సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్.సంజయ్పై ఏసీబీ కేసు నమోదు చేసింది. అగ్నిమాపక శాఖ డీజీ, సీఐడీ విభాగాధిపతిగా పనిచేసిన సంజయ్ గత ప్రభుత్వ సమయంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా కేసు నమోదు చేసింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ ప్రకారం ఏసీబీ అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాయగా.. అనుమతి లభించడంతో కేసు నమోదు చేశారు. ఇందులో ఏ1గా సంజయ్, ఏ2గా సౌత్రికా టెక్నాలజీస్ అండ్ ఇన్ఫ్రా, ఏ3గా క్రిత్వ్యాప్ టెక్నాలజీస్పై కేసు నమోదైంది. ఇది కూడా చూడండి: అశ్విన్ స్థానంలో మరో యంగ్ స్పిన్నర్కు చోటు.. అతడెవరంటే! కేసు ఏంటంటే? ఆన్లైన్లో ఎన్వీసీలు జారీ చేయడానికి అగ్ని-ఎన్వోసీ వెబ్సైట్, మొబైల్ యాప్ అభివృద్ధి, నిర్వహణ, 150 ట్యాబ్ల సరఫరా కాంట్రాక్ట్ను సంజయ్కు అప్పగించారు. ఎలాంటి పనులు జరగకపోయిన కూడా రూ.59.93 లక్షల బిల్లులు చెల్లించారు. అలాగే గిరిజనులకు అవగాహన సదస్సులు నిర్వహించడానికి దాదాపుగా రూ.1.19 కోట్లు చెల్లించినట్లు సమాచారం. అయితే ఈ సదస్సులు అన్ని కూడా సీఐడీ అధికారులే నియమించారు. కానీ సౌత్రికా టెక్నాలజీస్ అండ్ ఇన్ఫ్రా, క్రిత్వ్యాప్ సంస్థకు డబ్బులు చెల్లించారు. ఇలా దాదాపుగా రూ.2 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని ఏసీబీ అధికారులు గుర్తించారు. అందుకే అతనిపై కేసు నమోదు చేశారు. ఇది కూడా చూడండి: Allu arjun: అల్లు అర్జున్ విచారణ పూర్తి.. కీలక ప్రశ్నలకు సమాధానాలివే! ఇలా నిధుల దుర్వినియోగానికి పాల్పడినందుకు అతనిపై కేసు నమోదు చేశారు. అయితే క్రిత్వ్యాప్ సంస్థ ఫేక్ అని కూడా విచారణలో తేలింది. సౌత్రికా, క్రిత్వ్యాప్ సంస్థ చిరునామాలు రెండు ఒకే దగ్గర ఉన్నాయి. అసలు కంపెనీ లేదు కానీ డబ్బులు మాత్రం ట్రాన్సక్షన్ అవుతున్నట్లు అధికారులు గుర్తించారు. మరి దీన్ని ఎవరు స్థాపించారు? దీని వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు? పూర్తి వివరాలు ఏసీబీ సేకరించనుంది. దీనిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇది కూడా చూడండి: Jani Master: అల్లు అర్జున్ అరెస్ట్ పై ప్రశ్న.. జానీ మాస్టర్ రియాక్షన్ వైరల్ ఇది కూడా చూడండి: AP: ఏపీలో దారుణం.. సిబ్బంది నిర్లక్ష్యానికి గర్భిణి మృతి..!