shivaratri: కోటప్పకొండపై కుప్పకూలిన డ్రోన్.. ట్రాన్స్‌ఫార్మర్‌పై చెలరేగిన మంటలు

పోలీసులు కోటప్పకొండ శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం నిఘా పెట్టిన డ్రోన్‌ కూప్పకూలిపోయింది. బుధవారం ఉదయాన్నే సాంకేతిక సమస్యతో డ్రోన్ క్యాంటీన్ పైనున్న విద్యుత్ తీగలపై పడింది. డ్రోన్ పడటంతో వైర్లుతెగి సమీపంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి మంటలు చెలరేగాయి.

New Update
kotappakonda

kotappakonda Photograph: (kotappakonda)

పల్నాడు జిల్లాలోని కోటప్ప కొండకు మహా శివరాత్రిని పురస్కరించుకొని భక్తులు తరలివచ్చారు. భక్తులు తెల్లవారుజూ నుంచే అమరేశ్వరుని దర్శనానికి బారులుతీరారు. కృష్ణానదిలో పుణ్యస్నానాలు, అనంతరం ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించి పూజలు చేస్తున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్లు, బస్సులకోసం ప్రత్యేక పార్కింగ్ స్థలం కేటాయించారు. ఆలయ ఆవరణలో క్యూలెన్లు, చలువపందిళ్లు ఏర్పాటు చేశారు అధికారులు.

Also Read: CM Revanth: నేడు ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

పోలీసులు కోటప్పకొండపై శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం నిఘా పెట్టిన డ్రోన్‌ కూప్పకూలిపోయింది. బుధవారం ఉదయాన్నే సాంకేతిక సమస్యతో డ్రోన్ క్యాంటీన్ పైన ఉన్న విద్యుత్ తీగలపై పడింది. డ్రోన్ పడటంతో వైర్లుతెగి సమీపంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రోన్ పడటంతో క్యాంటీన్ మూసివేశారు. ప్రమాద సమయంలో ఘటనాస్థలంలోనే పల్నాడు జిల్లా ఎస్పి శ్రీనివాసరావు, అడిషనల్ ఎస్పీ లు ఉన్నారు. సిబ్బందిని క్యాంటిన్ పైకి ఎక్కించి డ్రోన్‌ సురక్షితంగా కిందకి తీసుకొచ్చారు. 

Also Read: కుంభమేళాలో శివరాత్రి ఆంక్షలు.. శివనామస్మరణాలతో దద్దరిళ్లిన ప్రయాగ్‌రాజ్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP CM Chandrababu: సచివాలయంలో అగ్నిప్రమాదం.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!

ఏపీ సచివాలయంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగిన ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సచివాలయంలో అన్ని చోట్లా భద్రతా ప్రమాణాలన్నీ పాటిస్తున్నారా లేదా అన్న విషయంపై ఆడిట్ చేయాలని అధికారులను ఆదేశించారు.

New Update

వెలగపూడి సచివాలయంలోని రెండవ బ్లాక్‌లో ఈ రోజు ఉదయం అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. అగ్నిప్రమాదం ఎలా జరిగిందని, ఏ సమయంలో చోటు చేసుకుందని సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రతిచోటా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తద్వారా ప్రమాదానికి గల కారణాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశానికి ఫోరెన్సిక్ బృందం ఎన్ని గంటలకు వచ్చిందని అధికారులను అడిగారు.

ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు అవసరమైన ఆధారాలను సేకరించించారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. సచివాలయంలో అన్ని చోట్లా భద్రతా ప్రమాణాలన్నీ పాటిస్తున్నారా లేదా అన్న విషయంపై ఆడిట్ చేయాలని ఆదేశించారు. అనంతరం మొదటి బ్లాక్‌లోని బ్యాటరీ రూమ్‌ను కూడా సీఎం పరిశీలించారు. ఇటువంటి బ్యాటరీ గ్యాలరీనే రెండవ బ్లాక్‌లో అగ్నిప్రమాదానికి గురైందని సీఎంకు సీఎస్ వివరించారు.

అపరిశుభ్రతపై అసంతృప్తి..

అనంతరం సీఎంఆర్ఎఫ్ విభాగాన్ని పరిశీలించారు. అక్కడి అపరిశుభ్రతపై సీఎం అసంతృప్తిని వ్యక్తం చేశారు. 24 గంటల్లో చెత్తనంతా క్లీన్ చేయాలని అధికారులను ఆదేశించారు. పని ప్రదేశాల్లో ఎక్కడా తాత్కాలికంగా కూడా చెత్త కనబడటానికి వీళ్లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు వెంట సీఎస్ విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, హోంమంత్రి అనిత, జీఏడీ పొలిటికల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా తదితరులు ఉన్నారు. 

ఏపీ సచివాలయంలోని రెండో బ్లాక్‌లో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.  రెండో బ్లాక్‌లో బ్యాటరీలు ఉండే ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ఈ విషయం తెలిసిన వెంటనే ఎస్పీఎఫ్ సిబ్బంది ఫైర్ సేఫ్టీ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో సచివాలయంలోని రెండో బ్లాక్ వద్దకు చేరుకున్న ఫైర్ సేఫ్టీ సిబ్బంది  మంటలను అదుపులోకి తీసుకువచ్చింది. ఈ అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందా? లేక మరేదైనా కుట్రకోణం ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

(telugu-news | latest-telugu-news | telugu breaking news ap cm chandrababu naidu)

Advertisment
Advertisment
Advertisment