Ap Weather: ఏపీ ప్రజలకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో నాలుగు రోజులు వానలే..వానలు!

ఏపీలో ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు వాతావారణ శాఖ ఓ చల్లటి వార్త చెప్పింది. ఏపీలో నాలుగు రోజుల పాటూ పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.

New Update
ap rains

ap rains

ఏపీలోని పలు జిల్లాల్లోవాతావరణశాఖ వర్షాలు కురుస్తాయంటోంది . రాబోయే రాష్ట్రంలో నాలుగు రోజుల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలకు అవకాశం ఉందని అంచనా వేస్తన్నారు. పలు జిల్లాల్లో ఈదురుగాలులు వీచే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఈ నెలాఖరు వరకు ఇదే పరిస్థితి ఉంటుందని.. ఈ వర్షాలతో కొద్దిరోజులుగా వడగాలులు, తీవ్ర ఉక్కపోతతో ఇబ్బందిపడుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం కలిగినట్లు అయ్యింది.

Also Read: Telangana Rains:తెలంగాణలో భారీ వర్షాలు.. మరో రెండు రోజులూ ఇదే పరిస్థితి..!

శనివారం  శ్రీకాకుళం ,విజయనగరం, పార్వతీపురం మన్యం మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. వడగాల్పులు 18 మండలాల్లో వీచే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. శుక్రవారం నంద్యాల జిల్లా చాగలమర్రి లో 40.9 డిగ్రీలు, కర్నూలు జిల్లా కోసిగిలో 40.6 డిగ్రీలు, అనకాపల్లి జిల్లా నాతవరంలో 40.2 డిగ్రీలు, కడప జిల్లా ఒంటిమిట్ట, అన్నమయ్య జిల్లా గాదెలలో 40.1 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు, అలాగే 28 మండలాల్లో వడగాల్పులు వీచాయి' అని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.

Also Read: Breaking News: రోడ్డు ప్రమాదంలో అడిషనల్‌ డీసీపీ స్పాట్‌ డెడ్‌!

మరోవైపు ఒడిశా మధ్య ప్రాంతాల నుంచి దక్షిణ విదర్భ వరకు దక్షిణ ఛత్తీస్‌గఢ్ మీదుగా ఏర్పడిన ద్రోణి బలహీన పడిందని అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలో నైరుతి దిశగా గాలులు వీస్తుండటంతో రాష్ట్రంలో రాగల నాలుగు రోజుల్లో వాతావరణం మారుతుందని అంచనా వేస్తున్నారు. ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, పిడుగులు ఉరుములతో కూడిన వానలు పడే అవకాశాలున్నాయి. 

అలాగే రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు, ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల వానలు పడే అవకాశం ఉన్నట్లు సమాచారం.ఇటు తెలంగాణలో సైతం వర్షాలు పడుతున్నాయి. శుక్రవారం రాత్రి హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వానలు విపరీతంగా పడుతున్నాయి. తెలంగాణలో మార్చి 21 నుంచి 23వ తేదీ వరకు మూడు రోజుల పాటువర్షాలు కురుస్తాయంటున్నారు. తెలంగాణలో వానలతో ప్రజలకు వడగాలుల నుంచి ఉపశమనం పొందనున్నారు.

Also Read: London Airport: లండన్‌ ఎయిర్‌ పోర్టులో మంటలు 1350 విమానాలకు అంతరాయం!

Also Read: Samsung Tv Offers: హాట్ హాట్ శాంసంగ్ సేల్.. టీవీలపై భారీ డిస్కౌంట్- సగం ధరకే సౌండ్ బార్‌!

Tags : ap-weather | AP Weather Alert | ap weather news | ap weather today | ap weather updates | ap weather update today | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Court Movie : తిరుపతిలో కోర్టు మూవీ లాగే....ఏం జరిగిందంటే...

ఏపీలోని తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నరసింగాపురంలో కోర్టు సినిమా తరహ ఘటన సంచలనం రేకెత్తిస్తోంది. అజయ్ అనే యువకుడు 17 ఏళ్ల మైనర్ నిఖిత గడచిన మూడేళ్లుగా వీరిద్ధరూ ప్రేమించుకుంటున్నారు. శుక్రవారం నిఖిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం సంచలనంగా మారింది.

New Update
Court Movie

Court Movie

Court Movie: ఏపీలోని తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నరసింగాపురంలో అచ్చం కోర్టు సినిమా తరహ ఘటన సంచలనం రేకెత్తిస్తోంది. ఈ ఘటన తెలిసిన వారంతా ‘కోర్టు’ సినిమాను పోలి ఉందంటూ చర్చించుకుంటున్నారు. అసలు విషయానికొస్తే మిట్టపాళెం ఎస్సీ కాలనీకి చెందిన అజయ్ అనే యువకుడిని 17 ఏళ్ల మైనర్ బాలిక నిఖిత ప్రేమించింది. గడచిన మూడేళ్లుగా వీరిద్ధరూ ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ వ్యవహారం నిఖిత కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోవడంతో గత ఏడాది ఇద్దరూ ఇంటి నుంచి పారిపోయారు. అయితే కులాలు వేరు కావడంతో పాటు నిఖిత మైనర్ కావడంతో అజయ్‌తో నిఖిత ప్రేమ కుటుంబ పరువును దెబ్బతీస్తుందని భావించిన ఆమె తల్లిదండ్రులు ఈ ప్రేమను తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ తర్వాత తల్లిదండ్రలు ఆమెను ఇంటికి తీసుకొచ్చారు.నిఖిత మైనర్ కావడంతో, గత ఏడాది ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అజయ్‌పై పోలీసులు ఫోక్సో (POCSO) కేసు నమోదు చేసి, అతడిని జైలుకు పంపారు. 

Also Read: ట్రంప్ టారిఫ్‌లు వేస్తే మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారు.. రాహుల్‌గాంధీ ఫైర్

ఈ క్రమంలోనే నిఖిత గర్భం దాల్చింది. దీంతో ఆమె తల్లి సుజాత కడుపులోని బిడ్డను చంపి, నిఖితను ఆసుపత్రిలో చేర్చినట్లు సమాచారం. ఆ తర్వాత నాలుగు నెలల పాటు జైల్లో ఉన్న అజయ్‌ను నిఖిత పలుమార్లు కలుస్తూ వచ్చింది. ఈ విషయం ఇంట్లో తెలియడంతో, నిఖిత తల్లిదండ్రులు సుజాత, కిషోర్ ఆమెను వేధింపులకు గురి చేస్తూ వచ్చారని అజయ్ చెప్తున్నాడు. శుక్రవారం నిఖిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో, కేవలం గంటల వ్యవధిలోనే ఆమె మృతదేహాన్ని తల్లిదండ్రులు దహనం చేశారు. “ఇద్దరం కలిసి బతకాలని ఎన్నో కలలు కన్నాం. కానీ, ఇప్పుడు ఏదీ లేకుండా చేశారు,” అని అతడు కన్నీటితో వాపోయాడు. ప్రేమించిన 17 ఏళ్ల మైనర్ బాలిక నిఖిత మరణం పలు అనుమానాలకు తావిచ్చింది.  ఈ విషయం గ్రామస్తుల దృష్టికి రావడంతో, వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో నిఖిత తల్లిదండ్రులు సుజాత మరియు కిషోర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.

Also Read: రేవ్ పార్టీలో అడ్డంగా బుక్కైన ఆర్మీ, రాజకీయ నేతల కూతుర్లు.. వీడియో వైరల్ 

అజయ్, నిఖిత మరణంపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశాడు. “ఇంట్లో చంపాలని చూస్తున్నారని నాకు మెసేజ్‌లు పంపింది. ఆమె మృతిపై నాకు చాలా అనుమానాలు ఉన్నాయి,” అని అతడు చెప్పాడు. నిఖిత తల్లిదండ్రులు ఆమెను చాలాసార్లు కొట్టారని, పరువు కోసం ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని అతడు ఆరోపించాడు. నిఖిత మృతదేహాన్ని వేగంగా దహనం చేయడం, ఆమె మరణానికి ముందు అజయ్‌కు పంపిన సందేశాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని పోలీసులు ఈ కేసును లోతుగా విచారిస్తున్నారు. గ్రామస్తుల సమాచారం, అజయ్ ఇచ్చిన వివరాల ఆధారంగా ఈ ఘటనలో పరువు హత్య అనుమానం బలంగా కనిపిస్తోంది. అయితే, ఖచ్చితమైన నిర్ధారణకు పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ ఘటన తిరుపతి జిల్లాలోనే కాక, రాష్ట్రవ్యాప్తంగా పరువు హత్యలపై మరోసారి చర్చకు దారితీసింది. ప్రేమ వివాహాలు, కులాంతర సంబంధాలను సమాజం ఇంకా ఎంతవరకు జీర్ణించుకోలేకపోతోందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిఖిత మరణం వెనుక దాగిన నిజం ఏమిటనేది పోలీసు దర్యాప్తు తేల్చనుంది..

Also read: వాళ్లను తరిమికొట్టినట్లే.. బీజేపీ వాళ్లను ఓడించాలి : సీఎం రేవంత్ రెడ్డి

Advertisment
Advertisment
Advertisment