AP And TG Weather Report: నేటి నుంచి భానుడి భగభగ.. ఏపీ, తెలంగాణలో ఈ జిల్లా ప్రజలకు అలర్ట్!

ఏపీ, తెలంగాణలో నేటినుంచి వడగాలులు బీభత్సం సృష్టించనున్నాయి. TGలో ఆదిలాబాద్‌లో 39.3, నల్గొండలో 35 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండనుంది. APలో శ్రీకాకుళం-15, విజయనగరం-21, మన్యం-10, ASR-8, అనకాపల్లి-7, కాకినాడ-7, కోనసీమ-3 సహా మరిన్ని జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి.

New Update
Heatwave

Heatwave

రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్చి 21 నుంచి 24 మధ్య వర్షాలు జోరుగా కురిసాయి. ప్రజలు హాయి హాయిగా చల్ల చల్లని గాలి, వర్షాల మద్య ఎంజాయ్ చేశారు. కానీ ఇకపై అలా జరగదు. ఎండలు మళ్లీ మొదలయ్యాయి. ఉదయం కాగానే భగభగ మండిపోతున్నాయి. బయటకు వెళ్లాలంటే ప్రజలు అల్లాడిపోతున్నారు. 

ఇక నేటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాలలో వడగాలలు మొదలు కానున్నాయి. ఇప్పటికే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతున్న ప్రజలు.. ఇప్పుడు మరింత జాగ్రత్త పడాల్సి ఉంది. తాజాగా వాతావరణ శాఖ కీలక ప్రకటన రిలీజ్ చేసింది. ఇవాళ్టి నుంచి భానుడు తన ప్రతాపం చూపిస్తాడని పేర్కొంది. 

Also Read: పోలీసుస్టేషన్‌ లోనే భర్త ముఖం పగలకొట్టిన ఇంటర్నేషనల్‌ బాక్సింగ్‌ ఛాంపియన్!

తెలంగాణలో

హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రజలను అలర్ట్ చేసింది. దక్షిణ ఛతీస్‌ఘడ్ నుంచి మధ్య మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక మీదుగా ఉత్తర తమిళనాడు వరకు సముద్రమట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ద్రోణి కొనసాగుతుందని తెలిపింది. అందువల్ల 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే ఛాన్స్ ఉందని చెప్పుకొచ్చింది. దీని కారణంగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో వడగాలులు తీవ్రంగా వీసే అవకాశం ఉందని పేర్కొంది. 

Also Read :  రషీద్ ఖాన్ అరుదైన రికార్డు.. మలింగ, బుమ్రాలతో కలిసి

అందులో ఆదిలాబాద్‌లో గరిష్టంగా 39.3, నల్గొండలో 35 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే ఛాన్స్ ఉందని చెప్పుకొచ్చింది. ఇక నిన్నటి విషయానికొస్తే.. ఆదిలాబాద్‌లో 38.3 డిగ్రీలు, మహబూబ్ నగర్‌లో 35.5 డిగ్రీలు, నిజామాబాద్‌లో 37.3 డిగ్రీలు, హనుమకొండలో 35 డిగ్రీలు, భద్రాచలంలో 38 డిగ్రీలు, ఖమ్మంలో 36.6 డిగ్రీలు, నల్లగొండలో 36 డిగ్రీలు, మెదక్‌లో 35.4 డిగ్రీలు, రామగుండంలో 35.6 డిగ్రీలు, హైదరాబాద్‌లో 33.8 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

Also Read :  ఛోక్సీ మా దేశంలోనే ఉన్నాడు: బెల్జియం!

ఏపీలో వాతావరణం

అలాగే ఏపీలో సైతం సూర్యుడు తన ప్రతాపం చూపించబోతున్నాడు. నేడు 108 మండలాల్లో తీవ్రమైన వడగాలులు వీచే ఛాన్స్ ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో -15 డిగ్రీలు, విజయనగరం జిల్లాలో- 21 డిగ్రీలు, పార్వతీపురంమన్యం జిల్లాలో-10 డిగ్రీలు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో -8డిగ్రీలు, అనకాపల్లిలో- 7 డిగ్రీలు, కాకినాడలో -7 డిగ్రీలు, కోనసీమలో -3 డిగ్రీలు, తూర్పుగోదావరిలో- 13 డిగ్రీలు, ఏలూరులో -5 డిగ్రీలు, కృష్ణాలో -2 డిగ్రీలు, ఎన్టీఆర్-‌ జిల్లాలో 6 డిగ్రీలు, గుంటూరులో -3 డిగ్రీలు, పల్నాడు-లోని 8 మండలాల్లో వడగాలుల ప్రభావం తీవ్రంగా ఉండే ఛాన్స్ ఉందని అంచనా వేసింది.

Also Read :  ఇక ఏటీఎం నుంచి పీఎఫ్‌ నగదు తీసుకోవచ్చు...ఎప్పటి నుంచో తెలుసా?

 

(weather | AP Weather Alert | ap today weather update | telangana-weather | telangana weather report today | latest-telugu-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

DSC: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మెగా డీఎస్సీపై సీఎం కీలక ప్రకటన!

టీచర్ అభ్యర్థులకు ఏపీ సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఏప్రిల్ నెలలోనే విడుదల చేయనున్నట్లు తెలిపారు. జూన్‌లో స్కూళ్లు ప్రారంభమయ్యేలోగా టీచర్ల నియామకం పూర్తి చేస్తామని కొత్తగొల్లపాలెం ప్రజావేదిక సభలో స్పష్టం చేశారు.

New Update
Telangana : డీఎస్సీ దరఖాస్తులకు నేడే చివరి రోజు!

CM Chandrababu key statement on AP Mega DSC

AP DSC: టీచర్ అభ్యర్థులకు ఏపీ సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఏప్రిల్ నెలలోనే విడుదల చేయనున్నట్లు తెలిపారు. జూన్‌లో స్కూళ్లు ప్రారంభమయ్యేలోగా టీచర్ల నియామకం పూర్తి చేస్తామని కొత్తగొల్లపాలెంలో ప్రజావేదిక సభలో స్పష్టం చేశారు. అలాగే మే నెలలోనే తల్లికి వందనం అమలు చేస్తామని ప్రకటించారు. అన్నదాత సుఖీభవ కింద రూ.20వేలు ఇస్తాం. ధనిక రాష్ట్రమైన తెలంగాణలో ఏపీలో కంటే తక్కువ పెన్షన్ ఇస్తున్నారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

16 వేల 347 టీచర్ పోస్టులు..

ఈ మేరకు ఎన్నికల హామీలో భాగంగా తమ ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా16,347 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. మార్చిలోనే రిలీజ్ చేయాల్సినప్పటికీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా ఆలస్యం అయిందని, ఈ కోడ్ ముగియగానే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని లోకేష్ చెప్పిన అంశంపై చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు.

Also Read: వారికి దగ్గరయ్యేందుకు మలయాళం నేర్చుకుంటున్నాను అంటున్న ప్రియాంక!

'మెగా డీఎస్సీ నోటిఫికేషన్ కోసం విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. జూన్ అకాడమిక్ మొదలయ్యే నాటికి ఖాళీల భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తాం. నియామకాల కేటాయింపులో భాగంగానే ఎస్సీ వర్గీకరణ అమలుపై ఆర్డినెన్స్ జారీ దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని సీఎం చెప్పారు. ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ నివేదిక రాగానే డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడుతుందన్నారు. 

Also Read: ఉగాది పండుగ అసలు ఎందుకు జరుపుకుంటారు? ఉగాది పచ్చడికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి?

mega-dsc | cm-chandrababu | april | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment