AP News : పోలవరం పర్యటనలో ఇంట్రెస్టింగ్ సీన్..  చంద్రబాబు కాళ్లపై పడిన వైసీపీ మాజీ నేత

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గత ప్రభుత్వంలో వివిధ హోదాల్లో పనిచేసినవారు అధికార కూటమిలోకి చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఎమ్మెల్సీ జయమంగళ వెంకట రమణ చంద్రబాబు నాయుడుని కలిసి కాళ్లపై పడ్డారు.

New Update
N Chandrababu Naidu on Polavaram today

N Chandrababu Naidu on Polavaram today

AP News :ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గత ప్రభుత్వంలో వివిధ హోదాల్లో పనిచేసినవారు అధికార కూటమిలోకి చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులతో ముఖాముఖి నిర్వహించారు. అయితే చంద్రబాబు పోలవరం పర్యటనలో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. వైసీపీ మాజీ నేత ఒకరు చంద్రబాబు కాళ్లపై పడ్డారు. ఈ ఘటన ఆసక్తిగా మారింది. వివరాల్లోకి వెళ్తే ఎమ్మెల్సీ జయమంగళ వెంకట రమణ ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే పోలవరం పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని జయమంగళ వెంకటరమణ కలిశారు. చంద్రబాబు నాయుడు కాళ్ళపై పడ్డారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆయనను ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు.

ఇది కూడా చదవండి: ఈ విత్తనాలు తీసుకుంటే బరువు తగ్గుతారు.. జుట్టుకు కూడా ప్రయోజనం


ఈ నేపథ్యంలో జయమంగళ వెంకటరమణ త్వరలోనే తెలుగుదేశం పార్టీలో తిరిగి చేరతారంటూ ప్రచారం జరుగుతోంది. జయమంగళ వెంకట రమణ గతేడాది వైసీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. అయితే శాసనమండలి ఛైర్మన్ వద్ద జయమంగళ వెంకటరమణ రాజీనామా పెండింగ్‌లో ఉంది. జయమంగళ వెంకటరమణ రాజకీయ ప్రస్థానం తెలుగుదేశం పార్టీతోనే ప్రారంభమైంది. 1999లో తెలుగుదేశం పార్టీ ద్వారా ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తరువాత 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు.

ఇది కూడా చదవండి: రీహబిలిటేషన్‌ సెంటర్‌లో ఫుడ్ పాయిజన్.. నలుగురు చిన్నారులు మృతి

2019 నుంచి జయమంగళ వెంకట రమణ టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా పనిచేస్తూ వచ్చారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల ముందు 2023 ఫిబ్రవరి 17న జయమంగళ వెంకట రమణ వైసీపీలో చేరారు. 2023 మార్చిలో శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో ఎంఎల్‌ఎ కోటా నుంచి వైసీపీ తరుఫున ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అయితే.. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమిపాలైంది.

Also Read: ఇది అస్సలు ఊహించలేదు.. 'మంగళవారం' సీక్వెల్ లో హీరోయిన్ గా ఎవరంటే!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Tirumala : ఏప్రిల్ 6న శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం.. 7న శ్రీరామపట్టాభిషేకం

తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 6వ తేదీన శ్రీ రామనవమి పర్వదినం సందర్భంగా తిరుపతి శ్రీకోదండరామస్వామి వారి ఆలయంలో స్వామివారి కళ్యాణం నిర్వహించనున్నారు. రంగ‌నాయ‌కుల మండ‌పంలో శ్రీ సీతా లక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు.

New Update
Tirumala Tirupati Devasthanams

Tirumala Tirupati Devasthanam

Tirumala : తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 6వ తేదీన శ్రీ రామనవమి పర్వదినం సందర్భంగా తిరుపతి శ్రీకోదండరామస్వామి వారి ఆలయంలో  ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు టీటీడీ అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఆదివారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు రంగ‌నాయ‌కుల మండ‌పంలో శ్రీ సీతా లక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తమన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు శ్రీ రామనవమి ఆస్థానం వైభవంగా జరుగనుంది. రాత్రి 7 గంటలకు హనుమంత వాహనంపై శ్రీరాములవారు ఆలయ మాడ వీధుల్లో విహరిస్తారు.

ఇది కూడా చూడండి: డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌..  రూ. 30లక్షలకు ముచ్చెమటలు పట్టించాడు!

శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 6న శ్రీ రామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని పలు ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు రంగ‌నాయ‌కుల మండ‌పంలో శ్రీ సీతా లక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. దీనిలో భాగంగా ఉత్సవమూర్తులకు అర్చకులు రంగనాయక మండపంలో, వేదమంత్రోచ్ఛరణల నడుమ అభిషేకం చేస్తారు. సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8 గం. వరకు హ‌నుమంత వాహ‌నసేవ జరగనుంది. 9గం. నుంచి 10 గంటల నడుమ బంగారువాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహించనున్నారు. ఏప్రిల్ 7న శ్రీ రామ పట్టాభిషేకాన్ని, పురస్కరించుకుని, రాత్రి 8 నుంచి 9 గంటల న‌డుమ బంగారువాకిలి చెంత ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక ఆస్థానాన్ని నిర్వహించనున్నారు.

Also Read: భర్తముందే భార్యపై గ్యాంగ్ రేప్.. ఊరికి వెళ్లి వస్తుండగా నడిరోడ్డుపై ఆపి!


ఏప్రిల్ 7న శ్రీ సీతారాముల కల్యాణం :


ఏప్రిల్ 7వ తేదీన ఉదయం సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవర్లకు అభిషేకం చేస్తారు. ఉదయం 9 నుండి 10 గంటల వరకు టిటిడి పరిపాలనా భవనం నుండి ఏనుగు మీద ముత్యాల తలంబ్రాలను ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకెళతారు. రాత్రి 7 నుండి 9.30 గంటల వరకు శ్రీ సీతారామ కల్యాణం వేడుకగా జరుగనుంది. రూ.1000/- చెల్లించి గృహస్తులు కల్యాణంలో పాల్గొనవచ్చు. వీరికి ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ ప్రసాదం బహుమానంగా అందజేస్తారు.

ఏప్రిల్ 8న శ్రీరామ పట్టాభిషేకం :


ఏప్రిల్ 8న ఉదయం 8 గంటలకు తిరుపతిలోని శ్రీ నరసింహతీర్థం నుండి ఆలయ మర్యాదలతో తీర్థం తీసుకొచ్చి స్వామివారికి చతుర్దశ కలశ స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు శ్రీరామ పట్టాభిషేకం చేపడతారు. ఆ తరువాత బంగారు తిరుచ్చిపై శ్రీ సీతారామలక్ష్మణులను, ప్రత్యేక తిరుచ్చిపై శ్రీ ఆంజనేయస్వామివారిని మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు.

Also Read: కొడాలి నానిని కాపాడేందుకు రంగంలోకి డాక్టర్ పాండా.. ఆయన ట్రాక్ రికార్డ్ తెలిస్తే షాక్ అవుతారు!

ఏప్రిల్ 9వ తేదీన సాయంత్రం 4 గంట‌ల‌కు వ‌సంతోత్సవం, ఆస్థానం నిర్వహించ‌నున్నారు. అనంత‌రం సాయంత్రం 5 నుండి 6 గంట‌ల వ‌ర‌కు తిరువీధి ఉత్సవం జరుగనుంది.

ఏప్రిల్ 10 నుండి 12 వరకు తెప్పోత్సవాలు :


శ్రీ కోదండరాముని తెప్పోత్సవాలు ఏప్రిల్ 10 నుండి 12వ తేదీ వరకు ప్రతిరోజు రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు శ్రీరామచంద్ర పుష్కరిణిలో వైభవంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా ప్రతిరోజూ ఉదయం 8 నుండి 9.30 గంటల వరకు స్నపనతిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. మొదటిరోజు ఐదుచుట్లు, రెండో రోజు ఏడు చుట్లు, చివరిరోజు తొమ్మిది చుట్లు తెప్పలపై స్వామివారు విహరిస్తారు.

Also Read: Adolescence: ప్రధాని మెచ్చిన 'Adolescence' వెబ్ సీరిస్.. అన్ని స్కూళ్లలో ప్రదర్శించాలని ఆదేశం.. దాని ప్రత్యేకత ఇదే!

Advertisment
Advertisment
Advertisment