YS Vivekanada MurderCase: వైఎస్‌ వివేకా మర్డర్ కేసులో..పోలీసులకు కోర్టు బిగ్‌ షాక్‌

వైఎస్ వివేకా హత్య కేసులో పులివెందుల పోలీసులు వేసిన పిటిషన్ ను కోర్టు కొట్టేసింది.వైఎస్ సునీత, సీబీఐ ఏఎస్పీ రాంసింగ్ బెదిరిస్తున్నారంటూ వివేకా పీఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అవి తప్పుడు ఆరోపణలంటూ పోలీసులు కేసు నమోదు చేయగా కోర్టు కొట్టేసింది.

New Update
వివేకా హత్య కేసులో నిందితులకు రిమాండ్ పొడిగింపు

pulivendula

వైఎస్ వివేకా హత్య (YS Vivekananda) కేసులో పులివెందుల పోలీసులు (Pulivendula Police) వేసిన పిటిషన్ ను పులివెందుల కోర్టు తిరస్కరించి కొట్టేసింది. 2023లో వైయస్ సునీత, సీబీఐ ఏఎస్పీ రాంసింగ్ తమకు అనుకూలంగా స్టేట్మెంట్ ఇవ్వమని వత్తిడి చేస్తున్నారంటూ వివేకా పీఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే అప్పట్లో పోలీసులు ఈ ఫిర్యాదు నమోదు చేయలేదు. 

Also Read: Maha Kumbh: కుంభమేళాలో నీటి నాణ్యతపై యోగి సర్కార్ చీటింగ్.. తప్పుడు రిపోర్ట్ పై ఎన్జీటీ సీరియస్!

Pulivendula Court Dismiss Police Petition

దీంతో పీఏ కృష్ణారెడ్డి పులివెందుల కోర్టు (Pulivendula Court) లో ప్రైవేటు కేసు వేశాడు. కోర్టు అదేశంతో అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే కృష్ణారెడ్డి ఫిర్యాదు కొట్టివేయాలంటూ హై కోర్టులో వైఎస్ సునీత కేసు వేశారు. అయితే  కేసు కొనసాగించాల్సిందేనని హై కోర్టు తీర్పు చెప్పింది. హై కోర్టు తీర్పును సవాలు చేస్తూ వైఎస్ సునీత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 

Also Read: Maha Kumbh Mela 2025: కుంభమేళాలో మహిళల వీడియోలు షేర్ ..  15 సోషల్ మీడియా అకౌంట్లపై కేసు బుక్  !

తాజాగా పీఏ కృష్ణారెడ్డి (PA Krishna Reddy) పులివెందుల కోర్టులో ప్రైవేటు కేసు వేశాడు దీంతో ఆ ఫిర్యాదు తప్పు అంటూ పులివెందుల కోర్టుకు పోలీసులు నివేదించారు. ఈ కేసును తప్పుడు ఫిర్యాదుగా పరిగణించాలని పోలీసులు పులివెందుల కోర్టును కోరారు. అయితే పులివెందుల కోర్టు  పోలీసుల అభ్యర్థనను కొట్టివేసింది. సుప్రీం కోర్టులో కేసు పెండింగులో ఉండగా కేసు అసత్యమని ఎలా చెబుతారంటూ కోర్టు వ్యాఖ్యానించింది.

ఇదిలా ఉంటే తమపై నమోదైన కేసులను క్వాష్ చేయాలని సునీత, రాజశేఖర్ రెడ్డి, సీబీఐ విచారణ అధికారి రాంసింగ్ దాఖలు చేసిన పిటిషన్లపై సైతం విచారణ జరిగింది. వివేకా హత్య కేసు పరిణామాలను న్యాయస్థానానికి వీరి తరుఫున న్యాయవాది లూథ్రా వివరించారు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణను వచ్చే ఏడాది మార్చ్ 3కు వాయిదా వేసింది న్యాయస్థానం. దర్యాప్తు అధికారిపై ప్రైవేట్ కంప్లైంట్ తో విచారణను అడ్డుకున్నారని లూథ్రా వాదనలు వినిపించారు. వివేకా హత్య కేసును రూపు మాపాలనే ప్రయత్నం చేశారని వివరించారు. 

Also Read: Satya Nadella: ఇంటర్వ్యూ కోసం ఏకంగా సత్య నాదెళ్లకే మెయిల్‌..ఎంత సేపటిలో రిప్లై వచ్చిందో తెలుసా!

Also Read: Flipkart Mobile Offers: ఇదెక్కడి ఆఫర్రా బాబు.. మతిపోతుంది: ఫ్లిప్‌‌కార్ట్‌లో రూ.50వేల ఫోన్ పై భారీ డిస్కౌంట్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Vontimitta Kodandarama Swamy Temple: హనుమంతుడి లేని రామాలయం..మన దగ్గరే..ఎన్నో ప్రత్యేకతలు!

ప్రతి రామాలయంలో సీతారామలక్ష్మణులతో పాటుగా ఆంజనేయడు కూడా కొలువై ఉంటాడు. రాములోరి సేవలో తరిస్తూ భక్తుల పూజలు అందుకుంటూ ఉంటాడు. కానీ ఆంజనేయుడు లేని రామాలయం ఒకటుందని.. మీకు తెలుసా.. ఆ ఆలయం గురించి ఈ కథనంలో..

New Update
hanuman

hanuman

రామాలయం లేని ఊరు.. హనుమంతుడు లేని రాములోరి ఆలయం ఉండదనేది పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారు. కానీ హనుమంతుడు లేని రామాలయం కూడా ఒకటి ఉంది. అది కూడా మరెక్కడో కాదు సాక్షాత్తు  ఏపీలోనే ఉందని తెలుసా.. అదే వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం. అన్ని ఆలయాల్లో సీతారామలక్ష్మణ ఆంజనేయస్వాములు కనిపిస్తే ఇక్కడ మాత్రం ఆంజనేయస్వామి ఉండరు. దాని వెనుక కూడా ఆసక్తికరమైన కథ ఉంది. 

Also Read: Kerala: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!

ఆంజనేయస్వామిని కలవకముందే.. ఈ ప్రాంతంలో శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు సంచరించారని.. అందుకే ఆలయంలో ఆంజనేయుడి విగ్రహం ఉండదనేది స్థానికులు చెబుతారు.ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో ఒకే శిలపై సీతారామ లక్ష్మణ దేవతామూర్తుల విగ్రహాలు ఉంటాయి. అందుకే ఒంటిమిట్టను ఏకశిలానగరం అని కూడా పిలుస్తారు. త్రేతాయుగంలో సీతాలక్ష్మణ సమేతుడైన శ్రీరాముడు దండకారణ్యంలో సంచరిస్తూ ఇక్కడకు వచ్చారని పురాణాలు చెప్తున్నాయి. 

Also Read: WhatsApp new features: వాట్సాప్‌ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!

ఆ సమయంలో సీతాదేవికి బాగా దప్పిక వేసిందని.. సీతాదేవి దాహం తీర్చేందుకు శ్రీరాముడు భూమిలోనికి బాణం వేస్తే నీటిబుగ్గ పుట్టిందని పురాణాల్లో ఉంది. అదే ఒంటిమిట్ట రామతీర్థం అయ్యిందని చెప్తుంటారు.ఇక ఈ ఆలయం పేరుపైనా అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. కోదండరామస్వామి ఆలయాన్ని మిట్టమీద నిర్మించారని.. అందుకే ఒంటిమిట్ట రామాల‌యం అని పేరు వ‌చ్చింద‌ని కొంతమంది చెప్తుంటారు. అయితే ఒంటుడు, మిట్టుడు అనే ఇద్దరు రామ‌భ‌క్తులు ఈ గుడిని నిర్మించారని.. వారి పేరుమీద ఒంటిమిట్ట రామాలయం అయ్యిందనేది మరో వాదన. సీతారాముల క‌ల్యాణం త‌ర్వాత మృకండ మహర్షి, శృంగి మహర్షి యాగ రక్షణ కోసం శ్రీరామలక్ష్మణులు ఇక్కడ‌కు వ‌చ్చారని.. అందుకు ఆ మ‌హర్షులు సీతారామ ల‌క్ష్మణుల విగ్రహాల‌ను ఇక్కడ ఏర్పాటు చేయించారని మరో కథనం. ఆ విగ్రహాలకు తర్వాత కాలంలో జాంబవంతుడు ప్రాణ ప్రతిష్ట చేశాడ‌ని మరికొందరు అంటుంటారు.

ఒంటిమిట్ట రామాలయంలో సీతారాముల కళ్యాణం రాత్రి వేళ ఎందుకు జరుగుతుందనే దానికి కూడా ఆసక్తికరమైన కథ ఉంది. అది కూడా శ్రీరామనవమి రోజున కాకుండా చైత్ర శుద్ధ పౌర్ణమి రాత్రి జరుగుతుంది. పురాణాల ప్రకారం విష్ణుమూర్తి, లక్ష్మీదేవి వివాహం పగలు జరిగినప్పుడు, చంద్రుడు తన సోదరి లక్ష్మీదేవి పెళ్లిని చూడలేకపోయానని విష్ణువుతో మొరపెట్టుకున్నాడట. దీంతో "నీ కోరిక రామావతారంలో తీరుతుంది" అని మహా విష్ణువు వరమిచ్చాడు. 

ఆ ప్రకారం ఒంటమిట్టలో సీతారాముల కళ్యాణం వెన్నెల వెలుగుల్లో నిర్వహిస్తారు. ఇక ఒంటిమిట్ట ఆలయ గోపురాలు చోళ శైలిలో, రంగమంటపం విజయనగర శిల్పకళా వైభవాన్ని ప్రతిబింబిస్తాయి. 32 స్తంభాలతో కూడిన రంగమంటపం, 160 అడుగుల ఎత్తైన గోపురం దీని సౌందర్యాన్ని మరింత ఆకర్షణీయంగా చేస్తాయి.

Also Read: Iran: చరిత్రలో రికార్డ్ స్థాయికి పడిపోయిన ఇరాన్ కరెన్సీ విలువ.. డాలర్‌కు 10 లక్షల రియాల్స్‌..

Also Read: Sri Rama Navami 2025: శ్రీరామ నవమి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఇదే

 

 kadapa | vontimitta-kodandaram | temple | sri-rama-navami | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment