Pawan Vs Varma: పవన్ను ప్రశ్నిస్తూ.. షాకింగ్ వీడియో షేర్ చేసిన వర్మ.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ!

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తన X ఖాతాలో చేసిన పోస్టు తీవ్ర చర్చనీయాంశమైంది. పిఠాపురం జగ్గయ్య కాలనీలో పారిశుధ్యం లోపించిందని ఇందుకు సంబంధించిన వీడియోను వర్మ షేర్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే పవన్ ను టార్గెట్ చేసే ఆయన ఈ వీడియో షేర్ చేశారన్న చర్చ సాగుతోంది.

author-image
By Nikhil
New Update
Varma Vs Pawan Kalyan

Pawan Vs Varma: పిఠాపురం టీడీపీ నేత(Pithapuram TDP leader), మాజీ ఎమ్మెల్యే వర్మ(Former MLA Varma) తన X ఖాతాలో చేసిన పోస్టు తీవ్ర చర్చనీయాంశమైంది. పిఠాపురం జగ్గయ్య కాలనీలో పారిశుధ్యం లోపించిందని ఇందుకు సంబంధించిన వీడియోను వర్మ షేర్ చేశారు. అధికారుల నిర్లక్ష్యంతో ఆ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. అయితే.. స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ ను టార్గెట్  చేస్తూ వర్మ ఈ వీడియోను షేర్ చేశారన్న చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది. టీడీపీ, జనసేన(Janasena) అభిమానులు సైతం కామెంట్ల యుద్ధం చేస్తున్నారు.

Also Read :  బడికి వెళ్లమన్నందుకు..ఆరుగురు విద్యార్థులు అదృశ్యం!

గత కొన్ని రోజులుగా కోల్డ్ వార్..

జనసేన నేతలు, వర్మకు మధ్య గత కొన్ని రోజులుగా కోల్డ్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ కోసం టికెట్ త్యాగం చేసి గెలిపించుకుంటే ఇప్పుడు వర్మను పట్టించుకోవడం లేదని ఆయన అభిమానులు, స్థానిక టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ నేతకు పదవి రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఈ వివాదం జరుగుతున్న సమయంలోనే నాగబాబు చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి. 

Also Read :  టాప్‌ మెహందీ ఆర్టిస్టు ఆత్మహత్య!

Also Read :  ఈ సారి శ్రీ విశ్వావసు నామ సంవత్సం.. దాని అర్థం.. ప్రత్యేకత ఏంటో తెలుసా?

పవన్ గెలవడానికి ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తలు, ప్రజలే కారణమని అన్నారు. అంతే కానీ పవన్ గెలవడానికి ఎవరైనా తానే కారణమని భావిస్తే అది వారి కర్మ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో వివాదం మరింత పెద్దదైంది. అయితే.. వర్మ మాత్రం సైలెంట్ గా నియోజకవర్గంలో తన కేడర్ కోల్పోకుండా వ్యూహాలు రచిస్తున్నారు. కార్యకర్తే అధినేత అనే కార్యక్రమం ద్వారా విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఆయా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు.

Also Read :  నిజాంసాగర్‌ దగ్గర కారు డిక్కీలో మహిళ డెడ్‌బాడీ


(pawan-kalyan | telugu-news | latest-telugu-news | telugu breaking news | today-news-in-telugu | andhra-pradesh-news)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి

Tirumala : ఏప్రిల్ 6న శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం.. 7న శ్రీరామపట్టాభిషేకం

తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 6వ తేదీన శ్రీ రామనవమి పర్వదినం సందర్భంగా తిరుపతి శ్రీకోదండరామస్వామి వారి ఆలయంలో స్వామివారి కళ్యాణం నిర్వహించనున్నారు. రంగ‌నాయ‌కుల మండ‌పంలో శ్రీ సీతా లక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు.

New Update
Tirumala Tirupati Devasthanams

Tirumala Tirupati Devasthanam

Tirumala : తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 6వ తేదీన శ్రీ రామనవమి పర్వదినం సందర్భంగా తిరుపతి శ్రీకోదండరామస్వామి వారి ఆలయంలో  ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు టీటీడీ అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఆదివారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు రంగ‌నాయ‌కుల మండ‌పంలో శ్రీ సీతా లక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తమన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు శ్రీ రామనవమి ఆస్థానం వైభవంగా జరుగనుంది. రాత్రి 7 గంటలకు హనుమంత వాహనంపై శ్రీరాములవారు ఆలయ మాడ వీధుల్లో విహరిస్తారు.

ఇది కూడా చూడండి: డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌..  రూ. 30లక్షలకు ముచ్చెమటలు పట్టించాడు!

శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 6న శ్రీ రామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని పలు ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు రంగ‌నాయ‌కుల మండ‌పంలో శ్రీ సీతా లక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. దీనిలో భాగంగా ఉత్సవమూర్తులకు అర్చకులు రంగనాయక మండపంలో, వేదమంత్రోచ్ఛరణల నడుమ అభిషేకం చేస్తారు. సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8 గం. వరకు హ‌నుమంత వాహ‌నసేవ జరగనుంది. 9గం. నుంచి 10 గంటల నడుమ బంగారువాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహించనున్నారు. ఏప్రిల్ 7న శ్రీ రామ పట్టాభిషేకాన్ని, పురస్కరించుకుని, రాత్రి 8 నుంచి 9 గంటల న‌డుమ బంగారువాకిలి చెంత ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక ఆస్థానాన్ని నిర్వహించనున్నారు.

Also Read: భర్తముందే భార్యపై గ్యాంగ్ రేప్.. ఊరికి వెళ్లి వస్తుండగా నడిరోడ్డుపై ఆపి!


ఏప్రిల్ 7న శ్రీ సీతారాముల కల్యాణం :


ఏప్రిల్ 7వ తేదీన ఉదయం సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవర్లకు అభిషేకం చేస్తారు. ఉదయం 9 నుండి 10 గంటల వరకు టిటిడి పరిపాలనా భవనం నుండి ఏనుగు మీద ముత్యాల తలంబ్రాలను ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకెళతారు. రాత్రి 7 నుండి 9.30 గంటల వరకు శ్రీ సీతారామ కల్యాణం వేడుకగా జరుగనుంది. రూ.1000/- చెల్లించి గృహస్తులు కల్యాణంలో పాల్గొనవచ్చు. వీరికి ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ ప్రసాదం బహుమానంగా అందజేస్తారు.

ఏప్రిల్ 8న శ్రీరామ పట్టాభిషేకం :


ఏప్రిల్ 8న ఉదయం 8 గంటలకు తిరుపతిలోని శ్రీ నరసింహతీర్థం నుండి ఆలయ మర్యాదలతో తీర్థం తీసుకొచ్చి స్వామివారికి చతుర్దశ కలశ స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు శ్రీరామ పట్టాభిషేకం చేపడతారు. ఆ తరువాత బంగారు తిరుచ్చిపై శ్రీ సీతారామలక్ష్మణులను, ప్రత్యేక తిరుచ్చిపై శ్రీ ఆంజనేయస్వామివారిని మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు.

Also Read: కొడాలి నానిని కాపాడేందుకు రంగంలోకి డాక్టర్ పాండా.. ఆయన ట్రాక్ రికార్డ్ తెలిస్తే షాక్ అవుతారు!

ఏప్రిల్ 9వ తేదీన సాయంత్రం 4 గంట‌ల‌కు వ‌సంతోత్సవం, ఆస్థానం నిర్వహించ‌నున్నారు. అనంత‌రం సాయంత్రం 5 నుండి 6 గంట‌ల వ‌ర‌కు తిరువీధి ఉత్సవం జరుగనుంది.

ఏప్రిల్ 10 నుండి 12 వరకు తెప్పోత్సవాలు :


శ్రీ కోదండరాముని తెప్పోత్సవాలు ఏప్రిల్ 10 నుండి 12వ తేదీ వరకు ప్రతిరోజు రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు శ్రీరామచంద్ర పుష్కరిణిలో వైభవంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా ప్రతిరోజూ ఉదయం 8 నుండి 9.30 గంటల వరకు స్నపనతిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. మొదటిరోజు ఐదుచుట్లు, రెండో రోజు ఏడు చుట్లు, చివరిరోజు తొమ్మిది చుట్లు తెప్పలపై స్వామివారు విహరిస్తారు.

Also Read: Adolescence: ప్రధాని మెచ్చిన 'Adolescence' వెబ్ సీరిస్.. అన్ని స్కూళ్లలో ప్రదర్శించాలని ఆదేశం.. దాని ప్రత్యేకత ఇదే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు