YS Jagan: డీలిమిటేషన్‌పై ఆందోళన.. ప్రధాని మోదీకి జగన్ సంచలన లేఖ

డీలిమిటేషన్‌పై ఆందోళన నెలకొన్న వేళ వైసీపీ అధినేత జగన్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. 2026లో జరగబోయే డీలిమిటేషన్‌ ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాలకు డీలిమిటేషన్ ద్వారా సీట్ల తగ్గింపు లేకుండా చూడాలని కోరారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
YS Jagan and PM Modi

YS Jagan and PM Modi

నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియపై దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత, మజీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి ప్రధాని మోదీకి లేఖ రాశారు. 2026లో జరగబోయే డీలిమిటేషన్‌ ప్రక్రియలో ఆయా రాష్ట్రాల సీట్ల విషయంలో అన్యాయం జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. '' దక్షిణాది రాష్ట్రాల్లో గత 15 ఏళ్లలో జనాభా బాగా తగ్గిపోయింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకే ఇక్కడ జనాభా నియంత్రణ జరిగింది.  

Also Read: బండి సంజయ్‌కి తప్పిన ప్రమాదం.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

జనాభా ఆధారంగా డీలిమిటేషన్‌ ప్రక్రియ జరిగితే తమ రాష్ట్రాల్లో నియోజకవర్గాలు తగ్గుతాయనే చర్చ నడుస్తోంది. ఇప్పుడున్న జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ ప్రక్రియ అమలు చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు కచ్చితంగా సీట్లు తగ్గిపోతాయి. అందుకోసమే జనాభా లెక్కల ప్రకారం ఈ డీమిలిటేషన్ జరగకుండా చూడండి. పార్లమెంటులో తీసుకునే నిర్ణయాల్లో రాష్ట్రాలకు సమానమైన భాగస్వామ్యం కల్పించేలా చూడాలి.  

Also Read: సునీతా విలియమ్స్‌కు ఓవర్‌టైమ్‌ జీతం చెల్లిస్తా : ట్రంప్

దక్షిణాది రాష్ట్రాలకు డీలిమిటేషన్ ద్వారా సీట్ల తగ్గింపు లేకుండా చూడాలి. ఈ కోణంలో ఆలోచన చేసి డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టాలని కోరుతున్నాను. లోక్‌సభ, రాజ్యసభలో ఏ రాష్ట్రానికి కూడా ప్రాతినిధ్యం తగ్గకుండా నియోజకవర్గాల పునర్విభజన చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నానని'' జగన్‌ లేఖలో రాసుకొచ్చారు. ఇదిలాఉండగా.. డీలిమిటేషన్ ప్రక్రియపై సీఎం స్టాలిన్ నేతృత్వంలో శనివారం వివిధ రాష్ట్రాల పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తోంది. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి సీఎం రేవంత్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ కూడా హాజరయ్యారు. 

Also Read: నేడు వరల్డ్‌ ఎర్త్‌ అవర్‌ డే.. రాత్రి 8.30 నుంచి 9.30 మర్చిపోవద్దు

Also Read: చైనాను వణికించే ఫైటర్ జెట్..వరల్డ్ బెస్ట్ అంటున్న ట్రంప్

telugu-news | delimitation | national-news | ys-jagan | pm modi 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Aghori - Sri Varshini: నా బావ జైలులో నన్ను వేసేయండి.. బోరున ఏడ్చేసిన వర్షిణీ

అఘోరీ అరెస్టు తర్వాత శ్రీవర్షిణి బోరున ఏడ్చేసింది. తన బావ జైలులోనే తనను కూడా ఉంచండి అంటూ రచ్చ రచ్చ చేసింది. తనను పంపిస్తే.. జైలుకు పంపించండి లేదా అత్త మామల దగ్గరకి పంపించండి అంటూ బోరున ఏడ్చేసింది. అంతేకాని తన తల్లిదండ్రుల వద్దకు పంపించొద్దని పేర్కొంది.

New Update

అఘోరీ, శ్రీవర్షిణీ లవ్‌కు బ్రేక్ పడింది. ప్రస్తుతం అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కోర్టు ఆదేశాలతో 14 రోజుల పాటు చంచల్‌గూడ జైల్లోకి పంపారు. అయితే అఘోరీని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో.. ఆ తర్వాత శ్రీవర్షిణీ సంచలన వ్యాఖ్యలు చేసింది. అఘోరీతో పాటే తనను కూడా అరెస్టు చేయాలని కోరింది. తన బావ జైలులోనే తనను కూడా ఉంచండి అంటూ రచ్చ రచ్చ చేసింది. 

Also read :  పహల్గాంలో భయంకరమైన కాల్పుల లైవ్ వీడియోలు.. చూశారంటే గజగజ వణకాల్సిందే!

బోరున ఏడ్చేసిన వర్షిణి

అంతేకాకుడా తనను పంపిస్తే.. జైలుకు పంపించండి లేదా అత్త మామల దగ్గరకి పంపించండి అంటూ బోరున ఏడ్చేసింది. పోలీసులు ఎంత చెప్పినా వర్షిణీ అస్సలు వినిపించుకోలేదు. అఘోరీని జైలుకు పంపిన తర్వాత వర్షిణీకి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు భరోసా కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ వర్షిణికి పోలీసులు ఎంత నచ్చ చెప్పినా ఆమె వినిపించుకోలేదు. తాను మైనర్‌ని కాదని.. మేజర్‌నని.. ఎక్కడైనా ఉండే హక్కు తనకు ఉందని వర్షిణి అంటోంది. తాను కావాలనుకున్న చోటుకే తనను వదిలేయాలని చెబుతోంది. అంతేకాని తన తల్లిదండ్రుల వద్దకు పంపించొద్దని పేర్కొంది.

Also Read :  ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!

 

ఇందులో భాగంగానే వర్షిణికి పలు దఫాలుగా కౌన్సిలింగ్ ఇస్తూన్నా ఆమె మాత్రం ఎవ్వరి మాట వినడం లేదు. అయితే పోలీసులు దాదాపు 15 రోజుల పాటు వర్షిణీకి కౌన్సిలింగ్ ఇవ్వాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వర్షిణి తల్లిదండ్రులు తమ కూతురిని తమకే అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. అఘోరీ మాయమాటలకు వర్షిణి లోబడిందని.. తమ కూతురిని తామే ఇంటికి తీసుకెల్లిపోతామని అంటున్నారు.   

aghori sri varshini | lady aghori sri varshini relation | Lady Aghori Sri Varshini Marriage | Lady Aghori Sri Varshini Love Story | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment