AP Crime: పంట కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురి మృతి

ఏపీలో విషాద కర ఘటన చోటుచేసుకుంది. అదుపుతప్పి కారు పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరొకరు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన అంబేద్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం ఊడిమూడి చింతావారిపేటలో కలకలం రేపింది.

New Update
konaseema

AP Crime

AP Crime: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పోతవరానికి చెందన నేలపూడి విజయ్ కుమార్ భార్య, పిల్లలతో విహారయాత్రకు విశాఖపట్నం వెళ్లి తిరిగి పోతవరం వస్తున్నాడు. విహారయాత్రకు వెళ్లి సరదాగా గడిపిన ఇంటికి చేరకుండానే విగతజీవులుగా మారిపోయారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో చింతావారిపేట వద్ద  కారు ప్రమాదం జరిగింది. అయితే నిద్రమత్తుతో కళ్లు మూతలు పడుతున్నాయని కారు రోడ్డు పక్కన ఆపిన విజయ్.. భార్య ఉమ డ్రైవింగ్ నాకు వచ్చుగా.. ఇంకా పది కిలోమీటర్ల దూరంలో ఇంటికి వెళ్ళిపోతాం కదా అని చెప్పిడంతో దీనికి భర్త సరే అన్నాడు. దీంతో ఉమ కార్ డ్రైవింగ్ చేస్తూ బయలుదేరారు. 

విహారయాత్రక వెళ్లి తిగిరి వస్తుండగా...

కారు కొద్ది దూరం రాగానే అదుపుతప్పి పంట కాలువలోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో ఉమ (35), రోహిత్ (9), మనోజ్ (7) మరణించగా.. విజయ్‌ కమార్‌ ప్రాణాలతో బయటపడ్డాడు. ఐదు కిలోమీటర్ల దూరంలో ఇంటికి చేరుకుంటారు అనుకుంటే వారంతా శవాలుగా మారడం అందర్ని కలచివేసింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

ఇది కూడా చదవండి: ఉసిరి రసంలో ఇది కలిపి తాగితే బరువు తగ్గడం ఖాయం

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తన కళ్లముందే భార్యాపిల్లలు. కొట్టుకుపోయారని విజయ్‌ ​కుమార్ బోరున విలపించారు. విహారయాత్రకు వెళ్లి విగతజీవులుగా మారటంతో రెండు కుటుంబాల మధ్య తీవ్ర విషాదం అలుముకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

ఇది కూడా చదవండి: ఈ మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు.. క్యాన్సర్‌ను చంపాలంటే..

ఇది కూడా చదవండి: చెట్ల పొదల్లో రొమాన్స్..మరో లడ్డు కావాలా నాయనా

ఇది కూడా చదవండి: ఏపీలో 483 టన్నుల బియ్యం పట్టివేత!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

IAS transfers : ఏపీలో ఐఏఎస్ ల బదిలీలు...సిసోడియా ఔటు- ముత్యాల రాజుకు చోటు..!!

ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పలు హోదాల్లో పని చేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. అధికారంలోకి వచ్చిన తరువాత పక్కన పెట్టిన అధికారులకు ఇప్పుడు పోస్టింగ్ ఇస్తోంది. సీనియర్ ఐఏఎస్ సిసోడియాను బదిలీ చేసారు.

New Update
IAS transfers

IAS transfers

IAS transfers :  ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పలు హోదాల్లో పని చేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. అధికారంలోకి వచ్చిన తరువాత పక్కన పెట్టిన అధికారులకు ఇప్పుడు పోస్టింగ్ ఇస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు సమయం నుంచి రెవిన్యూ - రిజిస్ట్రేషన్ శాఖలు కీలకంగా మారాయి.

Also Read: సుంకాలు 90 రోజుల విరామం ఎఫెక్ట్.. భారీ లాభాల్లో భారత స్టాక్ మార్కెట్లు..

ఈ శాఖలను ఇప్పటి వరకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో పర్యవేక్షించిన సీనియ ర్ ఐఏఎస్ అధికారి సిసోడియాను బదిలీ చేసారు. సిసోడియాకు హ్యాండ్లూమ్, టెక్స్‌టైల్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు కేటాయించారు. ఆయన స్థానంలో ప్రస్తుతం CCLA స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న జయలక్ష్మి రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా అదనపు బాధ్యతల అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు.

Also Read: Vivo V50e 5G Offers: మచ్చా ఆఫర్ అంటే ఇదేరా.. ప్రీ బుకింగ్ స్టార్ట్.. రూ. 5వేల భారీ డిస్కౌంట్- కెమెరా సూపరెహే!

ఇక, ప్రస్తుతం ఐటీ కార్యదర్శిగా ఉన్నా కాటమనేని భాస్కర్ కు ఏపీ హెచ్ఆర్డీ సంస్థ డైరెక్టర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీఎంఓలో కీలకం గా వ్యవహరించిన ముత్యాల రాజుకు ఇప్పుడు పోస్టింగ్ దక్కింది. ఆయనకు స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పంచాయితీ రాజ్ సెక్రటరీగా నియమించారు.

Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!

పోస్టింగ్ కోసం వెయిటింగ్ లో ఉన్న మరో అధికారి మాధవీ లతకు రైతు బజార్ల సీఈవోగా నియామకం చేసారు. మరో ఐఏఎస్ గౌతమికి గిరిజన విద్య సంస్థల కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. ఫైబర్ నెట్ లో జీవీ రెడ్డి పై ఆరోపణలు చేసి.. అక్కడ నుంచి బదిలీ అయిన దినేష్ కుమార్ ను ఆయూష్ డైరెక్టర్ గా నియమించారు. ఏపీ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఎండీ గా కే నీలకంఠారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇది కూడా చూడండి: BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి మంజూరు..!

Advertisment
Advertisment
Advertisment