Crime News: అయ్యో.. ఓ వైపు బిడ్డకు జన్మ, మరోవైపు భర్త మృతి: కన్నీరుపెట్టించే ఘటన!

తిరుపతి జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. మహిళ ఓవైపు బిడ్డకు జన్మనివ్వగా.. మరోవైపు ఆమెభర్త మృతి చెందాడు. చెంగమ్మకు పురిటినొప్పులు రావడంతో ఆమెభర్త హరికృష్ణ హాస్పిటల్‌ చేర్పించాడు. డెలివరీ ఖర్చులకు డబ్బులు తెచ్చేందుకు వెళ్లి రోడ్డు ప్రమాదంలో మరణించాడు.

New Update
tirupati Srikalahasti Tangedupalem Cross Road Accident

tirupati Srikalahasti Tangedupalem Cross Road Accident

ఇదో హృదయ విదారక ఘటన. ఓ కుటుంబంలో ఒక ప్రాణం ఊపిరి పోసుకుంటే.. మరోప్రాణం ఊపిరి తీసుకుంది. ఈ ఘటనతో ఆ గ్రామం విలవిల్లాడిపోయింది. అయ్యో.. పాపం అంటూ గ్రామ ప్రజలు కన్నీరు మున్నీరవుతున్నారు. ఎందుకు దేవుడా.. ఇలా చేశావంటూ కుటుంబ సభ్యులు గుండె పగిలేలా ఏడుస్తున్నారు. . . 

ఇది కూడా చూడండి:America: నరకాన్ని దాటుకుంటూ అక్రమంగా అమెరికాకు...డేరియన్‌ గ్యాప్‌ మార్గం అంటే ఏంటి..దీనిని నుంచి వెళ్తే అగ్రరాజ్యాన్ని చేరుకోవచ్చా?

పురిటి నొప్పులు రావడంతో . .

తిరుపతి జిల్లాకు చెందిన ఒక మహిళ ఓ వైపు బిడ్డకు జన్మనిచ్చింది. అయితే అదే సమయంలో ఆమె భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ విషయం తెలిసి ఆ మహిళ కన్నీరు మున్నీరైంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. తిరుపతి జిల్లాకు చెందిన చెంగమ్మకు పురిటి నొప్పులు రావడంతో ఆమె భర్త హరికృష్ణ హుటా హుటిన ఆస్పత్రిలో చేర్పించాడు. 

ఇది కూడా చూడండి: Telangana: సుప్రీం కోర్టు సంచలన తీర్పు..మొదటి పెళ్లి రద్దుకాకపోయినప్పటికీ కూడా రెండో భర్త భరణం ఇవ్వాల్సిందే

రోడ్డు ప్రమాదంలో. . 

అయితే డెలివరీ ఖర్చుల కోసం డబ్బులు లేకపోవడంతో వాటిని తీసుకురావడానికి బైక్‌పై ఇంటికి వెళ్లాడు. అలా వెళ్తుండగా శ్రీకాళహస్తిలోని తంగేడుపాలెం క్రాస్‌ వద్ద ప్రమాదం జరిగింది. టెంపో వ్యాన్ హరికృష్ణ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హరికృష్ణ అక్కడికక్కడే తీవ్ర రక్తస్రావంతో మృతి చెందాడు. ఇక భర్త మరణ వార్త విన్న భార్య చెంగమ్మ బోరున విలపించింది. అయ్యో ఏం పాపం చేశానంటూ చెంగమ్మ కన్నీరుమున్నీరైంది. ఈ ఘటన ప్రతి ఒక్కరినీ కన్నీరు పెట్టిస్తోంది. .

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు