విషాదం.. భర్త, ఇద్దరు కుమారుల మృతి.. ‘మీరు లేని జీవితం నాకొద్దు’

ఏలూరు జిల్లా పెదవేగి మండలం కవగుంటలో విషాదం జరిగింది. రెండు రోజుల క్రితం కట్టుకున్న భర్త, ఇద్దరు కుమారులు పోలవరం కుడి కాలువలో పడి చనిపోయారు. దీంతో రెండు రోజులుగా ఎక్కిఎక్కి ఏడ్చిన భార్య తీవ్ర మనస్థాపంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

New Update
AP: దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను భార్య ఏం చేసిందంటే?

కట్టుకున్న భర్త, కనీ పెంచిన కుమారులు ఒకేసారి మృతి చెందారు. దీంతో రెండు రోజులుగా ఎక్కిఎక్కి ఏడ్చిన భార్య.. ఆ విషాదం నుంచి తేరుకోలేకపోయింది. వారు లేని చోట ఉండలేను అనుకుంది. తలచుకుని తలచుకుని తీవ్ర మనస్థాపానికి గురైంది. ఆ తర్వాత ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన ఏలూరు జిల్లాలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

రెండు రోజులు ఎక్కి ఎక్కి ఏడ్చి

ఏలూరు జిల్లా పెదవేగి మండలం కవగుంటకి చెందిన శెట్టిపల్లి వెంకటేశ్వరరావు, దేవి దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. రెండు రోజుల క్రితం పోలవరం కుడి కాలువలో పడి భర్త శెట్టిపల్లి వెంకటేశ్వరరావు, ఇద్దరు కుమారులు మణికంఠ, సాయి కుమార్ మృతి చెందారు. 

ఈ ఊహించని ఘటన ఆ గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీరు మున్నీరు అయ్యారు. అయితే ఒకేసారి కట్టుకున్న భర్త, కన్న కొడుకులు దూరమవడంతో భార్య దేవి తీవ్ర మనస్థాపం చెందింది. ఏం చేయాలో అర్థం కాలేదు. దీంతో దాదాపు రెండు రోజులు ఏడ్చి ఏడ్చింది.

ఇక వారులేని జీవితం తనకు వద్దనుకుంది. బాత్‌రూంలో స్నానానికి వెళ్లిన దేవి చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇక స్నానానికి వెళ్లిన దేవి ఎంతసేపటికీ రాకపోయే సరికి కుటుంబ సభ్యులు వెళ్లి చూశారు. దీంతో దేవి ఉరికి వేలాడుతూ విగతజీవిగా కనిపించింది. రెండు రోజుల వ్యవధిలోనే ఆ కుటుంబంలో నలుగురు మరణించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. 

Also Read :  బతుకమ్మ సంబరాల్లో విషాదం.. విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Suspicious deaths : శ్రీకాకుళం జిల్లాలో దారుణం..నిన్న కూతురు..ఈ రోజు అమ్మ..అమ్మమ్మ

విజయనగరం జిల్లాకు చెందిన తల్లీకూతుళ్లు శ్రీకాకుళం జిల్లాలోని ఒక బావిలో శవాలై తేలారు. అనుమానస్పద స్థితిలో మృతి చెందిన ఈ సంఘటన స్థానికంగా చర్చనీయంశంగా మారింది. వీరిని డెంకాడకు చెందిన వరలక్ష్మి (కూతురు), సరస్వతి (తల్లి) గా గుర్తించారు.

New Update
death

Suspicious deaths in srikakulam

Suspicious deaths : విజయనగరం జిల్లాకు చెందిన తల్లీకూతుళ్లు శ్రీకాకుళం జిల్లాలోని ఒక బావిలో శవాలై తేలారు. అనుమానస్పద స్థితిలో మృతి చెందిన ఈ సంఘటన స్థానికంగా చర్చనీయంశంగా మారింది. విజయనగరం జిల్లా డెంకాడకు చెందిన వరలక్ష్మి (కూతురు), సరస్వతి (తల్లి) ఇద్దరూ  శ్రీకాకుళం జిల్లా రాగోలు మండలం గూడెం గ్రామం వద్ద బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.  అయితే వీరి మృతి పలు అనుమానాలకు తావిస్తోంది.

Also read :  Subham Trailer పెళ్ళాల సీరియల్ పిచ్చికి బలైన మొగుళ్ళు.. సామ్ స్పెషల్ ఎంట్రీ అదుర్స్! ట్రైలర్ చూశారా
 
 ఈ నెల 24 వ తేదీన విశాఖ జ్ఞానాపురం చెర్చిలో వరలక్ష్మి కుమార్తె చంద్రిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. బాలిక ముఖానికి చున్నీ చుట్టి, నోట్లో గుడ్డలు కుక్కిన ఆనవాళ్లు ఉండడంతో ఆ బాలిక మృతి కలకలం రేపింది. అంతకు ముందు ఆ బాలికకు గాలి సోకిందని చర్చికి తీసుకువెళితే నయమవుతుందని ఆమె తల్లి, అమ్మమ్మ చర్చికి తీసుకువెళ్లినట్లు తెలిసింది. అయితే అక్కడికి వెళ్లిన తర్వాత ఏమైందనేది తెలియదు కానీ ఆ బాలిక మరణించింది. అయితే, తనకు తెలియకుండా తన కూతురును చర్చికి తీసుకెళ్లారని బాలిక తండ్రి నిన్నటి రోజున ఆరోపించాడు. ఈ విషయంపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీంతో పాటు పోలీసులు బాలిక తల్లి, అమ్మమ్మను అదుపులోకి తీసుకుని విచారణ చేసి వదిలేశారు.

Also Read: CSK : పెద్ద ప్లేయర్స్ ఆడటం లేదు..నేనేం చేయాలి..ధోని

అయితే కుమార్తె మృతిపై విశాఖ పోలీసులకు వరలక్ష్మినే ఫిర్యాదు చెసినట్లు మరికొంతమంది చెబుతున్నారు. ఈ క్రమంలో  గూడాంలో మృతుల దూరపు బంధువు ఇంటికి వచ్చే క్రమంలో వీరిని హతమార్చి బావిలో పడేశారని ప్రచారం సాగుతోంది.  మరోవైపు తమ కూతురు మరణానికి తనతో పాటు తన తల్లి కారణమని పోలీసులు అనుమానించడంతో పాటు మరోసారి విచారణకు పిలుస్తారనే భయంతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. అయితే వారు పోలీసుల కేసుకు భయపడి ఆత్మహత్య చేసుకున్నారా? లేక మరెవరైనా చంపారా అనేది మిస్టరీగా మారింది.  అయితే బాలిక మృతికి కారణాలు తెలిస్తే వీరిద్ధరి మరణానికి కారణాలు బయటపడుతాయని స్థానికులు అంటున్నారు. 

Also Read: అమర్నాథ్ యాత్రపై స్పెషల్ ఫోకస్.. కేంద్రం కీలక నిర్ణయం

కాగా వీరిద్దరినీ ఎవరో హతమార్చి నేలబావిలో పడేసారని అనుమానిస్తున్న పోలీసులు కి క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ ను రంగంలోకి దించారు. విచారణ చేపట్టిన పోలీసులు అన్ని కోణాల్లో మిస్టరీన ఛేదించే పనిలో పడ్డారు. కాగా బావిలో తల్లీ్కూతుళ్ల మృతదేహాలు లభ్యం కావడంతో పరిసర ప్రాంత ప్రజలు ఉలిక్కిపడ్డారు.

Also Read : Chhattisgarh : స్టూడెంట్స్తో బలవంతంగా నమాజ్ .. ఏడుగురు టీచర్లపై కేసు!

 

Advertisment
Advertisment
Advertisment