/rtv/media/media_files/2025/01/29/u3xH7zR7SXZSfsboArOy.webp)
Kurnool road accident Father and son died
ఈ మధ్య రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోయాయి. నిర్లక్ష్యపు డ్రైవింగ్, డ్రంకన్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్ ఈ ప్రమాదాలకు ముఖ్య కారణం. పోలీసులు సైతం కఠిన చర్యలు తీసుకుంటున్నా ప్రమాదాలు తగ్గుముఖం పట్టడం లేదు. తాజాగా అలాంటి యాక్సిడెంట్ మరొకటి జరిగింది. భర్త, భార్య, కుమారుడు బైక్ పై వెళ్తుండగా.. అతి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు బైక్ను ఢీకొట్టింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read: ప్లీస్ నా మాట వినండి.. భక్తులకు సీఎం యోగి కీలక విజ్ఞప్తి!
కర్నూల్లో ఘోర రోడ్డు ప్రమాదం
ఏపీలోని కర్నూల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదోని బైపాస్ రోడ్డులో ఆర్టీసీ బస్సు బైక్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న తండ్రి, కుమారుడు మృతి చెందారు. తల్లి పరిస్థితి విషమంగా ఉంది. మృతులది ఎమ్మిగనూరు మండలం కొట్టేకల్ గ్రామంగా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Also Read: మహా కుంభమేళాలో తొక్కిసలాట.. అమృత స్నానాలపై అఖండ పరిషత్ కీలక నిర్ణయం
అమెరికాలో హైదరాబాద్ వాసి మృతి
బుధవారం ఉదయం అమెరికాలోని చికాగోలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఖైరతాబాద్కు చెందిన మహమ్మద్ వాజిద్ మృతి చెందాడు. కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందింది. సికింద్రాబాద్ మాజీ ఎంపీ అనిల్ కుమార్, పలువురు కాంగ్రెస్ నేతలు కుటుంబ సభ్యులను పరామర్శించారు. మహమ్మద్ వాజిద్ మృతదేహం అమెరికా నుంచి భారత్కు రప్పించేందుకు పనులు జరుగుతున్నాయి.
Also Read: కుంభమేళాలో తొక్కిసలాట.. కన్నీరు పెట్టించే దృశ్యాలు..!
కాగా మహమ్మద్ వాజిద్ ఉన్నత చదువుల కోసం నాలుగేళ్ల క్రితం యూఎస్ వెళ్లాడు. పేద కుటుంబానికి చెందిన వాజిత్ పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తూనే తన చదువు కొనసాగించాడు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ డివిజన్ యువజన నాయకుడిగా కూడా పనిచేశారు. ఎన్ఆర్ఐ కాంగ్రెస్ మైనార్టీ విభాగంలో అతడు కీలక పాత్ర పోషిస్తున్నాడు.