Nara Lokesh: వంశీని వదిలిపెట్టం.. అరెస్ట్ పై లోకేష్ ఫస్ట్ రియాక్షన్!

వల్లభనేని వంశీ అరెస్ట్ పై మంత్రి నారా లోకేష్ స్పందించారు. దళిత యువకుడిని కిడ్నాప్ చేసినందుకు వంశీ జైలుకు వెళ్లాడన్నారు. తప్పు చేసిన వైసీపీ నేతలందరినీ చట్ట ప్రకారం శిక్షిస్తామని స్పష్టం చేశారు. వంశీపై కూడా చట్ట ప్రకారం చర్యలు ఉంటాయన్నారు.

New Update
Vallabhaneni Vamshi Nara Lokesh

Vallabhaneni Vamshi Nara Lokesh

తప్పు చేసిన వైసీపీ నేతలను చట్టపరంగా శిక్షిస్తామన్నారు. 2019-24 మధ్య కొనసాగిన అరాచకపాలన అందరూ చూశారన్నారు. ప్రజా సమస్యలపై పోరాడిన తమపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. అక్రమాలను నిలదీస్తే టీడీపీ ఆఫీస్ పై దాడి చేశారన్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి గన్నవరం ఎమ్మెల్యేగా విజయం సాధించిన వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi).. ఎలక్షన్ తర్వాత వైసీపీకి మద్దతు ప్రకటించారు. అయితే.. అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులోనూ వంశీ నిందితుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వంశీ అరెస్ట్ ఖాయమన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే.. ఇటీవల దళిత యువకుడి కిడ్నాప్ కేసులో ఏపీ పోలీసులు వంశీని అరెస్ట్ చేశారు. 

Also Read :  రేపటి నుంచే పెద్దగట్టు జాతర.. హైదరాబాద్-విజయవాడ హైవేపై దారి మళ్లింపు.. రూట్ల వారీగా వివరాలివే!

Also Read :  చేసింది చెప్పట్లే.. కాంగ్రెస్ కార్యకర్తలు అలిగారు.. TPCC చీఫ్ సంచలన వ్యాఖ్యలు!

నెక్స్ట్ కొడాలి నాని అరెస్ట్?

వల్లభనేని వంశీ అరెస్టుతో ఏపీ రాజకీయాల్లో (AP Politics) ఇంట్రెస్టింగ్ చర్చ సాగుతోంది. ఆ తర్వాతి అరెస్టు ఎవరన్న అంశంపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. ఇందులో మాజీ మంత్రి కొడాలి నాని పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. లోకేష్‌ (Nara Lokesh) హిట్‌ లిస్టులో కొడాలి నాని ఉన్న విషయం తెలిసిందే.

Also Read :  వంశీ అరెస్ట్ తర్వాత అజ్ఞాతంలోకి కొడాలి నాని.. ఏ క్షణమైనా అరెస్ట్..?

కొడాలి నానిని విడిచి పెట్టేది లేదంటూ ఎన్నకల ప్రచార సమయంలో లోకేష్ అనేక సార్లు చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓటమి తర్వాత కొడాలి నాని హైదరాబాద్‌కే పరిమితం అయ్యారు. అడపాదడపా మినహా పార్టీ కార్యక్రమాల్లోనూ నాని కనిపించడం లేదు. వంశీ అరెస్టు తర్వాత అలర్ట్ అయ్యి నాని అండర్‌గ్రౌండ్‌కు వెళ్లిపోయారంటూ చర్చ సాగుతోంది. 

Also Read :  తెలంగాణ కాంగ్రెస్ లో కీలక మార్పులు.. మున్షీ ఔట్.. కొత్త ఇన్‌ఛార్జ్ ఎవరంటే?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

IAS transfers : ఏపీలో ఐఏఎస్ ల బదిలీలు...సిసోడియా ఔటు- ముత్యాల రాజుకు చోటు..!!

ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పలు హోదాల్లో పని చేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. అధికారంలోకి వచ్చిన తరువాత పక్కన పెట్టిన అధికారులకు ఇప్పుడు పోస్టింగ్ ఇస్తోంది. సీనియర్ ఐఏఎస్ సిసోడియాను బదిలీ చేసారు.

New Update
IAS transfers

IAS transfers

IAS transfers :  ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పలు హోదాల్లో పని చేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. అధికారంలోకి వచ్చిన తరువాత పక్కన పెట్టిన అధికారులకు ఇప్పుడు పోస్టింగ్ ఇస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు సమయం నుంచి రెవిన్యూ - రిజిస్ట్రేషన్ శాఖలు కీలకంగా మారాయి.

Also Read: సుంకాలు 90 రోజుల విరామం ఎఫెక్ట్.. భారీ లాభాల్లో భారత స్టాక్ మార్కెట్లు..

ఈ శాఖలను ఇప్పటి వరకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో పర్యవేక్షించిన సీనియ ర్ ఐఏఎస్ అధికారి సిసోడియాను బదిలీ చేసారు. సిసోడియాకు హ్యాండ్లూమ్, టెక్స్‌టైల్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు కేటాయించారు. ఆయన స్థానంలో ప్రస్తుతం CCLA స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న జయలక్ష్మి రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా అదనపు బాధ్యతల అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు.

Also Read: Vivo V50e 5G Offers: మచ్చా ఆఫర్ అంటే ఇదేరా.. ప్రీ బుకింగ్ స్టార్ట్.. రూ. 5వేల భారీ డిస్కౌంట్- కెమెరా సూపరెహే!

ఇక, ప్రస్తుతం ఐటీ కార్యదర్శిగా ఉన్నా కాటమనేని భాస్కర్ కు ఏపీ హెచ్ఆర్డీ సంస్థ డైరెక్టర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీఎంఓలో కీలకం గా వ్యవహరించిన ముత్యాల రాజుకు ఇప్పుడు పోస్టింగ్ దక్కింది. ఆయనకు స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పంచాయితీ రాజ్ సెక్రటరీగా నియమించారు.

Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!

పోస్టింగ్ కోసం వెయిటింగ్ లో ఉన్న మరో అధికారి మాధవీ లతకు రైతు బజార్ల సీఈవోగా నియామకం చేసారు. మరో ఐఏఎస్ గౌతమికి గిరిజన విద్య సంస్థల కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. ఫైబర్ నెట్ లో జీవీ రెడ్డి పై ఆరోపణలు చేసి.. అక్కడ నుంచి బదిలీ అయిన దినేష్ కుమార్ ను ఆయూష్ డైరెక్టర్ గా నియమించారు. ఏపీ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఎండీ గా కే నీలకంఠారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇది కూడా చూడండి: BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి మంజూరు..!

Advertisment
Advertisment
Advertisment