Ap News: ఏపీలో ఇప్పట్లో మంత్రి వర్గ విస్తరణ లేనట్లే....

ఏపీ మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో ఉండకపోవచ్చని తెలుస్తోంది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది మాత్రమే అవుతుండడంతోపాటు మంత్రులలో ఎవరిని మార్చిన ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న కారణంగా మంత్రివర్గ విస్తరణను తాత్కాళికంగా పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.

New Update
Cabinet expansion

cabinet expansion

Ap News: చాలా కాలంగా నానుతూ వస్తున్న ఏపీ మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో ఉండకపోవచ్చని తెలుస్తోంది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది మాత్రమే అవుతుండడంతో పాటు ప్రస్తుతం ఉన్న మంత్రులలో ఎవరిని మార్చిన ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న కారణంగా మంత్రివర్గ విస్తరణ అంశాన్ని తాత్కాళికంగా పక్కన పెట్టినట్లు ప్రచారం సాగుతోంది.

Also Read: ఈడీ సంచలనం...భారీ వ్యభిచార రాకెట్‌ గుట్టు రట్టు...కోట్లల్లో దందా..

జన సేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు, ప్రస్తుత ఎమ్మెల్సీ నాగబాబుకు మంత్రి వర్గంలో చేర్చుకోవాలని రాజ్యసభ ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు నాగబాబును ఎమ్మెల్సీని కూడా చేశారు. ఉగాది తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రచారం జరిగింది. కొందరు ఆశావహులు  ప్రయత్నాలు కూడా ప్రారంభించారు. ఐతే ఇప్పుడే మంత్రి వర్గ విస్తరణ వద్దని తాజాగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కూడా కాలేదు.

ఇది కూడా చూడండి: Ugadi 2025 Tv Offers: ఉగాది స్పెషల్.. బ్రాండెడ్ 4k TVలపై బ్లాక్ బస్టర్ ఆఫర్లు- వదిలారో మళ్లీ దొరకవ్!

ఏడాది లోపే మంత్రి వర్గ విస్తరణ చేసి కొందరు మంత్రులను తొలగిస్తే అసమ్మతి నెలకొంటుందని అభిప్రాయంతో భావించినట్టు సమాచారం. మంత్రి పదవులు ఇచ్చి ఏడాది కాకముందే కొందరిని తొలగిస్తే కూటమి పార్టీలకు చెడ్డ పేరు వస్తుందని ఎమ్మెల్యేలతో పాటు క్యాడర్‌కు రాంగ్ సిగ్నల్స్ వెళతాయని కూడా బాబు, పవన్‌‌లు భావిస్తున్నట్టు సమాచారం.

ఇది కూడా చూడండి: Ugadi 2025: ఉగాది రోజు ఈ రంగు బట్టలు ధరిస్తే ఏడాది అంతా మీకు తిరుగు ఉండదు

కొంత కాలం గడిచిన తర్వాత నాగబాబు మంత్రి పదవి గురించి ఆలోచిద్దామని, అప్పటి వరకు పార్టీ బాధ్యతలలో కొనసాగించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారని తెలిస్తోంది. ఇప్పటికే జనసేన పార్టీ కార్యకలపాలు చూస్తున్న నాగబాబు మరికొంతకాలం అవే బాధ్యతల్లో కొనసాగించాలని పవన్‌ నిర్ణయించుకున్నారట. దీంతో కొంతకాలం దాకా మంత్రి వర్గ విస్తరణ ఉండకపోవచ్చని ప్రచారం సాగుతోంది.

ఇది కూడా చూడండి: Priyanka Gandhi: వారికి దగ్గరయ్యేందుకు మలయాళం నేర్చుకుంటున్నాను అంటున్న ప్రియాంక!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి

Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. బైకుపైకి దూసుకెళ్లిన బొలెరో!

ఏపీ కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తునిలో బొలెరో వాహనం ఎదురుగా బైకుపై వస్తున్న యువకుడిపైకి దూసుకెళ్లింది. దీంతో రెండు వాహనాల మధ్య ఇరుక్కుని యువకుడు దుర్మరణం చెందాడు. మృతుడు అనకాపల్లి నామవరం శివగా గుర్తించారు.

New Update
ACCIDENT

AP Kakinada road accident one man died

Accident: ఏపీ కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తునిలో బొలెరో వాహనం ఎదురుగా బైకుపై వస్తున్న యువకుడిపైకి దూసుకెళ్లింది. దీంతో రెండు వాహనాల మధ్య ఇరుక్కుని యువకుడు దుర్మరణం చెందాడు. మృతుడు అనకాపల్లి నామవరం శివగా గుర్తించారు. ఈ మేరకు స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బొలెరో డ్రైవర్ మద్యం సేవించినట్లు అనుమానిస్తు్న్నారు. శివ అకాల మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకోగా మృతిడి పేరెంట్స్, బంధువులు శోకచంద్రంలో మునిగితేలారు. 

ప్రేమోన్మాది కత్తితో దాడి..

ఇదిలా ఉంటే.. విశాఖలో ఓ యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి చేశాడు. తనను ప్రేమించి పెళ్లి చేసుకోవాలని, లేకపోతే చంపేస్తానంటూ కొద్ది రోజులుగా బెదిరిస్తున్నాడు. ఈ సంఘటన  విశాఖపట్నం జిల్లాలో బుధవారం కలకలం రేపింది. స్థానిక వివరాల ప్రకారం.. కొమ్మాది స్వయం కృషినగర్‌లో తల్లి, కుమార్తె  ఇద్దరు నివాసం ఉంటున్నారు. యువతిని ప్రేమించి పెళ్లి చేసుకోలేదని ఆమెపై కోపం పెంచుకున్నాడు. ఎలాగైనా హత్య చేయాలని పక్క ప్లాన్‌తో వారి ఇంటికి కత్తితో వచ్చి దాడి చేశాడు. ఈ దాడి తల్లి అక్కడికక్కడే మృతి చెందగా, కుమార్తెకు తీవ్రంగా గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలింపు.  

ఇది కూడా చదవండి: Duvvada Srinivas-Madhuri: త్వరలోనే దువ్వాడ శ్రీనివాస్-మాధురి పెళ్లి.. వేణు స్వామి చేతుల మీదుగా.. ఫొటోలు వైరల్!

ప్రమాదంపై సమాచారం అందుకున్న పీఎం పాలెం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం ప్రమాదం జరిగిన ప్రాతాన్ని పరిశీలించారు. ఎలా జరిగిందని చుట్టు పక్కల వారిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. తల్లి, కూతురిపై ప్రేమోన్మాది కత్తితో దాడి చేయటంతో కాలనీ వాసులు భయబ్రాంతులకు లోనవుతున్నారు. పోలీసులు నింతుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇది కూడా చదవండి: Pastor Praveen: పాస్టర్ ప్రవీణ్ కేసులో పోలీసుల బిగ్ ట్విస్ట్.. ఒకరు అరెస్ట్!

 kakinada | died | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు