/rtv/media/media_files/2025/03/20/fifOv1OGeaZj7taVdoKu.jpg)
AP honor Advisors
స్పేస్ టెక్నాలజీకి ఇస్రో మాజీ ఛైర్మన్ సోమనాథ్, ఏరోస్పేస్, డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్కి కేంద్ర రక్షణశాఖ సలహాదారు సతీష్రెడ్డి, చేనేత, హస్తకళల అభివృద్ధికి ప్రముఖ పారిశ్రామికవేత్త, భారత్ బయోటెక్ సంస్థ ఎండీ సుచిత్ర ఎల్ల, ఫోరెన్సిక్ సైన్స్ రంగానికి ప్రముఖ ఫోరెన్సిక్ శాస్త్రవేత్త కేపీసీ గాంధీలను గౌరవ సలహాదారులుగా నియమించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం . కేబినెట్ హోదాతో వీరిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నలుగురు నెండేళ్ళ పాటూ ఈ పదవుల్లో ఉంటారు.
నిర్వహించాల్సిన విధులు..
ఏరోస్పేస్, డిఫెన్స్ పరిశోధన, తయారీ రంగంలో ప్రపంచస్థాయి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ను తయారు చేయడానికి సతీష్ రెడ్డి మార్గదర్శకత్వం వహించాల్సి ఉంటుంది. పారిశ్రామికవేత్తలు, పరిశోధనా సంస్థలు, ప్రభుత్వ రంగంలోని రక్షణ సంస్థలతో సమన్వయం చేసుకుంటూ ప్రాజెక్టులు కూడా చేపట్టాల్సి ఉంటుంది.
చేనేతకు మార్కెట్ ను పెంచడంతో పాటూ దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షిస్తూ.. కళాకారులు, సహకార సంస్థలు, ఎంఎస్ఎంఈలకు మద్దతిచ్చేలా సుచిత్ర ఎల్లా పని చేయాల్సి ఉంటుంది. హస్తకళల రంగాల సుస్థిరత, బలోపేతం, అభివృద్ధికి అవసరమైన సలహాలు..జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అమలు చేస్తున్న విధానాలను సూచించాలి.
రాష్ట్రంలో ఫోరెన్సిక్ మౌలిక వసతులు, మానవ వనరులను మెరుగుపరిచేందుకు నిధులు రాబట్టడం..ఫోరెన్సిక్ సైన్స్ రంగంలో ప్రపంచంలో అమల్లో ఉన్న అత్యుత్తమ విధానాలు ఆచరణలో పెట్టడం చేయాలి. నేరగాళ్ల ప్రొఫైలింగ్, అనుమానితుల గుర్తింపునకు వీలుగా ఫోరెన్సిక్ డేటా ఇంటిగ్రేషన్కుకేీసీ గాంధీ సహకారం అందించాలి.
పరిపాలన, పారిశ్రామిక, పరిశోధన రంగాల్లో స్పేస్ టెక్నాలజీని వినియోగించుకోవటానికి అనువుగా అవసరమైన విధానాల రూపకల్పనకు సలహాలివ్వడమే కాకుండా.. అడ్వాన్స్డ్ స్పేస్ టెక్నాలజీ హబ్లు, టెస్టింగ్ సదుపాయాలు, రీసెర్చ్ సెంటర్ల ఏర్పాటుపై సోమనాథ్ మార్గదర్శకత్వం వహించాలి. వీటతో పాటూ జీఐఎస్, శాటిలైట్ నేవిగేషన్, ఏఐ ఆధారిత స్పేస్ ఎనలిటిక్స్ వినియోగం మరింత పెరిగేలా చూడాలి.
ఇది కూడా చూడండి: HYD: ఎల్బీ నగర్ లో దారుణం..బైక్ ను ఢీకొట్టి కిలోమీటర్ ఈడ్చుకెళ్ళిన కారు