/rtv/media/media_files/2025/04/05/61pIu2qLa7QpwbLQCjLC.jpg)
West Godavari fan draws Pawan Kalyan photo with his blood
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరుకు ఉన్న క్రేజే వేరు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఆయనకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. విదేశాల్లో సైతం పవన్ కోసం పిచ్చయ్యే ఫ్యాన్స్ ఉన్నారు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రాకముందు సినిమాలతో ఎంతో మంది ప్రేక్షకుల్ని, అభిమానుల్ని అలరించాడు. ఆయన సినిమా వస్తుందంటే ఫ్యా్న్స్ సంబరాలు ఓ రేంజ్లో ఉండేవి.
Also Read: చైనా కంగారుపడింది..సుంకాలపై స్పందించిన ట్రంప్
పవన్ డైలాగ్ల కోసం అభిమానులు థియేటర్లకు పరుగులు పెట్టేవారు. కానీ పవన్ ఎప్పుడైతే రాజకీయాల్లోకి అడుగు పెట్టారో అప్పటి నుంచి సినిమాలకు కాస్త బ్రేక్ పడింది. కానీ ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆయనే సీఎం అంటూ ఎలక్షన్లకు ముందు జనసైనికులు జోరుగా ప్రచారం చేశారు. కానీ కూటమిగా ఏర్పడటంతో డిప్యూటీ సీఎంగా పవన్ ఉన్నారు.
Also read: ఫిలిప్పీన్స్కు తెలంగాణ బియ్యం.. కాకనాడ పోర్టుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
దీంతో పవన్ ఫ్యాన్స్ ఉత్సాహానికి అవధుల్లేకుండా పోయింది. ఇక అప్పటి నుంచి పవన్ కూడా పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా తాను ఉన్నాననే భరోసా ఇస్తున్నారు. సినిమా కెరీర్ నుంచి రాజకీయాల్లోకి వచ్చి డిప్యూటీ సీఎంగా ఎదిగిన పవన్తో ఒక్క ఫొటో అయినా తీసుకోవాలని చాలా మందికి ఉంటుంది.
Also read: గ్రూప్-1 మెయిన్స్ టాపర్ ఈమెనే.. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే!
రక్తం చిందించిన అభిమాని
ముఖ్యంగా చాలా మంది పవన్పై తమ అభిమానాన్ని వివిధ రూపాల్లో చాటుకుంటుంటారు. తాజాగా అలాంటిదే జరిగింది. పవన్ పై ఉన్న వీరాభిమానంతో ఓ యువకుడు చేసిన పనికి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఓ యువకుడు తన రక్తంతో పవన్ కళ్యాణ్ ఫొటో గీయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థి వెంకట హరిచరణ్ పవన్పై అభిమానాన్ని చాటుకున్నాడు. తన రక్తంతో పవన్ కళ్యాణ్ చిత్రం గీశాడు. ఆ ఫొటో ప్రస్తుతం వైరల్గా మారింది. అది చూసి పవన్ ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.
Also Read: నువ్వేం చేయలేవు.. నీ అయ్య తరం కాదు.. కిషన్ రెడ్డిపై భగ్గుమన్న రాజాసింగ్!
(Pawan Kalyan | viral-news | latest-telugu-news | telugu-news)
AP News: జగన్ క్షమాపణ చెప్పాలి లేదంటే.. జనమాల శ్రీనివాసరావు స్ట్రాంగ్ వార్నింగ్!
పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగన్ క్షమాపణ చెప్పాలని జనమాల శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. జగన్ తీరు పోలీసులందరినీ కలవరపాటుకు గురిచేసిందన్నారు. వెంటనే క్షమాపణ చెప్పకపోతే ఆయన మీద న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు.
Janamala Srinivasa Rao shocking comments on jagan
AP News: పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగన్ క్షమాపణ చెప్పాలని జనమాల శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఏపీ పోలీస్ అధికారుల అసోసియేషన్ ప్రెసిడెంట్ గా జగన్ మాట్లాడిన తీరును ఖండిస్తున్నట్లు తెలిపారు. జగన్ తీరు పోలీసులందరినీ కలవరపాటుకు గురిచేసిందన్నారు. మాజీ ముఖ్యమంత్రి స్థానంలో ఉండి పోలీసులను బట్టలూడదీస్తానని అనడం ఏమిటని మండిపడ్డారు. జగన్ వెంటనే పోలీసులందరికీ క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో ఆయన మీద న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు.
ప్రభుత్వాలకు భజన చేయాలా..
ఈ మేరకు పోలీస్ అధికారుల సంఘం ఎప్పుడు ఒకరిపైన విమర్శలు చేయలేదు. ఏ ప్రభుత్వం ఉన్నా.. పోలీసుల మీద తప్పుగా మాట్లాడితే ఖండించాం. మాకు ప్రభుత్వాలకు భజన చేయాల్సిన అవసరం లేదు. పోలీసుల్లో మనోధైర్యాన్ని నింపడానికి మీడియా ముందుకు వస్తున్నాం. వేమగిరి ఎస్సై టీడీపీ నేతలతో తిరిగిన వీడియోలు ఉంటే దానిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.
Also Read: TG Crime: ఖమ్మంలో అమానుషం.. మంత్రాల నెపంతో సొంత బాబాయినే హత్య చేసిన యువకుడు!
ఇదిలా ఉంటే.. వెలిగొండ ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు ప్రత్యేక ఫోకస్ పెట్టారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. కానీ గతంలోనే ప్రాజెక్టు పూర్తిచేశామని, జాతికి అంకితం ఇస్తున్నామంటూ జగన్ ప్రజలను మోసం చేశారని విమర్శించారు. నిర్వాసితులకు ఒక్క రూపాయి కూడా పరిహారం ఇవ్వలేదని, చేయని పనులూ చేసినట్లు చెప్పుకోవడంలో ఆయనకు ఆయనే సాటి అంటూ ఎద్దేవా చేశారు.
Also Read: Smartphone export: రికార్డ్ సృష్టించిన ఇండియా.. రూ.2 లక్షల కోట్ల విలువైన స్మార్ట్ఫోన్స్ ఎగుమతి
jagan | police | srinivas | tdp | telugu-news | today telugu news
ఆర్బీఐ ఎఫెక్ట్.. ఈ కంపెనీల షేర్లు భారీగా పతనం
Amla Health Benefits: ఉసిరి చల్లగా ఉంటుందా..వేడిగా ఉంటుందా!
Telangana: ఈ జిల్లాల్లో మళ్లీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ!
East Godavari : మాములు దొంగ కాదు.. కొట్టేసిన నగలను ముత్తూట్ ఫైనాన్స్లో తాకట్టు!
Pawan Kalyan: 3 రోజులపాటు ఆస్పత్రిలోనే పవన్ చిన్న కుమారుడు!