TTD: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. ఈనెల 20 నుంచి..!

ఈనెల 19వ తేదీ వరకు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగనున్నాయి. ఆ తర్వాత తిరిగి పాత విధానంలోనే స్వామివారి దర్శనాలు కల్పించనున్నట్లు టీటీడీ వర్గాలు వెల్లడించాయి.ఈనెల 20వ తేదీన సర్వదర్శనం టోకెన్లు జారీ చేయడం లేదని టీటీడీ ఈవో వివరించారు.

New Update
ttd

Vaikunta Dwara Darshan - TTD

ప్రస్తుతం తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు ఇంకా జరుగుతున్నాయి. వైకుంఠ ద్వారం గుండా వెళ్లి శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా వస్తున్నట్లు టీటీడీ (TTD) అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించిన టోకెన్లను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఎప్పటికప్పుడు జారీ చేస్తున్నారు. ఇక ఈనెల 10వ తేదీన వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం కాగా.. ఇప్పటికే దాదాపు 5 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. 

Also Read: APSRTCకి భారీ లాభాలు.. సంక్రాంతికి కాసుల పంట

ఈ క్రమంలోనే ఈనెల 19వ తేదీ వరకు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగనున్నాయి. ఆ తర్వాత తిరిగి పాత విధానంలోనే స్వామివారి దర్శనాలు కల్పించనున్నట్లు టీటీడీ వర్గాలు వెల్లడించాయి. అయితే త్వరలోనే వైకుఠ ద్వార దర్శనాలు ముగియనున్న నేపథ్యంలో టీటీడీ అధికారులు.. తాజాగా కీలక సమావేశం ఏర్పాటు చేశారు.

Also Read: Telangana: హమ్మయ్య చలి కాస్త తగ్గింది..పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం (Vaikunta Dwara Darshan) ఈ నెల 19వ తేదీన ముగియనున్న నేపథ్యంలో భక్తులకు సర్వదర్శనాలకు సంబంధించిన ఏర్పాట్లపై.. అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఇతర అధికారులతో కలిసి టీటీడీ ఈవో జె.శ్యామలరావు గురువారం మీటింగ్‌ నిర్వహించారు. తిరుమల ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం స్లాటెడ్ సర్వదర్శనం-ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీ ప్రక్రియ శుక్రవారం ముగిసే అవకాశం ఉందని ఈవో జె.శ్యామలరావు చెప్పారు. 

అయితే వైకుంఠ ద్వార దర్శనాలు ముగిసిన తర్వాత ఈనెల 20వ తేదీన శ్రీవారిని దర్శించుకునేందుకు సర్వదర్శనం టోకెన్లు జారీ చేయడం లేదని టీటీడీ ఈవో వివరించారు.ఈనెల 20వ తేదీన సర్వదర్శనం చేసుకోవాలని భావించే భక్తుల కోసం 19వ తేదీన తిరుపతిలో సాధారణ ఎస్‌ఎస్‌డీ టోకెన్లు జారీ చేయరని వివరించారు. భక్తులు నేరుగా సర్వదర్శనం క్యూలైన్లలోకి ప్రవేశించి.. శ్రీవారిని దర్శనం చేసుకోవాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు.

వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దు..

భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌కు చేరుకుని శ్రీవారిని దర్శించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. ఇక 19వ తేదీన ఆఫ్‌లైన్‌లో శ్రీవాణి దర్శన టికెట్లను కూడా జారీ చేయడం లేదని వెల్లడించారు. ఈనెల 20వ తేదీన తిరుమల తిరుపతి దేవస్థానం ప్రొటోకాల్‌ భక్తులకు మినహా మిగిలిన వారికి వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దు చేసినట్లు వివరించారు. ఈ కారణంగానే 19వ తేదీన వీఐపీ బ్రేక్‌ దర్శనం కోసం ఎలాంటి సిఫారసు లేఖలను స్వీకరించడం లేదని ఈవో శ్యామలరావు తెలిపారు.

Also Read: Horoscope: నేడు ఈ రాశివారికి అనుకున్న పని పూర్తి అయిపోతుంది..మిగిలిన రాశుల వారికి ఎలా ఉందంటే!

Also Read: Telangana: తెలంగాణలో మందుబాబులకు షాక్...ధరల పెంపు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: 45 రోజుల పాటు VIP బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ

TTD 45రోజుల పాటు VIP బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. వేసవి సెలవుల నేపథ్యంలో మే1 - జూన్ 15 వరకు ఎమ్మెల్యే,ఎంపీ, ప్రముఖుల సిఫార్సులపై జారీచేసే బ్రేక్ దర్శనాలను క్యాన్సిల్ చేసింది. ప్రొటోకాల్ పరిధి ప్రముఖులు స్వయంగా వస్తే బ్రేక్ దర్శన సదుపాయం కల్పించనుంది.

New Update
TTD cancels VIP break darshans for 45 days

TTD cancels VIP break darshans for 45 days

తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 45 రోజుల పాటు విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. వేసవి సెలవులు ప్రారంభం అయ్యియి. దీంతో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో టీటీడీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. 

Also Read: పహల్గాం దాడిని పూర్తిగా షూట్‌ చేసిన వీడియోగ్రాఫర్‌.. కానీ

మే1 నుంచి రద్దు

ఇందులో భాగంగా మే 1వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు ఎమ్మెల్యే, ఎంపీ, ఇతర ప్రముఖుల సిఫార్సులపై జారీ చేసే బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. అదే సమయంలో కేవలం ప్రొటోకాల్ పరిధిలో ఉన్న ప్రముఖులు స్వయంగా వస్తేనే బ్రేక్ దర్శన సదుపాయం కల్పించనుంది. ఈ మేరకు మే 1వ తేదీ నుంచి ఉదయం 6 గంటలకు స్వయంగా వచ్చే ప్రోటోకాల్ విఐపిలకు మాత్రమే వీఐపీ బ్రేక్‌ను ప్రయోగాత్మకంగా ప్రారంభించనుంది. 

Also Read: పాకిస్తాన్‌లో 170 న్యూక్లియర్ బాంబులు.. వాటి రిమోట్ ఎవరి చేతిలో ఉందో తెలుసా..?

ఒక్కరోజే 82,811 మంది భక్తులు

ఇదిలా ఉంటే TTDలో టోకెన్లు లేని భక్తులకు దాదాపు 18 గంటల సమయం పైనే పడుతోంది. కేవలం ఒక్క శనివారం రోజే భారీగా భక్తులు తిరుమలకు చేరుకున్నారు. సుమారు 82,811 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అదే సమయంలో 34,913 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. కేవలం ఆ ఒక్క రోజే రూ.3.24 కోట్లు శ్రీవారి హుండీ ఆదాయం వచ్చింది. 

Also Read: పహల్గాం దాడికి ముందు ఉగ్రవాదులు ఏం చేశారో తెలుసా? వెలుగులోకి సంచలన నిజాలు

Also read: కాంగ్రెస్ వాళ్లను ఉరికిచ్చి కొడతా... ఎర్రబెల్లి దయాకర్ రావు ఫుల్ ఫైర్

telugu-news | ttd | latest-telugu-news | tirumala tirupati temple

Advertisment
Advertisment
Advertisment