AP Crime: విజయవాడలో విషాదం.. భర్త లేని టైంలో ఇంటికి వెళ్లి.. లవర్‌ను ఏం చేశాడంటే?

విజయవాడ నిడమనూరులోవివాహేతర సంబంధంతో కావ్య అనే మహిళను ప్రియుడు వాసు హత్య చేశాడు. తనతో ఫోన్ మాట్లాడకపోతే చంపేస్తానంటూ బెదిరించి ఇంటి వచ్చి చున్నీతో గొంతు బిగించి చంపిన్నాడు. కావ్య మర్డర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

New Update
vijayawada crime

vijayawada crime

AP Crime: వివాహేతర సంబంధం ఓ మహిళ హత్యకు దారి తీసిన ఘటన ఏపీలో కలకలం రేపింది. ఎన్టీఆర్‌ జిల్లా పటమట పోలీసుల తెలిపిన వివరాలప్రకారం.. విజయవాడ రూరల్‌ మండలం నిడమానూరుకు చెందిన కావ్య (23), ఆమె భర్త, ముగ్గురు ఆడ పిల్లలు కలిసి జీవిస్తున్నారు. కావ్వకు బాపట్ల జిల్లా రేపల్లెకు చెందిన ప్రకాష్‌రావుతో  9 సంవత్సరాల కిందట వివాహం జరిగింది.  వీరికి అక్షయ (5),  అక్షర (4), అమూల్య (2) అను ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారు. భర్త వంట పనులు చేస్తుండగా.. ఆమె ఆస్పత్రిలో ఆయాగా ఉద్యోగం చేస్తుంది. 

చున్నీతో కావ్య మెడకు బిగించి హత్య:

ఈ సమయంలో నిడమానూరుకు చెందిన లాం వాసు అనే వ్యక్తతో పరిచయై అతనితోనే వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే ఈ విషయం ఆరు నెలల కిందట భర్తకు తెలిసి కావ్వను ఉద్యోగం మాన్పించారు. ఆమె అప్పటి నుంచి వాసుతో మాట్లాడడం మానేసింది. అప్పటి నుంచి వాసు కావ్యను బెదిరిస్తున్నాడు. అయితే.. శనివారం సాయంత్రం భర్త ప్రకాష్‌రావు బెంజ్‌సర్కిల్‌ ఓ హోటల్‌కు వంట పనికి వెళ్లాడు. కావ్య పిల్లలతోపాటు తాతతో కలిసి ఇంట్లో నిద్ర పోతున్నారు. 

ఇది కూడా చదవండి: నాలుకపై ఎరుపు, తెలుపు మచ్చలు క్యాన్సర్ సంకేతమా?

వాసు అర్ధరాత్రి 12 గంటల సమయంలో కావ్య ఇంటికి వచ్చి ఆమెతో గొడవ పడి.. చున్నీతో కావ్య మెడకు బిగించి హత్య చేశాడు. పక్క గదిలో ఉన్న ఆమె తాతయ్య చూసి కేకలు వేయగా అక్కడ నుంచి వాసు పరారయ్యాడు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. భర్త ప్రకాష్‌రావు ఫిర్యాదు మేరకు  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పటమట సీఐ వి.పవన్‌ కిషోర్‌ తెలిపారు.

 



ఇది కూడా చదవండి: తెలంగాణలో బర్డ్ ఫ్లూ కల్లోలం.. ఒకే రోజు ఎన్ని వేల కోళ్లు చనిపోయాయంటే?

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: సీఎం రేవంత్ కు షాకిచ్చిన ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు.. అలా చేశారేంటి?

నిన్న జరిగిన CLP భేటీకి ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్, ప్రేమ్ సాగర్ రావు హాజరుకాకపోవడం హాట్ టాపిక్ గా మారింది. మంత్రి పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న ఈ ముగ్గురు.. ఎందుకు రాలేదన్న అంశంపై కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది.

New Update

మంత్రివర్గ విస్తరణ అంశం తెలంగాణ కాంగ్రెస్ కు, సీఎం రేవంత్ కు తలనొప్పిగా మారింది. కేబినెట్ బెర్త్ ఆశిస్తున్న నేతలు స్వరం పెంచారు. తమను అడ్డుకుంటున్న వారిపై, హైకమాండ్ తీరుపై బహిరంగంగానే కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీనియర్ నేత జానారెడ్డి తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ మరుసటి రోజే మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. అన్ని పార్టీలు తిరిగి వచ్చిన వారు తనకు మంత్రి పదవి రాకుండా కుట్రలు చేస్తున్నారంటూ కామెంట్ చేశారు. వివేక్ ఫ్యామిలీని టార్గెట్ చేసి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

అయితే నిన్న జరిగిన సీఎల్పీ మీటింగ్ కు మంత్రి పదవిని ఆశిస్తున్న ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్‌, ప్రేమ్‌సాగర్‌రావు గైర్హాజరు కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. కేబినెట్ విస్తరణలో తమకు చోటు కల్పించాలంటూ ఈ ముగ్గురు ఎమ్మెల్యేల తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో వీరు సీఎల్పీ భేటీకి ఎందుకు హాజరు కాలేదనే అంశం హాట్ టాపిక్ గా మారింది. పార్టీ నాయకత్వంపై అలిగే వీరు హాజరుకాలేదా? అన్న చర్చ సాగుతోంది. 

ఇదిలా ఉంటే.. నిన్నటి సీఎల్పీ భేటీలో ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కేబినెట్ విస్తరణపై పార్టీ నేతలు మాట్లాడొద్దని స్పష్టం చేశారు. మంత్రివర్గం విస్తరణను అధిష్టానం చూసుకుంటుందన్నారు. పార్టీ లైన్‌ దాటితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

Advertisment
Advertisment
Advertisment