Posani case: ఏపీ హైకోర్టులో పోసాని కృష్ణ మురళికి బిగ్ రిలీఫ్

తనపై నమోదైన కేసులు కొట్టేయాలని పోసాని కృష్ణ మురళి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. పోసాని క్వాష్ పిటిషన్‌ గురువారం హైకోర్టు విచారణ జరిగింది. విశాఖ, చిత్తూరు జిల్లాల్లో నమోదైన కేసుల్లో పోసానిపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. 

New Update
TDP fans making old videos viral with Posani krishna murali arrest

TDP fans making old videos viral with Posani krishna murali arrest Photograph: (TDP fans making old videos viral with Posani krishna murali arrest)

తనపై నమోదైన కేసులు కొట్టేయాలని పోసాని కృష్ణ మురళి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. పోసాని క్వాష్ పిటిషన్‌ గురువారం హైకోర్టు విచారణ జరిగింది. విశాఖ, చిత్తూరు జిల్లాల్లో నమోదైన కేసుల్లో పోసానిపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తదుపరి విచారణ మార్చి 10 (సోమవారం)కి వాయిదా వేసింది. 

Also read: Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. అన్నప్రసాదంలో మరో స్పెషల్ ఐటెమ్

ఆదోని కోర్టులో పోసాని కృష్ణ మురళి బెయిల్ పిటిషన్ వాదనలు జరుగుతున్నాయి. అలాగే ఆదోని 3 టౌన్ పోలీసుల పోసానిని మూడు రోజులు కస్టడీకి ఇవ్వాలని కోర్టు కోరారు. ఇరు పక్షాల వాదనలు ఈ రోజు కొసాగుతున్నాయి. హైకోర్టులో విచారణ పూర్తి కాగా.. మరో రెండు కోర్టుల్లో పోసాని కేసుల విచారణ జరుగుతుంది. మరో కొన్ని గంటల్లొ ఆయా కోర్టుల్లో కూడా తీర్పు రానుంది. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP New RationCards: మంత్రి నాదెండ్ల శుభవార్త.. కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన!

పేదలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మే నుంచి కొత్త రేషన్‌కార్డులు ఇవ్వనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలపారు. ATM కార్డు సైజులో ఉండే వీటిలో క్యూఆర్‌ కోడ్‌, ఇతర భద్రతా ఫీచర్లు ఉంటాయని చెప్పారు. ఈ-కేవైసీ పూర్తిచేసి అందిస్తామన్నారు.

New Update
ap rationcard

ap rationcard

AP New RationCards: పేదలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మే నుంచి కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలపారు. ATM కార్డు సైజులో ఉండే వీటిలో క్యూఆర్‌ కోడ్‌, ఇతర భద్రతా ఫీచర్లు ఉంటాయని చెప్పారు. 

ఈ-కేవైసీ పూర్తైన తర్వాతే..

ఈ మేరకు మంగళవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కార్డులో కుటుంబసభ్యులను చేర్చుకోవడంతోపాటు తొలగించేందుకు కూడా ఆప్షన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇక ఈ-కేవైసీ పూర్తైన తర్వాతే ఎంతమందికి కార్డులు ఇవ్వాలో క్లారిటీ వస్తుందని, నేటినుంచి దీపం-2 రెండోవిడత సిలిండర్‌ బుకింగ్‌ మొదలుపెట్టినట్లు స్పష్టం చేశారు. 

ఇది కూడా చూడండి: ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు.. ఈ జిల్లాల్లో వానలు..!

రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగుతోంది. గన్నీ బ్యాగ్స్‌ కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. నచ్చిన మిల్లుకు తీసుకెళ్లి రైతులు ధాన్యం అమ్ముకోవచ్చు. వాట్సప్‌ ద్వారా కూడా ధాన్యం అమ్ముకునే అవకాశాన్ని కల్పించాం. ఇప్పటికే వాట్సప్‌ ద్వారా 16వేల మంది రైతులు ధాన్యాన్ని విక్రయించినట్లు వెల్లడించారు. 

ఇది కూడా చూడండి: డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌..  రూ. 30లక్షలకు ముచ్చెమటలు పట్టించాడు!

ఇదిలా ఉంటే.. ఏప్రిల్‌ నుంచే పెంచిన పింఛన్లను అందిస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. దివ్యాంగులకు రూ.6వేల పింఛన్లు, కోటిన్నర కుటుంబాలకు 64 లక్షల మందికి పింఛన్లు అందజేస్తున్నామన్నారు. సంపాదించే దానికంటే ఎక్కువ ఆదాయం అందిస్తున్నామని, పింఛన్ల పంపిణీ కోసం ఏడాదికి రూ.33,100 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. పింఛన్ల రూపంలో నెలకు రూ.2,722 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఒక నెల తీసుకోకపోయినా 3 నెల తీసుకునే అవకాశం కల్పించాం. పేదలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో అదనంగా రూ.76 కోట్లు ఇస్తున్నామని, పేదరికం లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు ముఖ్యమంత్రి. 

ration-cards | nadendla-manohar | cm-chandrababu | telugu-news | today telugu news

 

Advertisment
Advertisment
Advertisment