Ap Crime News: ప్రేమ వివాహం చేసుకుందని.. కూతురు, అల్లుడిని కత్తితో పొడిచి పొడిచి - తండ్రి దారుణం!

ఏపీలోని చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణం జరిగింది. కూతురు ప్రేమ వివాహం చేసుకుందని తండ్రి కోపం పెంచుకున్నాడు. పెద్ద మనుషుల సమక్షంలో రాజీ పంచాయితీ పెట్టాడు. అక్కడికి వచ్చిన కూతురు, అల్లుడు సహా మరో ఇద్దరిపై దాడి చేశాడు. ఈ దాడిలో వారు తీవ్రంగా గాయపడ్డారు.

New Update
Girl father attacks daughter and son in law after love marriage

Girl father attacks daughter and son in law after love marriage

చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణం జరిగింది. కూతురు ప్రేమ వివాహం చేసుకుందని తండ్రి కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే కూతురు, అల్లుడిపై దాడి చేశాడు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

Also Read :  అమెరికా ఇంక తగ్గేదే లే..యూఎస్ కాంగ్రెస్ లో ట్రంప్ మొదటి ప్రసంగం

ఈ మధ్య ప్రేమ, పెళ్లి వ్యవహారంలో హత్యలు పెరిగిపోతున్నాయి. ప్రేమించుకుని కులాంతర వివాహం చేసుకున్నవారిని కుటుంబ సభ్యులు హతమారుస్తున్నారు. పరువు పోయిందని మనస్థాపంతో కోపం పెంచుకుని ఇలాంటి ఘోరాలకు పాల్పడుతున్నారు. తాజాగా అలాంటి సంఘటనే మరొకటి చోటుచేసుకుంది. 

Also Read : ఇంద్రా బస్సు బోల్తా.. స్పాట్‌లో 12 మంది..

కుప్పంలో దారుణం

చిత్తూరు జిల్లా కుప్పంలో తాజాగా దారుణం జరిగింది. కూతురు కౌసల్య ప్రేమ వివాహం చేసుకుందని.. తండ్రి శివప్ప కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే కుప్పంలో పెద్దల సమక్షంలో రాజీ పంచాయితీ పెట్టాడు. ఆ పంచాయితీలో పెద్దమనుషులకు తండ్రి శివప్పకు మధ్య వాగ్వాదం జరిగింది.

Also Read :  మూర్ఛ వ్యాధి ఎందుకు వస్తుంది.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

 ఆ కోపంలో తండ్రి శివప్ప తన కూతురు కౌసల్య, అల్లుడు చంద్రశేఖర్ సహా రమేష్, సీతారామప్ప అనే మరో ఇద్దరిపై విచక్షణరహితంగా కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో రమేష్ అనే వ్యక్తి కడుపులో కత్తి ఇరుక్కుపోయింది. దీంతో వెంటనే అతడిని హాస్పిటల్‌కు తరలించారు.

Also Read : చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో వెల్లుల్లి ఎలా పనిచేస్తుంది?

 ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. మిగిలిన ముగ్గురు కూడా హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. కాగా గాయపడిన బాధితులు చంద్రశేఖర్, రమేష్, సీతారామప్పగా గుర్తించారు. వీరిది గుడుపల్లి మండలం, అగరం గ్రామం అని తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP - TG Earthquake: ఏపీ & తెలంగాణ ప్రజలకు హెచ్చరిక.. భారీ భూకంపం!

తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్. రాష్ట్రంలోని రామగుండంలో భూకంపం వచ్చే అవకాశం ఉందని ఎర్త్‌క్వేక్ రీసర్చ్ అండ్ అనాలసిస్ సంస్థ తెలిపింది. భూ ప్రకంపనలు హైదరాబాద్, వరంగల్, అమరావతి వరకు చేరే అవకాశం ఉందని అందులో పేర్కొంది. ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.

New Update
earthquake warning for Andhra Pradesh and Telangana soon

earthquake warning for Andhra Pradesh and Telangana soon

ఈ మధ్య వరుస భూకంపాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఊహించని భూప్రకంపనలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఏ క్షణం ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటున్నారు. ఇప్పటికే దేశ, ప్రపంచ వ్యాప్తంగా భూమి కంపించింది. అందులో గతంలో ఏపీ, తెలంగాణ వంటి రెండు తెలుగు రాష్ట్రాలను భూకంపం భయబ్రాంతులకు గురి చేసింది. 

ఇది కూడా చదవండి: సన్నటి కనుబొమ్మలతో ఇబ్బంది పడుతున్నారా..ఇలా చేస్తే మందంగా పెరుగుతాయి

తాజాగా మరోసారి భూకంప హెచ్చరికలు వచ్చాయి. తెలంగాణలో భారీ భూకంపం వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. వచ్చే వారం రోజుల్లో రామగుండం కేంద్రంగా భారీ భూకంపం ప్రజలను భయపెట్టే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈసారి భూకంప తీవ్రత భారీ స్థాయిలో ఉంటుందని చెబుతున్నారు. 

ఇది కూడా చదవండి: అతిగా ఆలోచించడం వల్ల కలిగే సమస్యలు

ఏపీ & తెలంగాణలో భూకంపం

ఈ మేరకు Epic -Earthquake Research & Analysis ఒక ట్వీట్‌ చేసింది. అందులో హైదరాబాద్, వరంగల్‌.. అలాగే అమరావతి వరకు ప్రకంపనలు వచ్చే ఛాన్స్ ఉందని తెలిపింది. తమ పరిశోధనల ఆధారంగా రాష్ట్రంలోని రామగుండం సమీపంలో భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందని అందులో రాసుకొచ్చింది. 

Also Read: డ్రాగన్ వచ్చేది అప్పుడే..! రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న NTR 31..

అయితే ఈ భూకంపాల విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని లేదని కేంద్ర ఐఎండీకి సంబంధించిన అధికారులు చెబుతున్నారు. కాగా అప్రమత్తంగా ఉండటం మంచిదే. కానీ నిర్ధారణలేని సమాచారంపై ఎవరూ భయపడాల్సిన పనిలేదని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. 

Also Read: “SSMB29” రిలీజ్ డేట్ పై హాట్ బజ్! ఆ సెంటిమెంట్‌ కలిసొస్తుందా?

(ap earthquake | ap earthquake latest news latest-telugu-news)

Advertisment
Advertisment
Advertisment