AP Budget 2025: పవన్, లోకేష్ కన్నా ఆ మంత్రులకే అత్యధిక నిధులు.. టాప్-5 లిస్ట్ ఇదే!

ఏపీ బడ్జెట్ లో వ్యవసాయ శాఖకు అత్యధికంగా రూ.48 వేల కోట్లను కేటాయించారు. ఆ తర్వాత బీసీ సంక్షేమానికి రూ.47,456 కోట్లు, వైద్య శాఖకు రూ.19,264 కోట్లు, పాఠశాల విద్యకు రూ.31,805 కోట్లు, పంచాయతీ రాజ్ కు రూ.18,847 కోట్లు, జలవనరుల శాఖకు రూ.18,019 కోట్లు దక్కాయి.

New Update
Payyavula Keshav

Payyavula Keshav AP Budget 2025

ఏపీ బడ్జెట్ ను రూ.3.22 లక్షల కోట్లతో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఈ రోజు ప్రవేశపెట్టారు. అయితే.. ఇందులో అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యవసాయ శాఖకు అత్యధికంగా రూ.48 వేల కోట్లను కేటాయించారు. సవిత నిర్వహిస్తున్న బీసీ సంక్షేమ శాఖకు రూ.47,456 కోట్లను కేటాయించారు. సత్యకుమార్ నిర్వహిస్తున్న వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు రూ.19,264 కోట్లు, నారా లోకేష్ పాఠశాల విద్యకు రూ.31,805 కోట్లు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పంచాయతీ రాజ్ శాఖకు రూ.18,847 కోట్లు, మంత్రి నిమ్మల రామానాయుడు నిర్వర్తిస్తున్న జలవనరుల శాఖకు రూ.18,019 కోట్లు కేటాయించారు.  

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: 45 రోజుల పాటు VIP బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ

TTD 45రోజుల పాటు VIP బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. వేసవి సెలవుల నేపథ్యంలో మే1 - జూన్ 15 వరకు ఎమ్మెల్యే,ఎంపీ, ప్రముఖుల సిఫార్సులపై జారీచేసే బ్రేక్ దర్శనాలను క్యాన్సిల్ చేసింది. ప్రొటోకాల్ పరిధి ప్రముఖులు స్వయంగా వస్తే బ్రేక్ దర్శన సదుపాయం కల్పించనుంది.

New Update
TTD cancels VIP break darshans for 45 days

TTD cancels VIP break darshans for 45 days

తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 45 రోజుల పాటు విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. వేసవి సెలవులు ప్రారంభం అయిన నేపథ్యంలో టీటీడీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా మే 1వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు ఎమ్మెల్యే, ఎంపీ, ఇతర ప్రముఖుల సిఫార్సులపై జారీ చేసే బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. అదే సమయంలో ప్రొటోకాల్ పరిధిలో ఉన్న ప్రముఖులు స్వయంగా వస్తే బ్రేక్ దర్శన సదుపాయం కల్పించనుంది. మే 1వ తేదీ నుంచి ఉదయం 6 గంటలకు విఐపి బ్రేక్‌ను ప్రయోగాత్మకంగా ప్రారంభించనుంది. 

telugu-news | ttd | latest-telugu-news | tirumala tirupati temple

Advertisment
Advertisment
Advertisment