Free Electricity: ఏపీలో ఉచిత కరెంట్.. క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే !

ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సచివాలయంలో  సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో  చేనేత కార్మికుల ఇళ్లకు 200 యూనిట్ల వరకు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయించింది.

New Update
ap handloom workers

ఏపీ క్యాబినెట్ (AP Cabinet) కీలక నిర్ణయాలు తీసుకుంది. సచివాలయంలో  సీఎం చంద్రబాబు (Chandrababu) అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో  చేనేత కార్మికుల ఇళ్లకు 200 యూనిట్ల వరకు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయించింది. టీచర్ల బదిలీల నియంత్రణ చట్టసవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. అంతేకాకుండా అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో రెన్యువబుల్ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.

Also Read :  విజయశాంతికి మంత్రి పదవి ఉండదు.. అలాంటివి KTRకే తెలుసు.. మంత్రి సురేఖ సంచలన కామెంట్స్!

వీవీఐటీయూకు ప్రైవేట్ వర్సిటీ హోదా

రాజధాని అమరావతి భూకేటాయింపులపై క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  సీఆర్డీఏ ఆమోదించిన రూ.37,072 కోట్ల పనులకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎస్సీ వర్గీకరణ అంశంపైనా కేబినెట్ భేటీలో చర్చ జరిగింది. ఈ అంశంపై ఇటీవల రాజీవ్‌రంజన్‌ మిశ్రా కమిషన్‌ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఆ నివేదికకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

వైఎస్సార్  తాడిగడప మున్సిపాలిటీ పేరు తాడిగడపగా మార్పు చేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. నంబూరులోని వీవీఐటీయూకు ప్రైవేట్ వర్సిటీ హోదా కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.  ఇవే కాకుండా సీఎం కార్యాలయంలో ముగ్గురు ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్ల పోస్టులకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. 

Also Read :  సెంట్రల్ గవర్నమెంట్‌పై ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ దావా

ఆ బాధ్యత ఎమ్మెల్యేలదే!

మరోవైపు 2047 కల్లా రాష్ట్ర తలసరి ఆదాయం రూ.55లక్షలు ఉండాలని, 2.4 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థకు చేరాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. అసెంబ్లీలో  సీఎం మాట్లాడుతూ.. దేశంలో అధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం తెలంగాణ (Telangana) అని చెప్పారు. వికసిత్ భారత్-2047 కల్లా దేశం 30 ట్రిలియన్ డాలర్ల జీడీపీకి చేరాలన్నారు. రాష్ట్రంలో నియోజకవర్గ విజన్ డాక్యుమెంట్ అమలుపరిచే బాధ్యత  ఎమ్మెల్యేలదే అని చెప్పారు.  ఉమెన్ వర్క్ ఫోర్స్ పెరిగితే వేగవంతమైన అభివృద్ధి సాధ్యమని సీఎం తెలిపారు.

Also Read :   జియో గుడ్ న్యూస్... రూ. 299 ప్లాన్ అదుర్స్.. IPL అభిమానులకు పండగే!

Also Read :  పవన్‌పై శిల్పా రవి సెటైర్.. అల్లు అర్జున్‌ను ఇష్యూ బయటకు లాగిన జనసైనికులు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Weather Alert: తెలుగు రాష్ట్రాలకు అలెర్ట్.. 5 రోజులపాటు భారీ వర్షాలు

ఏపీ, తెలంగాణలో రానున్న 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో వర్షాలతో పాటు పిడుగులు కూడా పడతాయని హెచ్చరించారు. అలాగే మరికొన్ని జిల్లాల్లో ఎండలు కూడా ఎక్కువగా ఉంటాయన్నారు.

New Update

ఏపీ, తెలంగాణలో  రానున్న 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అండమాన్ సమీపంలోని ఆవర్తనం వల్ల పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలతో పాటు పిడుగులు కూడా పడతాయని హెచ్చరించారు. అలాగే మరికొన్ని జిల్లాల్లో ఎండలు కూడా ఎక్కువగా ఉంటాయని తెలిపారు. 

Also Read: అగ్నివీరులకు గుడ్‌న్యూస్‌.. పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు

కొన్ని జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు పెరిగే ఛాన్స్ ఉందన్నారు. సోమవారం పలు ప్రాంతాల్లో పిడుగులు పడతాయని.. వర్షాలు పడే సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇలాంటి సమయంలో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ముఖ్యంగా రైతులు చెట్ల కింద నిల్చోవద్దని చెప్పారు. 

Also Read: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

ఇదిలాఉండగా ఇప్పటికే అనకాపల్లి, శ్రీకాకుళం, కాకినడా, పల్నాడు, బాపట్ల, గుంటూరు తదితర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసినట్లు అధికారులు చెప్పారు. ఏపీలో అత్యధికంగా కాకినాడ జిల్లా వేలంకలో 56.25 మిల్లీ మీటర్ల వాన పడినట్లు పేర్కొన్నారు.

Also Read: మణిపూర్‌లో ఉగ్రవాదులు అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం

  telugu-news | rtv-news | rains | heavy-rains 

Advertisment
Advertisment
Advertisment