Fruits or Juice : పండ్లు నేరుగా తింటే బెటరా?.. జ్యూస్‌ చేసి తాగితే మంచిదా?

ప్యాకింగ్‌ చేసిన జ్యూస్‌లు తాగడం వల్ల మెదడుకు సంబంధించిన సమస్యలు వచ్చే ప్రమాదముంది. అందుకే తాజా పండ్లను తినండి. దీని వల్ల శరీరానికి విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ పుష్కలంగా అందుతాయి. పండ్లు తినడం వల్ల ఊబకాయం, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

New Update
Fruits or Juice :  పండ్లు నేరుగా తింటే బెటరా?.. జ్యూస్‌ చేసి తాగితే మంచిదా?

Fruit Juice : శరీరాన్ని చురుగ్గా, ఫిట్‌గా ఉంచుకోవడానికి ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో పండ్లను చేర్చుకుంటారు. అయితే పండ్లను తినడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుందా లేక పండ్ల రసం(Fruit Juice) తాగడం వల్ల ప్రయోజనం ఉంటుందా అనే ప్రశ్న చాలామందికి వస్తుంటుంది. పండ్లను తినడం(Eating Fruits) వల్ల శరీరానికి చాలా ఫైబర్ లభిస్తుంది. ఇది జీర్ణక్రియ(Digestion) ను మెరుగుపరచడంలో, రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. తాజా పండ్లను తినడం వల్ల శరీరానికి విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ పుష్కలంగా లభిస్తాయి. ప్రతిరోజూ పండ్లు తింటే ఊబకాయం(Obesity), దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని వైద్యులు చెబుతున్నారు. పండ్లలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా తీసుకోకుండా త్వరగా రిఫ్రెష్ చేస్తాయి. బరువు తగ్గడంలో సహాయపడే పండ్లలో బెర్రీలు, యాపిల్స్, సిట్రస్ పండ్లు, ద్రాక్ష ఉన్నాయి.

జ్యూస్‌లు తాగడం మంచిదేనా?

  • ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పండ్లను కలిపి జ్యూస్‌ చేసుకుని తాగుతుంటారు. పండ్లను ఎక్కువ సమయం తినడం కంటే జ్యూస్‌ చేసుకుంటే సులభంగా తాగవచ్చు. అయితే జ్యూస్‌లో పండ్లలో ఉండేంత ఫైబర్ ఉండదని, పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు కూడా ఉండవని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ మీరు ప్యాక్‌డ్ జ్యూస్‌(Packed Juice) ను తాగుతుంటే అందులో చక్కెర, కేలరీలు కూడా ఎక్కువగా ఉంటాయని అంటున్నారు.

పండ్లు తినడమే బెటరా?

  • పండ్లలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. జ్యూస్‌లు చేయడం వల్ల అందులో అనేక పదార్థాలు కలపాల్సి వస్తుంటుంది. దీని వల్ల పండ్లలో ఉండే విలువలు పోతాయని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా పీచుపదార్థం కూడా మిస్‌ అవుతామని చెబుతున్నారు. తాజా పండ్లను తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని, ప్యాకింగ్‌ చేసిన జ్యూస్‌లు తాగితే మాత్రం సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

ఇది కూడా చదవండి : మహిళల్లో ఎక్కువగా కనిపించే వ్యాధులు..నివారణా మార్గాలు

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Babu Mohan : రాజకీయాల నుంచి సేవారంగంవైపు... బాబుమోహన్‌ కీలక నిర్ణయం

 ప్రముఖ సినీ నటుడు బాబు మోహన్ తెలియనివారుండరు. తన హాస్యనటనతో ఎందరినో అలరించిన ఆయన ఆ తర్వాత రాజకీయరంగ ప్రవేశం చేశారు. మంత్రిగా కూడా పనిచేశారు. ఈ రోజు సేవా రంగంలోకి అడుగుపెట్టారు. తన కుమారుడి జ్ఞాపకార్థం ‘పవన్ బాబు మోహన్ ఛారిటబుల్ ట్రస్ట్’ను స్థాపించారు.

New Update
Babu Mohan

Babu Mohan

 ప్రముఖ సినీ నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్ తెలియనివారుండరు. తన హాస్యనటనతో ఎందరినో అలరించిన ఆయన ఆ తర్వాత రాజకీయరంగ ప్రవేశం చేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రఏర్పాటు తర్వాత బీఆర్‌ఎస్‌ లో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ అనుకోని కారణాల వల్ల ప్రస్తుతం ఆయన ఏ పదవిలో లేరు. అయితే ఆయన ఈ రోజు మరో రంగంలోకి అడుగుపెట్టారు. అదే సేవా రంగం. అవును తన కుమారుడి జ్ఞాపకార్థం ‘పవన్ బాబు మోహన్ ఛారిటబుల్ ట్రస్ట్’ను స్థాపించారు. ఈ ట్రస్ట్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న నిరుపేదలకు చేయూత అందిస్తామని ఆయన ప్రకటించారు. సోమవారం బషీర్ బాగ్‌ ప్రెస్ క్లబ్‌లో జరిగిన ఆవిర్భావ సమావేశంలో బాబు మోహన్ ట్రస్ట్ లక్ష్యాలు, కార్యక్రమాలను వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి అనుమతి పొందిన ఈ ట్రస్ట్.. నిరుపేదలకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలను కల్పించడంపై ప్రధానంగా దృష్టి సారిస్తుందని ఆయన తెలిపారు. నిరుద్యోగులకు చేయూత అందించడం కూడా ట్రస్ట్ ముఖ్య లక్ష్యాలలో ఒకటిగా పేర్కొన్నారు.

Also Read :  నీకు తక్కువ జీతం పిల్లనివ్వమని ఒకరు.. సంబంధం కుదరడం లేదని మరోకరు.!
 
బాబు మోహన్ మాట్లాడుతూ.. తన కుమారుడి పేరుతో ఏర్పాటు చేసిన ఈ ట్రస్ట్ ద్వారా సమాజంలోని బలహీన వర్గాలకు సహాయం అందించాలనేది తన చిరకాల కోరిక అని అన్నారు. పేదరికం నుంచి బయటపడటానికి విద్య ఒక ముఖ్యమైన సాధనమని ఆయన నొక్కి చెప్పారు. అందుకే.. ట్రస్ట్ ద్వారా నిరుపేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు.. వారికి నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు.అలాగే.. సరైన వైద్యం అందక ఇబ్బందులు పడుతున్న వారికి సహాయం అందించడం కోసం.. వైద్య శిబిరాలు నిర్వహించడం, ఆసుపత్రి ఖర్చుల కోసం ఆర్థిక సహాయం చేయడం వంటి కార్యక్రమాలను ఈ ట్రస్ట్ చేపడుతుందని బాబు మోహన్ తెలిపారు. ఉపాధి లేని యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి.. వారు ఉద్యోగాలు పొందేలా సహాయం చేస్తుందన్నారు.

Also Read :  HIT 3 బాహుబలి, RRR రికార్డులను మించి.. ట్రెండింగ్ లో 'హిట్ 3' ట్రైలర్.. ఎన్ని మిలియన్ల వ్యూస్ అంటే!
 
ట్రస్ట్ ద్వారా సహాయం పొందాలనుకునే వారు కోఆర్డినేటర్ రాజ్ కుమార్‌ను 8919511215 నెంబర్‌ ద్వారా సంప్రదించవచ్చని బాబు మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం బండారు గూడెం కోయజాతికి చెందిన సమీప అనే విద్యార్థి ఎంటెక్ చేయడానికి, గ్రూప్స్ కోచింగ్ తీసుకోవడానికి బాబు మోహన్ తన ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం అందజేశారు.

Also Read :  కడుపుతో ఉన్న భార్యను ఎందుకు చంపాడంటే.. షాకింగ్ విషయాలు చెప్పిన విశాఖ పోలీసులు.. !


బాబు మోహన్ కుమారుడు పవన్ కుమార్ 2003 అక్టోబర్ 12న జరిగిన హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. స్పోర్ట్స్ బైక్ అదుపుతప్పి డివైడర్‌ని ఢీ కొట్టడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. కొడుకు మరణంతో బాబు మోహన్ ఎంతగానో కుంగిపోయారు. కొడుకు పేరిట సేవా కార్యక్రమాలు చేపట్టాలని తాను ఎంతో కాలంగా భావిస్తున్నానని.. కానీ రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల కుదరలేదన్నారు. తాను ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉండటం వల్ల పూర్తి స్థాయిలో ట్రస్ట్ కోసం పని చేస్తానని ఆయన చెప్పారు.

 Also Read :  ముగ్గురు భార్యలు జంప్.. నాలుగో పెళ్లికి రెడీ.. నీ కష్టం పగోడికి కూడా రావొద్దురా!

Advertisment
Advertisment
Advertisment