Cricket:మిగిలిన టెస్ట్‌ల్లోనూ కోహ్లీ ఆడటం లేదు..బీసీసీఐ

ఇంగ్లాండ్‌తో మిగిలన మూడు టెస్ట్ మ్యాలకు భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. మొదటి రెండు టెస్ట్ మ్యాచ్‌లూ ఆడని విరాట్ కోహ్లీ మిగతా మూడింటికి కూడా రావడం లేదని చెప్పింది. జడేజా, కె.ఎల్ .రాహుల్ మాత్రం ఆడతారని అనౌన్స్ చేసింది.

New Update
Cricket:మిగిలిన టెస్ట్‌ల్లోనూ కోహ్లీ ఆడటం లేదు..బీసీసీఐ

India vs England Test series:ఇండియా, ఇంగ్లాండ్‌ ల మధ్య ఐదు టెస్ట్‌ల సీరీస్ జరుగుతోంది. వీటిలో ఇప్పటికే రెండు మ్యాచ్ అయిపోయాయి. ఇందులో ఒకటి ఇంగ్లాండ్ గెలిస్తే...ఇంకోటి టీమ్ ఇండియా గెలిచింది. ఇప్పుడు మిగిలిన మూడు టెస్ట్ మ్యాచ్‌లకు భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. మొదటి రెండు టెస్ట్ మ్యాచ్‌లకూ దూరమైన స్టార్ బ్యాట్స్‌మ్యాన్ విరాట్ కోహ్లీ ఇప్పుడు మిగిలిన మూడు టెస్ట్ట మ్యాచ్‌లను కూడా ఆడటం లేదు. మరోవైపు గాయాలతో రెండో టెస్ట్ ఆడని జడేజా, కె.ఎల్ రాహుల్‌ లు మాత్రం తిరిగి జట్టులోకి వస్తున్నారు.

Also Read:Interim Budget 🔴: తెలంగాణ అసెంబ్లీలో మధ్యంతర బడ్జెట్-హైలెట్స్

విరాట్ నిర్ణయాన్ని గౌరవిస్తాం..

వ్యక్తిగత కారణాలతో విరాట్ టెస్ట్ మ్యాచ్‌లకు దూరమవుతున్నాడని చెబుతోంది బీసీసీఐ. వినాట్ నిర్ణయాన్ని తాము గౌరవిస్తామని అంటోంది. ఇక కె.ఎల్. రాహుల్, జడేజాలు మూడో టెస్ట్ నాటికి ఫిట్ నెస్ క్లియరెన్స్ వస్తే వారిద్దరూ తుది జట్టులో ఉంటారని తేల్చి చెప్పింది. అప్పటి వరకు వారి విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోమని తెలిపింది. మరోవైపు మూడో టెస్ట్‌కు సిరాజ్‌ కూడా అందుబాటులోకి వచ్చేశాడు. కొత్తగా ఆకాశ్‌ దీప్‌ టెస్టులకి ఎంపికయ్యాడు. రజత్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌ తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. గాయం కారణంగా శ్రేయస్‌ అయ్యర్ ఆడటం లేదు. ఇషాన్‌ కిషన్‌, మహమ్మద్‌ షమీని పరిగణనలోకి తీసుకోలేదు. రాజ్‌ కోట్‌ వేదికగా ఫిబ్రవరి 15 నుంచి మూడో టెస్టు మ్యాచ్‌ మొదలవనుంది. నాలుగో టెస్టు ఫిబ్రవరి 23 నుంచి రాంచీలో .. ఐదో మ్యాచ్‌ మార్చి 7న ధర్మశాలలో జరగనున్నాయి.

మూడు టెస్ట్‌లకు భారత జట్టు..

రోహిత్ శర్మ (కెప్టెన్), జస్‌ప్రీత్ బుమ్రా (వైస్‌ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్‌ గిల్, కేఎల్ రాహుల్, రజత్‌ పటీదార్, సర్ఫరాజ్‌ ఖాన్, ధ్రువ్‌ జురెల్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్‌దీప్‌ యాదవ్, సిరాజ్, ముకేశ్‌ కుమార్, ఆకాశ్‌ దీప్‌

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

RCB VS RR: హుర్రే..ఓన్ గ్రౌండ్ లో ఆర్సీబీ గెలిచింది..ఆరఆర్ పై విక్టరీ

మొత్తానికి సొంతగడ్డపై బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మ్యాచ్ గెలిచింది. ఐపీఎల్ 18 సీజన్ లో బెంగళూరు చినస్వామి స్టేడియంలో ఆర్సీబీ గెలవడం ఇదే మొదటిసారి. రాజస్థాన్ రాయల్స్ మీద ఆర్సీబీ 11 పరుగులు తేడాతో విజయం సాధించింది. 

New Update
ipl

RCB VS RR

ఐపీఎల్ లో ఈ రోజు ఆర్సీబీ, ఆర్ఆర్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో బెంగళూరు 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 205 పరుగులు చేసి ఆర్ఆర్ కు 206 టార్గెట్ ఇచ్చింది. ఈ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులే చేసింది.  పరుగుల ఛేదనలో ఆర్ఆర్ తొమ్మిది వికెట్లను కోల్పోయింది. యశస్వీ జైస్వాల్‌ (49), ధ్రువ్‌ జురెల్‌ (47) పోరాడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. బెంగళూరు జట్టులో హేజిల్ వుడ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 19వ ఓవర్లో కేవలం ఒక పరుగే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. చివరి ఓవర్లో లక్ష్యం 17 పరుగులు కాగా, యశ్‌ దయల్‌ వికెట్‌ తీసి కేవలం 5 పరుగులే ఇచ్చాడు. ఆర్సీబీలో హేజిల్‌ వుడ్‌ 4, కృనాల్‌ పాండ్య 2, భువనేశ్వర్‌ కుమార్‌, యశ్‌ దయాల్‌ ఒక్కో వికెట్‌ తీశారు. 

చిన్నస్వామి స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరుగింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ  20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. 

ఎవరెన్ని కొట్టారంటే?

ఫిల్ సాల్ట్ 23 బంతుల్లో 26 పరుగులు, విరాట్ కోహ్లీ 42 బంతుల్లో 70 పరుగులు, పడిక్కల్ 27 బంతుల్లో 50 పరుగులు, కెప్టెన్ రజత్ పాటిదార్ 3 బంతుల్లో 1 పరుగు చేశాడు. అలాగే మ్యాచ్ ఆఖరి వరకు ఆడిన డేవిడ్ 15 బంతుల్లో 23 పరుగులు, జితేశ్‌ శర్మ 10 బంతుల్లో 20 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 

కోహ్లీ పరుగుల వరద

32 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత కూడా దూకుడుగానే ఆడుతూ రన్స్ రాబట్టాడు. అప్పటికే రెండు సిక్సులు కొట్టి ఫ్యాన్స్‌కు మంచి ఊపు తెప్పించాడు. కానీ మరో షార్ట్ ఆడే క్రమంలో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 42 బంతుల్లో 70 పరుగులు చేసి ఔరా అనిపించాడు. అయితే ఈ మ్యాచ్‌లో రెండు సిక్సులు కొట్టిన కోహ్లీ.. మరో సిక్స్ కొట్టుంటే అరుదైన రికార్డు క్రియేట్ చేసి ఉండేవాడు. 

today-latest-news-in-telugu | IPL 2025 | rcb-vs-rr | match

Advertisment
Advertisment
Advertisment