Ap Crime News: మహాశివరాత్రి వేళ- ఏపీలో స్నానానికి దిగి తండ్రి కొడుకు మృతి.. మరో ఐదుగురు!

మహాశివరాత్రి సందర్భంగా నదుల్లో స్నానాలు చేస్తుండగా విషాద ఘటనలు జరిగాయి. తూ.గో జిల్లా తాడిపూడిలోని గోదావరిలో దిగిన 11మందిలో ఐదుగురు యువకులు గల్లంతయ్యారు. మరోవైపు శ్రీశైలం డ్యామ్ దిగువన కృష్ణా నదిలో స్నానం చేస్తూ నీటి ఉద్ధృతికి తండ్రీ కొడుకులు మృతిచెందారు.

New Update
West Godavari Two students died

Mahashivratri 2025 Father and son died bathing in Krishna river

మహాశివరాత్రి సందర్భంగా దేశ వ్యాప్తంగా ప్రజలు ఆలయాలకు పోటెత్తుతున్నారు. ఈ క్రమంలో పుణ్య స్నానాలు ఆచరించి దేవున్ని దర్శించుకుంటున్నారు. అయితే తాజాగా కొందరు భక్తులు నదుల్లో స్నానాలు చేస్తుండగా విషాద ఘటనలు జరిగాయి. తూర్పు గోదావరి జిల్లా తాడిపూడిలోని గోదావరిలో 11మంది దిగారు. అయితే నీటి ఉద్ధృతికి ఆరుగురు వ్యక్తులు బయటపడగా.. మరో ఐదుగురు యువకులు గల్లంతయ్యారు.

వారు పవన్, దుర్గా ప్రసాద్, ఆకాష్, సాయి, పవన్‌లుగా గుర్తించారు. ప్రస్తుతం వారి కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు. అలాగే మరోవైపు ఇంకో విషాదం చోటుచేసుకుంది. శ్రీశైలం డ్యామ్ దిగువన కృష్ణా నదిలో తండ్రి, కొడుకు స్నానం చేశారు. అయితే ఇక్కడ కూడా నీటి ఉద్ధృతి ఎక్కువ కావడంతో కొడుకు ఆ నీటిలో కొట్టుకుపోయాడు. 

Also Read: బాలింతలు, గర్భిణులే టార్గెట్.. రూ.4 కోట్ల టోకరా-పట్టుబడ్డ ఏపీ సైబర్ స్కామర్స్!

దీంతో అతడిని కాపాడేందుకు తండ్రి వెళ్లాడు. కానీ దురదృష్టవశాత్తు కొడుకుతో పాటు తండ్రి కూడా కొట్టుకుపోయాడు. ఈ ప్రమాదంలో తండ్రీ కొడుకు మృతి చెందారు. వారి మృతితో గ్రామంలో విషాధ ఛాయలు అలముకున్నాయి. అందువల్ల లోతు అంచనా వేయకుండా నదీ స్నానాలకు దిగొద్దని అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. 

Also Read: మరోసారి భారీ భూకంపం.. 6.1 తీవ్రత నమోదు- ఎక్కడంటే?

ఘోర రోడ్డు ప్రమాదం

ఇదిలా ఉంటే మరోవైపు తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తమిళనాడులోని కరూర్ జిల్లా కుళితలైలో కరూర్-తిరుచ్చి జాతీయ రహదారిపై కారు ఎదురుగా వస్తున్న ప్రభుత్వ బస్సును ఢీకొట్టింది. దీంతో కారులో మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది. వేగంగా వచ్చి బస్సును ఢీకొట్టడంతో కారు మొత్తం నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరో  నలుగురికి తీవ్రగాయాలైయ్యాయి. 

Also Read: మజాకా రివ్యూ.. సందీప్‌ కిషన్‌ ఖాతాలో హిట్‌ పడిందా?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

టీచర్‌ను చెప్పుతో కొట్టిన విద్యార్థిని సస్పెండ్

టీచర్‌ని చెప్పుతో కొట్టిన విద్యార్థినిపై రఘు ఇంజనీరింగ్ కాలేజ్ చర్యలు తీసుకుంది. యువతి వెంకటలక్ష్మీని కాలేజీ యాజమాన్యం సస్పెండ్ చేసింది. కాలేజీలో విద్యార్థిని ఫోన్ లెక్చరర్ తీసుకున్నందుకు ఆమెను బూతులు తిడుతూ దాడికి దింగింది.

New Update
raghu clg

కాలేజ్‌లో టీచర్‌ని చెప్పుతో కొట్టిన స్టూడెంట్‌పై యాజమాన్యం చర్యలు తీసుకుంది. ఆంద్రప్రదేశ్ విజయనగరంలోని రఘు ఇంజనీరింగ్ కాలేజ్‌లో ఇది జరిగింది. టీచర్‌ను దుర్భాషలాడుతూ ఆమెపై దాడికి దిగింది యువతి. ఆ విద్యార్థిని టీచర్‌ను చెప్పుతో కొడుతున్నప్పుడు అక్కడే ఉన్న కొందరు విద్యార్థులు వీడియో తీశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విద్యార్థిని ప్రవర్తన పట్ల ఇంటర్‌నెట్‌లో చాలా మంది సీరియస్ అయ్యారు. విద్యార్థిని గురుగుబెల్లి వెంకటలక్ష్మీని రఘు ఇంజనీరింగ్ కాలేజీ సస్పెండ్ చేసింది.

విద్యార్థిని.. ఆ ఫోన్ 12వేలు ఇస్తావా? ఇవ్వవా? అంటూ టీచర్‌ని బూతులు తిడుతూ గొడవకు దిగింది. చివరికి ఫోన్ ఇస్తావా? లేదంటే చెప్పుతో కొట్టమంటావా అంటూ టీచర్ పై రెచ్చిపోయింది. దీంతో టీచర్ ఇవ్వను అనేసరికి ఆమెపై చెప్పుతో దాడి చేసింది. ఆ తర్వాత టీచర్ విద్యార్థిని మధ్య గొడవ పెరగడంతో పక్కనే ఉన్న విద్యార్థులు, ఇతర టీచర్లు వారిని విడిపించే ప్రయత్నం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విద్యార్థిని తీరుపై  నెటిజన్లు మండిపడుతున్నారు.

(Raghu Engineering College | student | teacher | latest-telugu-news | viral-video)

Advertisment
Advertisment
Advertisment