Sri Reddy: పార్టీ విడిచి ఎవరూ వెళ్లవద్దు.. ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేసిన శ్రీ రెడ్డి

వైసీపీ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉందని ఎవరూ పార్టీ విడిచి వెళ్లవద్దని శ్రీ రెడ్డి కోరింది. ప్లీజ్ కాస్త ఓపికతో అందరూ ఉండి.. జగన్‌ అన్నకు సపోర్ట్ చేయండని తెలిపింది. పార్టీలో యాక్టివ్‌గా లేకపోయినా.. కనీసం సైలెంట్‌గా అయినా పార్టీలో ఉండండని కోరింది.

New Update
actress Sri Reddy

sri reddy

ప్రస్తుతం వైసీపీ పార్టీ నుంచి కీలక నేతలు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. దీంతో శ్రీరెడ్డి పార్టీని వదిలి ఎవరూ వెళ్లవద్దని విజ్ఞప్తి చేస్తోంది. ప్రస్తుతం వైసీపీ పార్టీ కష్టకాలంలో ఉందని, దయ చేసి ఎవరూ కూడా పార్టీ విడిచి వెళ్లవద్దు. ప్లీజ్ కాస్త ఓపికతో ఉండి.. జగన్‌ అన్నకు సపోర్ట్ చేయండని ఆమె కోరింది.

ఇది కూడా చూడండి: Saif Ali Khan: సైఫ్‌పై దాడి.. అర్థరాత్రి ఏం జరిగిందంటే.. వెలుగులోకి షాకింగ్ నిజాలు

రవి చంద్రారెడ్డి రాజీనామా బాధాకరం..

పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు వదిలి వెళ్లడం కరెక్ట్ కాదని ఆమె తెలిపింది. వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి పార్టీకి రాజీనామా చేయడంతో ఈ సందర్భంగా ఆమె స్పందించింది. రవి చంద్రారెడ్డి రాజీనామా బాధించిందని, ఎందుకు రాజీనామా చేశారని ప్రశ్నించే హక్కు తనకు లేదని తెలిపింది. ఆయన స్పీచ్‌లు బాగుంటాయని, అలాంటి వ్యక్తి పార్టీకి రాజీనామా చేయడం బాధిస్తుందని శ్రీ రెడ్డి వెల్లడించారు.

ఇది కూడా చూడండి: America: మారణహోమానికి మీ నిర్ణయాలే కారణం..బ్లింకన్‌ పై తీవ్ర స్థాయిలో విమర్శలు!

కనీసం సైలెంట్‌గా అయినా..

పార్టీలో యాక్టివ్‌గా లేకపోయినా కూడా కనీసం సైలెంట్‌గా అయిన పార్టీలో ఉండండని తెలిపింది. ఇలాంటి కష్ట సమయాల్లో జగన్‌కు సపోర్ట్ చేయాలని ఆమె తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీకి రాజీనామా చేయవద్దని తెలిపింది. మాకు ఎలాంటి గుర్తింపు లేకపోయినా జగన్‌కు సపోర్ట్‌గా ఉంటామని శ్రీరెడ్డి వెల్లడించారు. ఇలాంటి కష్ట సమయాల్లో పార్టీకి సపోర్ట్‌గా ఉంటే.. ఎప్పటికైనా గుర్తింపు వస్తుందని ఆమె అన్నారు. అందుకే తాను వైసీపీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నట్లు శ్రీరెడ్డి తెలిపారు. 

ఇది కూడా చూడండి: Urvashi Rautela: సైఫ్ అలీ ఖాన్ కు క్షమాపణ చెప్పిన ఊర్వశీ రౌతేలా.. సిగ్గుగా ఉందంటూ పోస్ట్

ఇది కూడా చూడండి: Mohan Babu: మంచు ఫ్యామిలీ వివాదంలో మరో ట్విస్ట్.. కలెక్టర్ కు మోహన్ బాబు ఫిర్యాదు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: సీఎం రేవంత్ కు షాకిచ్చిన ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు.. అలా చేశారేంటి?

నిన్న జరిగిన CLP భేటీకి ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్, ప్రేమ్ సాగర్ రావు హాజరుకాకపోవడం హాట్ టాపిక్ గా మారింది. మంత్రి పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న ఈ ముగ్గురు.. ఎందుకు రాలేదన్న అంశంపై కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది.

New Update

మంత్రివర్గ విస్తరణ అంశం తెలంగాణ కాంగ్రెస్ కు, సీఎం రేవంత్ కు తలనొప్పిగా మారింది. కేబినెట్ బెర్త్ ఆశిస్తున్న నేతలు స్వరం పెంచారు. తమను అడ్డుకుంటున్న వారిపై, హైకమాండ్ తీరుపై బహిరంగంగానే కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీనియర్ నేత జానారెడ్డి తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ మరుసటి రోజే మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సారగ్ రావు ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. అన్ని పార్టీలు తిరిగి వచ్చిన వారు తనకు మంత్రి పదవి రాకుండా కుట్రలు చేస్తున్నారంటూ కామెంట్ చేశారు. వివేక్ ఫ్యామిలీని టార్గెట్ చేసి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

అయితే నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్ కు మంత్రి పదవిని ఆశిస్తున్న ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్‌, ప్రేమ్‌సాగర్‌రావు గైర్హాజరు కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. కేబినెట్ విస్తరణలో తమకు చోటు కల్పించాలంటూ ఈ ముగ్గురు ఎమ్మెల్యేల తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో వీరు సీఎల్పీ భేటీకి ఎందుకు హాజరు కాలేదనే అంశం హాట్ టాపిక్ గా మారింది. పార్టీ నాయకత్వంపై అలిగే వీరు హాజరుకాలేదా? అన్న చర్చ సాగుతోంది. 

ఇదిలా ఉంటే.. నిన్నటి సీఎల్పీ భేటీలో ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కేబినెట్ విస్తరణపై పార్టీ నేతలు మాట్లాడొద్దని స్పష్టం చేశారు. మంత్రివర్గం విస్తరణను అధిష్టానం చూసుకుంటుందన్నారు. పార్టీ లైన్‌ దాటితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

Advertisment
Advertisment
Advertisment