బర్డ్ ఫ్లూ సోకిన కోళ్లు చేపలకు మేత వేస్తే.. ఏం జరిగిందో తెలుసా..?

AP ఉభయ గోదావరి జిల్లాలో బర్డ్‌ఫ్లూ కలవరపెడుతోంది. పలుప్రాంతాల్లో చేపల చెరువులో బర్డ్‌ఫ్లూ సోకిన కోళ్లుని వేస్తున్నారు. జగ్గంపేట, కిర్లంపూడి, ప్రత్తిపాడు, పెద్దాపురంలో చేపలకు మేతగా బర్డ్‌ఫ్లూ వచ్చిన కోళ్ల వేస్తున్నట్టు స్థానిక ఎన్జీవో సభ్యులు గుర్తించారు.

New Update
bird flu chiken to fish

bird flu chiken to fish Photograph: (bird flu chiken to fish)

ఆంధ్ర ప్రదేశ్ ఉభయ గోదావరి జిల్లాల్లో పౌల్ట్రీ పరిశ్రమలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతుంది. బర్డ్ ఫ్లూ సోకి లక్షల సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాల్లో పలుప్రాంతాల్లో చేపల చెరువులకు మేతగా బర్డ్‌ఫ్లూ సోకిన కోళ్లును వేస్తున్నారు. కోళ్లు ఫాం యజమానులు చనిపోయిన కోళ్లను చెరువుల్లో చేపలకు మేతగా పడేస్తున్నారు. జగ్గంపేట, కిర్లంపూడి, ప్రత్తిపాడు, పెద్దాపురంలో చేపలకు మేతగా బర్డ్ ఫ్లూ వచ్చిన కోళ్లను వేస్తున్నట్టు స్థానిక ఎన్జీవో సభ్యులు గుర్తించారు.

Also Read: AR Rahman: నోరు తెరిస్తే ఏమౌతుందో తెలిసిందా.. యూట్యూబర్ అల్లాబాడియాకు రెహ్మాన్ చురకలు!

కాకినాడ ఎన్జీవో సభ్యులు వీడియోలు విడుదల చేసి జిల్లా కలక్టర్‌కు చూపించి ఫిర్యాదు చేశారు.  
పర్యవేక్షణ చేయవలసిన ఫిషరీస్ అధికారుల సపోర్టు తోనే చెరువుల యజమానులు ఇలా చేస్తున్నారని వారు ఆరోపించారు. చేపల చెరువులపై పర్యవేక్షణ తగ్గిందని, చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు. చేపల చెరువులో బర్డ్ ఫ్లూ సోకి చనిపోయిన కోళ్లు దానాగా వేస్తే చేపలకు కూడా వైరస్ ఒకే అవకాశం ఉందని తద్వారా ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటినే అవకాశం ఉందని ఎన్జీవో ప్రతినిధులు ఆందోళన చెందుతున్నారు.

Also read :  మేఘా కృష్ణారెడ్డికి బిగ్ షాక్.. ముంబై హైకోర్టులో జర్నలిస్ట్ రవి ప్రకాష్ పిల్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pawan: పవన్ ఇలాకా పిఠాపురంలో దారుణం.. దళితుల గ్రామ బహిష్కరణ.. పరిహారం అడగడమే పాపమా?

పవన్ ఇలాకా పిఠాపురం మల్లంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంట్లో పనిచేస్తూ కరెంట్ షాక్‌తో పల్లపు సురేష్ చనిపోయాడు. దీంతో న్యాయం చేయాలంటూ ధర్నాకు దిగిన దళితులను అగ్రవర్ణ పెద్దలు గ్రామ బహిష్కరణ చేశారు. టిఫిన్, కిరాణ షాపు సరుకులు కూడా ఇవ్వట్లేదు.

New Update

Pawa Kalyan: ఏపీ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం మల్లం గ్రామంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. అగ్ర వర్ణాలు దళితులను గ్రామం నుంచి బహిష్కరించడం కలకలం రేపుతోంది. వస్తువులను విక్రయించరాదంటూ హుకుం జారీ చేయడంతో దుకాణదారులు అమ్మకాలు నిలిపివేశారు. ఓ ఇంటి దగ్గర విద్యుత్ పని చేస్తూ షాక్ తగిలి పల్లపు సురేష్ అనే వ్యక్తి చనిపోయాడు. దీంతో మృతుడి కుటుంబసభ్యులు, దళితులు బాధితుడి కుటంబానికి న్యాయం చేయాలంటూ ధర్నా చేశారు. దీంతో గ్రామం నుంచి బహిష్కరించారని దళితులు ఆందోళన వ్యక్తం చేశారు. 

ఇది కూడా చూడండి: Saraswati Pushkaralu: సరస్వతీ పుష్కరాలు-2025.. సర్కార్ ప్రత్యేక యాప్‌..ఒక్క క్లిక్ చాలు!

రంగంలోకి దిగిన ఆర్డీవో..

ఈనెల 16న అగ్రవర్ణానికి చెందిన వారి ఇంటి కరెంటు పనిచేస్తూ షాక్ తో పల్లపు సురేష్ చనిపోయాడు. సురేష్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ మల్లం గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద దళితులు ధర్నా చేశారు. నష్టపరిహారంగా సుమారు రూ. 2 లక్షల 75 వేల రూపాయలు ఇచ్చేందుకు అంగీకరించారు. కానీ తాము చేయని తప్పుకి నష్టపరిహారం ఎందుకు చెల్లించాలంటూ అగ్రవర్ణాల పెద్దలు వాదనకు దిగారు. దీంతో దళితులను దూరం పెట్టాలని నిర్ణయించగా.. వస్తువులను విక్రయించరాదంటూ అగ్రవర్ణాలు తీర్మానించాయి. ఆదేశాలు పాటించని వారిపై కూడా చర్యలు తీసుకుంటామని వ్యాపారులకు వార్నింగ్ ఇచ్చారు. ఈ ఇష్యూ మరింత ముదరడంతో పోలీసులు ఇరువర్గాలతో చర్చలు జరిపారు. స్వయంగా ఆర్డీవో రంగంలోకి దిగి దళితులు, అగ్రవర్ణాల వాదనలు విన్నారు. ఇరువర్గాల మధ్య సయోధ్య కుదిర్చినట్లు సమాచారం. 

ఇది కూడా చూడండి: Paster praveen: పోలీసులకు వ్యతిరేకంగా KA పాల్ అనుమానాలు.. ఆర్టీవీతో ఎక్స్‌క్లూసివ్ వీడియో

pitapuram | dalith | village | issue | telugu-news | today telugu news 

Advertisment
Advertisment
Advertisment