రూ. 1000 పెట్టుబడితో రూ.11 కోట్లు.. మీ పిల్లలు కోటీశ్వరులు కావడం ఖాయం!

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పిల్లల పేరిట ఓ గొప్ప పథకాన్ని అమలు చేసింది. దాని పేరు ఎన్‌పీఎస్‌ వాత్సల్య యోజన.  ఈ ఫథకాన్ని  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 కేంద్ర బడ్జెట్‌లో ప్రవేశపెట్టారు. ఈ పథకం గురించి పూర్తిగా తెలుసుకోండి.

New Update
NPS Vatsalya

NPS Vatsalya Photograph: (NPS Vatsalya)

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పిల్లల పేరిట ఓ గొప్ప పథకాన్ని అమలు చేసింది. దాని పేరు ఎన్‌పీఎస్‌ వాత్సల్య యోజన.  ఈ ఫథకాన్ని  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 కేంద్ర బడ్జెట్‌లో ప్రవేశపెట్టారు. ఈ స్కీమ్ ను దేశంలోని 75 ప్రాంతాల్లో ప్రారంభించారు. ఈ స్కీమ్  లో తల్లిదండ్రులు, సంరక్షకులు పిల్లల పేరుపై పెట్టుబడి పెట్టవచ్చు.ఈ పథకం కింద  ఏడాదికి రూ. 1000   పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎంతైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. పిల్లలకు 18 ఏళ్లు వచ్చిన తర్వాత తల్లిదండ్రుల పెట్టుబడి ఆగిపోతుంది. మీరు ఈ పథకం కింద పెట్టుబడి పెడితే  రూ.11 కోట్ల భారీ మొత్తం జమ అవుతుంది. అది ఎలా సాధ్యమో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ ఎన్‌పీఎస్‌ వాత్సల్య పథకం పెన్షన్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ద్వారా నిర్వహించబడుతుంది.  మీరు ఈ పథకం కింద మీ పిల్లల పేరు మీద నెలకు రూ. 1,000 పెట్టుబడి పెడుతున్నారు అని అనుకుందాం, 18 సంవత్సరాల తర్వాత మొత్తం రూ. 2,16,000 అవుతుంది. ఏడాదికి 12.86% వడ్డీ రేటుతో డిపాజిట్ చేస్తే వడ్డీ ఆదాయం రూ.6,32,000 అవుతుంది. డిపాజిట్ మొత్తాన్ని వడ్డీతో కలిపితే మీకు రూ.8 లక్షల 48 వేలు వస్తాయి.

ఈ ప్లాన్ కింద, మీరు 20% క్యాష్‌బ్యాక్ పొందే అవకాశం కూడా ఉంటుంది. మీరు యాన్యుటీ పథకం కింద మిగిలిన 80% అంటే రూ. 6.78 లక్షలు డిపాజిట్ చేస్తే, మీ డబ్బు రిటైర్‌మెంట్‌పై భారీ రాబడిని పొందుతుంది. మీరు ఈ పథకంలో నెలకు రూ. 10,000 పెట్టుబడి పెట్టి, 12.86% రిటర్న్ రేటుతో వడ్డీగా డిపాజిట్ చేస్తే, మీ పిల్లలు 60 ఏళ్లు వచ్చేసరికి రూ.11.5 కోట్లు పొందే అవకాశం ఉంది. ఎన్‌పీఎస్ వాత్సల్య స్కీమ్ అనేది మీ పిల్లల భవిష్యత్తుకు బలమైన ఆర్థిక పునాదులు వేస్తుంది.

Also Read :  EPFO: తగ్గనున్న అధిక ఫించన్‌..స్పష్టత ఇచ్చిన ఈపీఎఫ్‌ఓ!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Gold Prices Today: భారీగా తగ్గిన బంగారం.. గ్రాము ఎంత ఉందంటే?

నేడు మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.98,340గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.90,140గా ఉంది. ఇక గ్రాము రేటు చూసుకుంటే.. రూ.9,834 గా మార్కెట్‌లో ఉంది. అయితే ప్రాంతం, సమయాన్ని బట్టి ధరల్లో కాస్త మార్పులు ఉంటాయి.

New Update
Gold rate

Gold rate

గత కొన్ని రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతున్నాయి. 10 గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలకు పైనే దాటింది. లక్ష లేనిదే బంగారం కొనలేరు. అందులోనూ తులం బంగారం అంటే చేతిలో లక్ష కంటే ఎక్కువగానే డబ్బులు పెట్టుకోవాలి. నేడు మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.98,340గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.90,140గా ఉంది. ఇక గ్రాము రేటు చూసుకుంటే.. రూ.9,834 గా మార్కెట్‌లో ఉంది. అయితే ప్రాంతం, సమయాన్ని బట్టి ధరల్లో కాస్త మార్పులు ఉంటాయి.

ఇది కూడా చూడండి: TG Crime: కోడలిపై మోజుతో కొడుకును లేపేసిన తండ్రి.. రోకలి బండతో కొట్టి చంపి!

ఇది కూడా చూడండి: Betting Apps Pramotion Case : ప్రభుత్వం సంచలన నిర్ణయం..సెలబ్రిటీ బెట్టింగ్ యాప్స్ కేసు సీఐడీకి బదిలీ

ఏయే నగరాల్లో ఎలా ఉన్నాయంటే?

చెన్నైలో 22 క్యారెట్ల గ్రాము ధర రూ.9,005, 24 క్యారెట్ల గ్రాము ధర రూ.9,824, ముంబైలో 22 క్యారెట్ల గ్రాము ధర రూ.9,005, 24 క్యారెట్ల గ్రాము ధర రూ.9,824, న్యూఢిల్లీ 22 క్యారెట్ల గ్రాము ధర రూ.9,005, 24 క్యారెట్ల గ్రాము ధర రూ.9,834, కోల్‌కతా 22 క్యారెట్ల గ్రాము ధర రూ.9,005, 24 క్యారెట్ల గ్రాము ధర రూ.9,824, బెంగళూరులో 22 క్యారెట్ల గ్రాము ధర రూ.9,005, 24 క్యారెట్ల గ్రాము ధర రూ.9,824, హైదరాబాద్‌లో 22 క్యారెట్ల గ్రాము ధర రూ.9,005, 24 క్యారెట్ల గ్రాము ధర రూ.9,824, కేరళలో 22 క్యారెట్ల గ్రాము ధర రూ.9,005, 24 క్యారెట్ల గ్రాము ధర రూ.9,824, పూణే 22 క్యారెట్ల గ్రాము ధర రూ.9,005, 24 క్యారెట్ల గ్రాము ధర రూ.9,824, అహ్మాదాబాద్ 22 క్యారెట్ల గ్రాము ధర రూ.9,005, 24 క్యారెట్ల గ్రాము ధర రూ.9,824గా ఉంది.

ఇది కూడా చూడండి: Indus River Agreement: 64 ఏళ్ళ ఒప్పందానికి స్వస్తి..ఎడారిగా మారనున్న పాకిస్తాన్

 

Advertisment
Advertisment
Advertisment