Assam: ముస్లిం పెళ్ళి, విడాకుల చట్టాన్ని రద్దు చేసిన అస్సాం

రాష్ట్రంలోని ముస్లిం వివాహాలు-విడాకులకు సంబంధించి ఇప్పటివరకు ఉన్న చట్టాన్ని తొలగించాలని డిసైడ్ అయింది అస్సాం ప్రభుత్వం. దానికి బదులుగా పెళ్ళిళ్ళు, విడాకులకు ప్రభుత్వ నమోదును తప్పనిసరి చేసే బిల్లును ఆమోదించింది.

New Update
Assam: ముస్లిం పెళ్ళి, విడాకుల చట్టాన్ని రద్దు చేసిన అస్సాం

Repeal Muslim Marriages Divorce Act: యూనిఫాం సివిల్ కోడ్‌ను అమలు చేసే దిశగా అస్సాం ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దానిలో భాగంగా రాష్ట్రంలో ముస్లిమ్ వివాహాలు, విడాకుల విషయంలో చట్టాలను మారుస్తోంది. ఇప్పటివరకు ఉన్న ముస్లిం వివాహాలు మరియు విడాకుల నమోదు చట్టం-1935ని రద్దు చేసింది. ఇక మీదట ముస్లిమ్‌లు పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా, విడాకులు తీసుకోవాలన్నా ప్రభుత్వం అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ విషయంపై ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ..ఇంతకు ముందు జరిగిన వివాహాల రిజిస్ట్రేషన్లన్నీ చెల్లుబాటు అవుతాయని, కొత్తవి మాత్రమే చట్టం పరిధిలోకి వస్తాయని చెప్పారు. ముస్లిం పర్సనల్ లా ప్రకారం ఇస్లామిక్ ఆచారాల ప్రకారం జరిగే వివాహాల్లో తాము అస్సలు జోక్యం చేసుకోమని తెలిపారు. మా ఏకైక షరతు ఏమిటంటే ఇస్లాం నిషేధించిన వివాహాలు మాత్రం నమోదు చేయబడవు అని తెలిపారు.

వీటితో పాటూ కొత్త చట్టం ప్రకారం బాల్య వివహాలను పూర్తిగా నిషేధిస్తుందని సీఎం హిమంత బిశ్వా తెలిపారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ, కాజీలు గతంలో జరిపిన వివాహాల రిజిస్ట్రేషన్లన్నీ చెల్లుబాటు అవుతాయని, కొత్తవి మాత్రమే చట్టం పరిధిలోకి వస్తాయని అన్నారు. ముస్లిం పర్సనల్ లా ప్రకారం ఇస్లామిక్ ఆచారాల ప్రకారం జరిగే వివాహాలకు మేము అస్సలు జోక్యం చేసుకోవడం లేదు. మా ఏకైక షరతు ఏమిటంటే ఇస్లాం నిషేధించిన వివాహాలు నమోదు చేయబడవు అని అన్నారు. సామాజిక దురాచారాలను పూర్తిగా నిర్మూలించడమే తమ లక్ష్యమని చెప్పారు. బాలికలకు 18, బాలకులకు 21 ఏళ్ళ వయసుని చట్టబద్ధం చేసింది అస్సాం ప్రభుత్వం. ఈ బిల్లు బాల్యవివాహాలను నిరోధించడంతో పాటు ఆడ పిల్లలకు గౌరవప్రదమైన జీవితాన్ని అందించే సాధనం, బహు భార్యత్వాన్ని నిషేధిస్తుందని అన్నారు. గతంలో ముస్లిం వివాహాలు కాజీలు అమలుపరిచేవారు. వీటి ద్వారా బాల్య వివాహాలు జరిగేవి. వీటిపై ప్రభుత్వ పర్యవేక్షణ కూడా లేదు.

Also Read:  Africa: ఆకలి తీర్చడానికి వన్యప్రాణుల వధ..ఆఫ్రికాలో కరువు తాండవం

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Uttar Pradesh : ఐదుగురు పిల్లల తల్లి, నలుగురు పిల్లల తండ్రితో జంప్!

ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్‌లో ఒక షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఐదుగురు పిల్లల తల్లి అదే గ్రామంలో నివసించే నలుగురు పిల్లల తండ్రితో లేచిపోయింది. ఇది మాత్రమే కాదు, ఆమె తన ప్రియుడిని వివాహం చేసుకున్న ఫోటోను కూడా ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది.

New Update
marriage 2nd

marriage 2nd

ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్‌లో ఒక షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఐదుగురు పిల్లల తల్లి అదే గ్రామంలో నివసించే నలుగురు పిల్లల తండ్రితో లేచిపోయింది. ఇది మాత్రమే కాదు, ఆమె తన ప్రియుడిని వివాహం చేసుకున్న ఫోటోను కూడా ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. దీంతో ఇద్దరి కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలిసింది. 

ఈ సంఘటన ఏప్రిల్ 5వ తేదీన జరిగింది. సిద్ధార్థ్ నగర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని మహారియా గ్రామానికి చెందిన గీత అనే మహిళ తన ఐదుగురు పిల్లలను, భర్తను వదిలి ఇంట్లోని నగదు, నగలను తీసుకుని అదృశ్యమైంది. తన భార్య తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి ఉండవచ్చని ఆమె భర్త  శ్రీ చంద్ అనుకున్నాడు. కానీ మూడు రోజుల తర్వాత గ్రామానికి చెందిన గోపాల్ అనే యువకుడితో అతని భార్య పెళ్లి ఫోటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది.  ఇది చూసి ఆ మహిళ భర్త శ్రీ చంద్ షాక్ అయ్యాడు. 

పెద్ద కూతురికి 19 సంవత్సరాలు

శ్రీ చంద్ కు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు సహా 5 మంది పిల్లలు ఉన్నారు. పెద్ద కూతురికి దాదాపు 19 సంవత్సరాలు, చిన్న కూతురికి 5 సంవత్సరాలు. శ్రీ చంద్ గతంలో ముంబైలోని ఒక వడా పావ్ దుకాణంలో పనిచేసేవాడు. గత కొన్ని రోజులుగా, అతను గ్రామంలో కూలీగా పనిచేస్తూ తన పిల్లలను పోషించుకుంటున్నాడు. తన భార్య ఇంట్లో నుంచి తీసుకెళ్లిన నగలు, రూ.90 వేలు తిరిగి ఇవ్వాలని, ఇకపై ఆమెతో తనకు ఎలాంటి సంబంధం లేదని  శ్రీ చంద్ చెప్పాడు.

మరోవైపు, శ్రీ చంద్ భార్యతో పారిపోయిన ప్రేమికుడు గోపాల్ పట్వాకు నలుగురు పిల్లలు ఉన్నారు. గోపాల్ ముంబైలో రాఖీ తయారీదారుగా కూడా పనిచేసేవాడని అతని భార్య చెప్పింది. అతను చాలా కాలంగా కుటుంబానికి ఖర్చులు ఇవ్వడం లేదని తెలిపింది.  తాను ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో స్వీపర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నానని తెలిపింది.  ఇప్పటి వరకు తాను అన్నీ భరించాను కానీ ఇప్పుడు తన భర్త  రెండో  వివాహం చేసుకున్నాడు కాబట్టి, ఆస్తిలో తన పిల్లలకు వాటా ఇవ్వాలని కోరుతానంది.  ఈ విషయం గురించి తాను పోలీస్ స్టేషన్ కు వెళ్లానని, కానీ ఎవరూ తన మాట వినలేదని గోపాల్ భార్య చెబుతోంది. 

Also read :  Crime: ఛీ.. ఛీ వీడు మనిషేనా! పదేళ్ల బాలికను రేప్ చేసి.. ఆ తర్వాత

 

 

 

Advertisment
Advertisment
Advertisment