Betting App Case: బాలకృష్ణ షోతో నా జీవితం నాశనం.. రూ.80 లక్షలు పోగొట్టుకున్నా.. నెల్లూరు బాధితుడి సంచలన ఇంటర్వ్యూ!

ఆన్‌లైన్ గేమ్‌లో రూ.80లక్షలు పోగొట్టుకున్నానని నెల్లూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తెలిపాడు. బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షో చూసి ‘ఫన్ 88’ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నాను. మొదట నెలన్నరలో రూ.3లక్షలు వచ్చాయి. అలా ఆడుతూ రూ.80లక్షలు అప్పు అయిపోయాను అని పేర్కొన్నాడు.

New Update

రెండు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ వ్యవహారం సెన్సేషనల్‌గా మారింది. ముఖ్యంగా ఇన్‌ఫ్ల్యూయెన్సర్స్, నటీ నటులపై పంజాగుట్టా, మియాపూర్ పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదు అయ్యాయి. అందులో పంజాగుట్టలో 11 మంది ఇన్‌ఫ్ల్యూయెన్సర్ల మీద కేసులు నమోదు కాగా.. మీయాపూర్‌లో 25 మంది పోలీసుల మీద కేసులు నమోదు అయ్యాయి. ఈ క్రమంలోనే బెట్టింగ్ యాప్స్‌లో డబ్బులు పోగుట్టుకున్న బాధితులు ఉంటే.. వారు తమను సంప్రదించాలని పోలీసులు చెబుతున్నారు. 

ఇది కూడా చదవండి: AP News: ఏపీకి మరో మూడు సార్లు అతనే సీఎం.. పవన్ సంచలన వ్యాఖ్యలు!

దీంతో బెట్టింగ్ గేమింగ్‌లో రూ.80 లక్షలు పోగొట్టుకున్న ఓ వ్యక్తి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. అక్కడ తనకు ఏమైనా పరిష్కారం దొరుకుతుందా అని ఎదురుచూస్తున్నాడు. ఈ మేరకు RTVతో మాట్లాడిన ఆ వ్యక్తి సంచలన విషయాలు బయటపెట్టాడు. బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షో ద్వారానే బెట్టింగ్ యాప్ డౌన్‌లోడ్ చేశానని.. అలా ఏడాదికి పైగా ఆడి సర్వస్వం కోల్పోయానని అన్నాడు. బెట్టింగ్ గేమ్‌తో దాదాపు రూ.80 లక్షలు అప్పులపాలయ్యానని చెప్పుకొచ్చాడు. మరి అతడిది ఏ ఊరు.. ఎందుకు అంతలా బానిసయ్యాడు.. ఇప్పుడు ఏం చేస్తున్నాడు అని విషయాలు తెలుసుకుందాం. 

ఇది కూడా చదవండి: AP News: SC వర్గీకరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం!

నెల్లూరు వాసి ఏమన్నాడంటే?

‘‘మాది నెల్లూరు జిల్లా, ఏఎస్ పేట మండలం, కావలాడివాలి విలేజ్. నేను మొదట్లో ఒక లేబర్ పని చేసేవాడిని. ఆ తర్వాత ఒక టెంట్ హౌస్ వ్యాపారం పెట్టుకున్నాను. దీంతో బాగా డబ్బులు సంపాదించాను. చుట్టు పక్కల గ్రామాల్లో మంచి పేరు కూడా ఉంది. అయితే అప్పట్లోనే కరోనా వచ్చింది. దీంతో వ్యాపారం మొత్తం దెబ్బతింది. నాకు ఆరోగ్యం బాగోలేక రూ.15 లక్షలు అప్పు చేశాను. తర్వాత కరోనా తర్వాత కూలి ముఠా మేస్త్రిగా ఉండి పని చేసుకున్నాను. 

Also Read :  లాభాల్లో కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు..

ఆ సమయంలోనే బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోలో ‘ఫన్ 88’ బెట్టింగ్ యాప్‌ను చూశాను. ఆ తర్వాత దానిని డౌన్‌లోడ్ చేసుకున్నాను. అక్కడ నుంచి గేమ్ ఆడటం మొదలు పెట్టాను. అక్కడ నుంచి దానికి బానిసయ్యాను. 2023లో ఆడటం స్టార్ట్ చేశాను. మొదట్లో డబ్బులు పెడితే బాగా లాభాలు వచ్చేవి. బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోలో ప్రభాస్‌కు ‘ఫన్ 88’ బాక్స్‌ గిఫ్ట్ ఇస్తూ.. ఇందులో చాలా గేమ్స్ ఉంటాయ్ ఆడండి గిఫ్ట్‌లు పట్టండి అని చెప్పి ఇస్తాడు. 

సర్లే ఏదో డబ్బులు వస్తాయని గేమ్ ఆడాను. ముందు రూ.10వేలు పెడితే రూ.18వేలు వచ్చింది. బాగా డబ్బులు వచ్చాయి. అలా ఒకటిన్నర నెలల్లో రూ.3లక్షలు సంపాదించాను. ఆడుతున్న క్రమంలో డబ్బులు పోతూ వస్తూ ఉన్నాయి. ఇలా దాదాపు రూ.80 లక్షలు అప్పు అయిపోయాను.’’ అని చెప్పుకొచ్చాడు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Tirumala : ఏప్రిల్ 6న శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం.. 7న శ్రీరామపట్టాభిషేకం

తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 6వ తేదీన శ్రీ రామనవమి పర్వదినం సందర్భంగా తిరుపతి శ్రీకోదండరామస్వామి వారి ఆలయంలో స్వామివారి కళ్యాణం నిర్వహించనున్నారు. రంగ‌నాయ‌కుల మండ‌పంలో శ్రీ సీతా లక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు.

New Update
Tirumala Tirupati Devasthanams

Tirumala Tirupati Devasthanam

Tirumala : తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 6వ తేదీన శ్రీ రామనవమి పర్వదినం సందర్భంగా తిరుపతి శ్రీకోదండరామస్వామి వారి ఆలయంలో  ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు టీటీడీ అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఆదివారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు రంగ‌నాయ‌కుల మండ‌పంలో శ్రీ సీతా లక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తమన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు శ్రీ రామనవమి ఆస్థానం వైభవంగా జరుగనుంది. రాత్రి 7 గంటలకు హనుమంత వాహనంపై శ్రీరాములవారు ఆలయ మాడ వీధుల్లో విహరిస్తారు.

ఇది కూడా చూడండి: డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌..  రూ. 30లక్షలకు ముచ్చెమటలు పట్టించాడు!

శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 6న శ్రీ రామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని పలు ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు రంగ‌నాయ‌కుల మండ‌పంలో శ్రీ సీతా లక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. దీనిలో భాగంగా ఉత్సవమూర్తులకు అర్చకులు రంగనాయక మండపంలో, వేదమంత్రోచ్ఛరణల నడుమ అభిషేకం చేస్తారు. సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8 గం. వరకు హ‌నుమంత వాహ‌నసేవ జరగనుంది. 9గం. నుంచి 10 గంటల నడుమ బంగారువాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహించనున్నారు. ఏప్రిల్ 7న శ్రీ రామ పట్టాభిషేకాన్ని, పురస్కరించుకుని, రాత్రి 8 నుంచి 9 గంటల న‌డుమ బంగారువాకిలి చెంత ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక ఆస్థానాన్ని నిర్వహించనున్నారు.

Also Read: భర్తముందే భార్యపై గ్యాంగ్ రేప్.. ఊరికి వెళ్లి వస్తుండగా నడిరోడ్డుపై ఆపి!


ఏప్రిల్ 7న శ్రీ సీతారాముల కల్యాణం :


ఏప్రిల్ 7వ తేదీన ఉదయం సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవర్లకు అభిషేకం చేస్తారు. ఉదయం 9 నుండి 10 గంటల వరకు టిటిడి పరిపాలనా భవనం నుండి ఏనుగు మీద ముత్యాల తలంబ్రాలను ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకెళతారు. రాత్రి 7 నుండి 9.30 గంటల వరకు శ్రీ సీతారామ కల్యాణం వేడుకగా జరుగనుంది. రూ.1000/- చెల్లించి గృహస్తులు కల్యాణంలో పాల్గొనవచ్చు. వీరికి ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ ప్రసాదం బహుమానంగా అందజేస్తారు.

ఏప్రిల్ 8న శ్రీరామ పట్టాభిషేకం :


ఏప్రిల్ 8న ఉదయం 8 గంటలకు తిరుపతిలోని శ్రీ నరసింహతీర్థం నుండి ఆలయ మర్యాదలతో తీర్థం తీసుకొచ్చి స్వామివారికి చతుర్దశ కలశ స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు శ్రీరామ పట్టాభిషేకం చేపడతారు. ఆ తరువాత బంగారు తిరుచ్చిపై శ్రీ సీతారామలక్ష్మణులను, ప్రత్యేక తిరుచ్చిపై శ్రీ ఆంజనేయస్వామివారిని మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు.

Also Read: కొడాలి నానిని కాపాడేందుకు రంగంలోకి డాక్టర్ పాండా.. ఆయన ట్రాక్ రికార్డ్ తెలిస్తే షాక్ అవుతారు!

ఏప్రిల్ 9వ తేదీన సాయంత్రం 4 గంట‌ల‌కు వ‌సంతోత్సవం, ఆస్థానం నిర్వహించ‌నున్నారు. అనంత‌రం సాయంత్రం 5 నుండి 6 గంట‌ల వ‌ర‌కు తిరువీధి ఉత్సవం జరుగనుంది.

ఏప్రిల్ 10 నుండి 12 వరకు తెప్పోత్సవాలు :


శ్రీ కోదండరాముని తెప్పోత్సవాలు ఏప్రిల్ 10 నుండి 12వ తేదీ వరకు ప్రతిరోజు రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు శ్రీరామచంద్ర పుష్కరిణిలో వైభవంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా ప్రతిరోజూ ఉదయం 8 నుండి 9.30 గంటల వరకు స్నపనతిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. మొదటిరోజు ఐదుచుట్లు, రెండో రోజు ఏడు చుట్లు, చివరిరోజు తొమ్మిది చుట్లు తెప్పలపై స్వామివారు విహరిస్తారు.

Also Read: Adolescence: ప్రధాని మెచ్చిన 'Adolescence' వెబ్ సీరిస్.. అన్ని స్కూళ్లలో ప్రదర్శించాలని ఆదేశం.. దాని ప్రత్యేకత ఇదే!

Advertisment
Advertisment
Advertisment