తొమ్మిదో తరగతి బాలికతో ఎఫైర్.. ఉపాధ్యాయుడికి బతికినంతకాలం జైలు శిక్ష

పాఠశాల విద్యార్ధినిని అపహరించిన ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయుడు షేక్‌ మహమ్మద్‌‌కు ఒంగోలు పోక్సో కోర్టు బతికినంత కాలం జైలు శిక్ష విధించింది. సంచలనం సృష్టించిన ఈ కేసులో ఎనిమిదేళ్ల తర్వాత తీర్పు వెలువడింది. 2017లో మైనర్‌ బాలికను పాఠశాల ఉపాధ్యాయుడు అపహరించాడు.

New Update
Ongole POCSO court

విద్యార్థికి విద్యాబుద్దులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు ప్రేమ పాఠాలు చెప్పాడు. తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికకు మాయమాటలు చెప్పి లోబరచుకున్నాడు. తనతో వచ్చేయాలని.. మంచి జీవితం అందిస్తానని నమ్మించాడు. అతడి మాటలు విన్న ఆ బాలిక ఇంట్లో నుంచి పారిపోయింది. కట్ చేస్తే.. ఆ ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరచగా.. బతికినంతకాలం జైలు శిక్ష విధిస్తూ.. ఒంగోలు పోక్సో కోర్టు ఇన్‌ఛార్జి, ఏడో అదనపు జిల్లా జడ్జి టి.రాజావెంకటాద్రి సోమవారం తీర్పు చెప్పారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

Also Read: చెత్తతో నిండిపోయిన భూకక్ష్య..ప్రమాదంలో ఉన్నామంటున్న ఐరాస

ఏం జరిగిందంటే?

ప్రకాశం జిల్లా కంభం గ్రామానికి చెందిన షేక్ మహమ్మద్ అఫ్సర్ బాషా అదే గ్రామంలో ఉన్న ఓ ప్రైవేటు స్కూల్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఆ సమయంలోనే తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ బాలికపై కన్నేశాడు. ఆ బాలికకు మాయమాటలు చెప్పి లోబరచుకున్నాడు. జీవితాంతం సంతోషంగా చూసుకుంటానంటూ నమ్మించి వలలోకి దించాడు. 

Also Read: టీడీపీ గూటికి ఏపీ మాజీ ఉపముఖ్యమంత్రి..!

అలా అతడి వలలో పడిపోయిన ఆ బాలికను ఇంటి నుంచి వచ్చేయాలని చాలా సార్లు రిక్వెస్ట్ చేశాడు. దీంతో 2017 ఆగస్టు 6న ఆ బాలిక ఇంటినుంచి అతడితో వెళ్లిపోయింది. ఆపై ఆమెకు జాబ్ కోసం పలు ప్రాంతాలు తిరిగాడు. వెళ్లిన ప్రతి చోట ఆమెను తన చెల్లిగానే పరిచయం చేశాడు. ఇదిలా కొనసాగుతుండగా.. ఆ బాలిక తల్లిదండ్రులు మరోవైపు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. 

Also Read: 108, 104 సర్వీసుల నుంచి అరబిందో ఔట్

దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. వీరిద్దరూ నరసరావు పేటలో ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అక్కడికి వెళ్లిన పోలీసులు అదే నెల 24వ తేదీన ఇద్దరినీ పట్టుకున్నారు. అనంతరం వారిని ఒంగోలుకు తీసుకొచ్చారు. అనంతరం నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేయడంతో పాటు కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేశారు. 

Also Read: ఏపీలో 280 పోస్టులకు నోటిఫికేషన్..

ఈ కేసును విచారించిన న్యాయమూర్తి నిందితుడికి ఊహించని శిక్ష వేశారు. నేరారోపణలు రుజువు కావడంతో నిందితుడికి బతికినంత కాలం జైలు శిక్ష విధించారు. అంతేకాకుండా రూ.25 వేల జరిమానా సైతం విధించారు. మరోవైపు పరిహార చట్టం కింద బాధితురాలికి ప్రభుత్వం నుంచి సుమారు రూ.7 లక్షల సాయం అందేలా చూడాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థకు ఆదేశించారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP Govt : ఏపీ ప్రభుత్వం కొత్త పథకం.. కుటుంబానికి రూ.20వేలు..రేపటి నుంచి అకౌంట్లోకి!

రేపు ఏపీ సీఎం చంద్రబాబు శ్రీకాకుళంలో పర్యటించనున్నారు. 'మత్స్యకార సేవలో' అనే పేరుతో సీఎం కొత్త పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద ఒక్కో కుటుంబానికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిచనున్నారు. దీనికోసం ప్రభుత్వం  రూ. 258 కోట్ల మేర ఖర్చు చేయనుంది.

New Update
chandrababu srikakulam

chandrababu srikakulam

మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.  సముద్రంలో వేట విరామ సమయంలో జాలర్లకు అందించే ఆర్థిక సాయం అందించనున్నారు.  ఏప్రిల్ 26వ తేదీ శనివారం రోజున సీఎం చంద్రబాబు శ్రీకాకుళంలో పర్యటించనున్నారు. 'మత్స్యకార సేవలో' అనే పేరుతో సీఎం చంద్రబాబు పథకాన్ని ప్రారంభించనున్నారు. ఒక్కో కుటుంబానికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిచనున్నారు. ఈ పథకం కింద 1,29,178 కుటుంబాలకు లబ్ది చేకూరనుంది. దీనికోసం కూటమి ప్రభుత్వం  రూ. 258 కోట్ల మేర ఖర్చు చేయనుంది. రేపు లబ్దిదారుల ఖాతాల్లోకి నగదు జమ చేయనున్నారు.  

Advertisment
Advertisment
Advertisment