AP News: రజని నిన్ను వదలను.. తిన్నదంతా కక్కిస్తాం: మాజీ మంత్రికి ఎమ్మెల్యే వార్నింగ్!

మాజీమంత్రి విడదల రజని, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మధ్య వివాదం మరింత ముదిరింది. ఒకరిపై ఒకరు సంచలన ఆరోపణలు చేసుకుంటున్నారు. రజిని అరాచకాలు మొత్తం బయటకు తీసి తిన్నదంతా కక్కిస్తామని పుల్లరావు అన్నారు. రజని అతనికి మాస్‌ వార్నింగ్‌ ఇచ్చారు.

New Update
rajani ap

AP TDP MLA Prathipati Pullarao strong warning to vidudala rajani

ఏపీ వైసీపీ మాజీమంత్రి విడదల రజనిపై పల్నాజు జిల్లా చిలకలూరిపేట టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సంచలన ఆరోపణలు చేశారు. చిలకలూరిపేటలో అరాచకాలు చేసి గుంటూరు పారిపోయిందన్నారు. తన అనుచరులతో లెక్కలేనన్ని అవినీతి పనులు చేసి గుంటూరుకి వెళ్లిపోయిందంటూ మండిపడ్డారు. ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో మరోసారి చిలకలూరిపేటకి వచ్చిందన్నారు. ఈ విషయాలన్ని మర్చిపోతే ఎలా? నీకు ఓటేసిన ప్రజల్ని, చిలకలూరిపేట వాసుల్ని పూర్తిగా నాశనం చేశావ్ అంటూ రజనీపై తీవ్ర విమర్శలు చేశారు. 

Also Read :  జగన్‌ను వాళ్లే ముంచేశారు.. చంద్రబాబుకు చచ్చిన తర్వాత నరకం తప్పదు: కేఏపాల్ సంచలనం

తిన్నదంతా కక్కిస్తాం

ఈ మేరకు శనివారం మీడియాతో మాట్లాడదిన పుల్లరావు..  మేము ఏ తప్పు చేయలేదు. దేనికైనా రెడీ. రజిని నువ్వు ఏడు నెలలు ఎక్కడ దాక్కున్నావు. రజిని అరాచకాలు మొత్తం బయటకు తీసి తిన్నదంతా కక్కిస్తాం. దమ్ముంటే రజిని ఈ ఐదేళ్లు పురుషోత్తమపట్నంలోనే ఉండాలి. జగన్, సజ్జల రామకృష్ణారెడ్డి అండ చూసుకొని విపరీతమైన అరాచకాలు చేశావు. రాబోయే రోజుల్లో నిన్ను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదంటూ సవల్ విసిరారు. 

ఇది కూడా చదవండి; Delhi Elections 2025: బీజేపీని గెలిపించారు.. ఆప్‌ను ముంచారు.. ఢిల్లీ రిజల్ట్స్‌ను రివర్స్ చేసిన జంపింగ్‌లు!

ఇదిలా ఉంటే.. రజనీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదవడంతో చర్చనీయాంశమైంది. ఈ కేసుపై రజనీ తీవ్రంగా స్పందించారు. టీడీపీ ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావుతోపాటు అధికారులపై మండిపడ్డారు. మాస్‌ వార్నింగ్‌ ఇచ్చారు. ఎన్డీయే ప్రభుత్వంపై విరుచుకుపడిన ఆమె.. 'పుల్లారావు ఒక అందమైన కట్టు కథ మళ్లీ నాపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు పెట్టించాడు. 80 ఏళ్ల పైబడిన మా మామగారిపై కేసు పెట్టారు. ఎక్కడో విదేశాల్లో ఉంటున్న మా మరిదిపై అక్రమ కేసు పెట్టించాడు. పుల్లారావు మా కుటుంబంపై అక్రమ కేసులు పెట్టించి కక్ష సాధిస్తున్నాడన్నారు. 

Also Read :  రెండో వన్డేలో కోహ్లీ ఆడతాడా? లేదా?.. ఫిట్‌నెస్‌పై అప్‌డేట్‌ ఇచ్చిన బ్యాటింగ్ కోచ్!

Also Read :  ప్రాణం తీసిన ఈత సరదా...బతుకు తెరువుకోసం వచ్చి...

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

🔴Live News Updates: పాత వాహనాలకూ కొత్త రిజిస్ట్రేషన్ నంబర్లు

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Lok Prakash
New Update
Live News Updates in Telugu

Live News Updates in Telugu

🔴Live News Updates:

TS: పాత వాహనాలకూ కొత్త రిజిస్ట్రేషన్ నంబర్లు

తెలంగాణలో నెంబర్ ప్లేట్లు మార్చాల్సిన టైమ్ వచ్చేసింది. పాతదే అయినా హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ తప్పనిసరి చేసింది రవాణాశాఖ. సెప్టెంబర్ 30వ తేదీని గడువుగా నిర్ణయించింది. 

ts
High Security number plate

 

మీ వెహికల్ 2019 ఏప్రిల్ 1వ తేదీ కన్నా ముందు తయారైందా...అయితే అర్జంటుగా వెళ్ళి నంబర్ ప్లేట్ మార్చుకోండి.  పై తేదీ కన్నా ముందు తయారైన వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ బిగించుకోవాల్సిందేనని తెలంగాణ రవాణాశాఖ చెప్పింది.  దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. వాహన రకాన్ని బట్టి నంబర్‌ ప్లేట్‌కు కనిష్ఠంగా రూ.320.. గరిష్ఠంగా రూ.800గా ఛార్జీలను ఖరారు చేసింది. నకిలీ నంబర్‌ ప్లేట్లకు అడ్డుకట్ట వేయడం, దొంగతనాలను అరికట్టడం, వాహనాలు రహదారి భద్రతలను దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు చేస్తున్నామని రవాణాశాఖ చెబుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మరకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. 

కచ్చితంగా మార్చాల్సిందే..

పాత వాహనాలకు నంబర్ ప్లేట్ మార్చాల్సి బాధ్యత యజమానిదే అని తేల్చి చెప్పింది రవాణాశాఖ. హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ మార్చుకోకపోతే వాహనాలను అమ్మాలన్నీ, కొనాలన్నా సాధ్యం కాదని తెలిపింది. అలాగే బీమా, పొల్యూషన్ సర్టిఫికేట్ లాంటివి కూడా లభించవు. పైగా సెప్టెంబర్ తర్వాత కొత్త నంబర్ ప్లేట్లు కనిపించకపోతే కేసులు కూడా నమోదు చేయనున్నారు.  ఇక ఈ నంబర్ ప్లేట్లు వాహన తయారీ సంస్థలు తమ డీలర్ల దగ్గర కూడా చేయించుకోవచ్చును. దీనికి సంబంధించిన సమాచారం, నంబర్ ప్లేట్ ధరలు డీలర్ దగ్గర కనిపిచేలా చేయనున్నారు. వాహనదారులు ఈ ప్లేట్‌ కోసం www.siam.in వెబ్‌సైట్‌లో ..వాహన వివరాలు నమోదు చేసి బుక్‌ చేసుకోవాలి. కొత్త ప్లేట్‌ బిగించాక ఆ ఫొటోను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలి.

Also Read: Sai Sudarshan: చెండాడేశాడు భయ్యా.. చుక్కలు చూపించిన సుదర్శన్- ఎంత స్కోర్ చేశాడంటే?

Also Read:  Badminton: ఆసియా ఛాంపియన్ షిప్ లో పీవీ సింధు మొదటి విజయం

  • Apr 10, 2025 08:52 IST

    ఎంతకు తెగించావ్ రా.. ప్రేమ పెళ్లి.. ఆరు నెలలకే..!

    జగిత్యాల కోరుట్లలో రజిత అనే వివాహిత మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయ్యప్ప గుట్టపై మహిళ మృతదేహం కనిపించింది. పవన్ అనే వ్యక్తిని 6 నెలల కిందట ప్రేమించి పెళ్లి చేసుకుంది. అతనే రజితను చంపినట్లు ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

    Karimnagar Wife And Husband Incident🔴LIVE : ప్రేమపెళ్లి.. 6 నెలలకే కొట్టి చంపి | Jagtial News | RTV



Advertisment
Advertisment
Advertisment