబై ఫ్రాంచైజీపై ఆగ్రహంలో MI జెర్సీలను తగలబెట్టారు కూడా. గుజరాత్‌ నుంచి ట్రేడ్‌ చేసుకొని తెచ్చుకున్న పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వడాన్ని తప్పుపడుతున్నారు. తాజాగా దీనిపై ముంబై ఇండియన్స్ క్రికెట్ గ్లోబల్ హెడ్, మహేల జయవర్ధనే స్పందించారు.

Also Read: బ్యాటర్లకు ఇక కళ్లెం.. బీసీసీఐ తాజా నిర్ణయంతో పేసర్లకు అడ్వాంటేజ్!

ఇది కఠినమైన నిర్ణయమే:
అభిమానుల నుంచి ఉద్వేగభరితమైన ప్రతిస్పందనను గుర్తించిన జయవర్ధనే ఫ్రాంచైజీ భవిష్యత్తు కోసం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. జియో(JIO) సినిమాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జయవర్ధనే ఈ కామెంట్స్ చేశారు. ఇది చాలా కఠినమైన నిర్ణయమని అభిప్రాయపడ్డ జయవర్ధనే.. అభిమానుల రియాక్షన్‌ను అర్థం చేసుకుంటునట్టు చెప్పారు. 'ఇది ఎమోషనల్‌గా ఉంది, నిజాయితీగా ఉంటుంది.. ప్రతి ఒక్కరూ భావోద్వేగంగా ఉంటారని నేను భావిస్తున్నాను' అని తెలిపారు. నాయకత్వంలో మార్పు వచ్చినప్పటికీ రోహిత్ శర్మ జట్టులో కీలక పాత్ర పోషిస్తాడని జయవర్ధనే స్పష్టం చేశారు.

హార్దిక్ పాండ్యా చాలా కాలంగా డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్నాడని జయవర్ధనే గుర్తు చేశారు. ఆల్‌రౌండర్‌గా పాండ్యా ఎలా రాణించగలడో అందరికి తెలుసని చెప్పుకొచ్చారు. గుజరాత్‌ టీమ్‌కు పాండ్యా నాయకత్వం వహించాడని.. అతని అనుభవంతో ఉపయోగపడుతుందని తెలిపారు. కెప్టెన్సీ మార్పు అన్నది ఏదో ఒక సమయంలో మనం తీసుకోవలసిన నిర్ణయమేనని జయవర్ధనే వివరించారు. మైదానంలో, గ్రౌండ్‌ వెలుపల రోహిత్ జట్టులో ఉండటం తమకు చాలా ముఖ్యమన్నాడు. 'రోహిత్‌ చాలా తెలివైనవాడు. అతను దానిని నడిపించే వారసత్వంలో భాగం అవుతాడని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను' అని జయవర్ధనే ధృవీకరించారు.

Also Read: ఐపీఎల్ లో మొట్టమొదటి ట్రైబల్ ఆటగాడు..రాబిన్ మింజ్

WATCH:

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

India: పాకిస్తానీయులకు ముగిసిన డెడ్ లైన్..537 మంది వెనక్కు..

టెంపరరీ వీసాలతో భారత్ కు వచ్చిన పాక్ పౌరులకు భారత ప్రభుత్వం ఇచ్చిన గడువు ఈ రోజు తో ముగిసింది. దీంతో ఇప్పటి వరకు 537 మంది అట్టారీ-వాఘా సరిహద్దు మార్గంలో పాకిస్థాన్‌కు వెళ్ళారని తెలుస్తోంది. వీరిలో తొమ్మది మంది దౌత్య వేత్తలు, అధికారులు ఉన్నారు.

New Update
pak

Pakistan People

పాకిస్తానీయులు ఇండియాలో ఉండటంపై భారత ప్రభుత్వం సీరియస్ గా ఉంది. పహల్గామ్ లో దాడి జరిగిన తర్వాత పాక్ పౌరులు తమ దేశం నుంచి వెళ్ళిపోవాలని ఆదేశాలను జారీ చేసింది. ఏప్రిల్ 24న ఈ ఉత్తర్వులను ఇచ్చింది. దీంతో పాకిస్తానీయులు దేశం విడిచి వెళ్ళడం ప్రారంభించారు. ఇప్పటివరకు నాలుగు రోజుల్లో 537 మంది అట్టారీ-వాఘా సరిహద్దు మార్గంలో పాకిస్థాన్‌కు  వెళ్లిపోయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఒక్క ఆదివారం రోజునే 287 మంది వెళ్ళారని సమాచారం . ఇందులో తొమ్మిది మంది దౌత్యవేత్తలు, అధికారులు ఉన్నట్లు చెప్పారు. కొంతమంది ఫ్లైట్స్ ద్వారా వెళ్ళారని..అయితే నేరుగా పాక్ కు విమాన సర్వీసులు లేవు కాబట్టి..ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళిపోయి ఉండవచ్చని చెప్పారు. ఇదే సరిహద్దు ద్వారా 850 మంది భారతీయులు పాకిస్థాన్‌ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చినట్లు చెప్పారు.

మూడు లక్ష జరిమానా..

పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్‌లో ఉంటున్న పాకిస్థానీయులను నిర్ణీత గడువులోగా వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించి ఎవరైనా గడువు దాటినా కూడా ఇంకా భారత్‌లోనే ఉంటే చట్టం ప్రకారం వాళ్లని అరెస్టు చేయవచ్చు. దీనిపై దర్యాప్తు చేపట్టి.. మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ.3 లక్షల జరిమానా, లేదా రెండు విధించే ఛాన్స్ కూడా ఉంటుంది.  సార్క్‌ వీసాల కింద ఇండియాలో ఉంటున్న పాకిస్థానీయులు ఏప్రిల్ 26లోగా దేశం విడిచి వెళ్లిపోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే మెడికల్ వీసాల కింద వచ్చినవాళ్లకు మాత్రం ఏప్రిల్ 29 వరకు గడువు ఇచ్చింది. స్టూడెంట్, బిజినెస్, విజిటర్ తదితర 12 విభాగాల్లో వీసాలు ఉన్నవాళ్లు మాత్రం ఏప్రిల్ 27 నాటికి వెళ్లిపోవాలని ఆదేశించింది. ఏప్రిల్ 4 నుంచి ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్‌ యాక్ట్‌-2025 అమల్లోకి వచ్చింది. 

 today-latest-news-in-telugu | india | pakistan 


Also Read: Sitakka: నీ బిడ్డ కార్లలో తిరిగితే.. మా ఆడబిడ్డలు బస్సులో కూడా తిరగొద్దా?: కేసీఆర్ కు సీతక్క స్ట్రాంగ్ కౌంటర్!

Advertisment
Advertisment
Advertisment