Amzath Basha Brother Arrest in mumbai : మాజీ డిప్యూటీ సీఎంకు షాక్.. ముంబైలో తమ్ముడు అరెస్ట్..

అధికార పార్టీ ఎమ్మెల్యేలను నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నాయకులు వరుసగా జైలు పాలవుతున్నారు. తాజాగా మాజీ మంత్రి, వైసీపీ నేత అంజద్ బాషాకు షాక్ తగిలింది. ఆయన తమ్ముడు అహ్మద్ బాషాను కడప పోలీసులు ముంబయిలో అదుపులోకి తీసుకున్నారు.

New Update
Amzath Basha Brother Arrest in mumbai

Amzath Basha Brother Arrest in mumbai

Amzath Basha Brother Arrest in mumbai : అధికార పార్టీ ఎమ్మెల్యేలను నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నాయకులు వరుసగా జైలు పాలవుతున్నారు. తాజాగా మాజీ మంత్రి, వైసీపీ నేత అంజద్ బాషాకు షాక్ తగిలింది. ఆయన తమ్ముడు అహ్మద్ బాషాను కడప పోలీసులు ముంబయిలో అదుపులోకి తీసుకున్నారు. ఆయనను ముంబయి నుంచి కడపకు తీసుకువస్తున్నారు. రేపు కడప కోర్టులో హాజరు పరచనున్నారు. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, శ్రీనివాసులురెడ్డిని దూషించారనే ఫిర్యాదులతో పాటుగా ఓ స్థలం విషయంలో దాడి చేశారనే ఆరోపణలపై అహ్మద్ బాషా మీద కేసులు ఉన్నాయి. అహ్మద్ బాషాపై లుక్‌ అవుట్‌ నోటీసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముంబయి ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్‌ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కడప పోలీసులకు అప్పగించారు. అహ్మద్ బాషా కువైట్ వెళ్తుండగా ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నట్లు తెలిసింది. అహ్మద్ బాషాపై కడపలో కేసు నమోదైంది. వినాయకనగర్‌లోని ఓ స్థలం విషయంలో దాడిచేశారని ఫిర్యాదు రావటంతో పోలీసులు కేసు నమోదు చేశారు.


Also read :  డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

ఈ కేసుతో పాటుగా కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవీరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డిలను అసభ్యకర పదజాలంతో దూషించారంటా అహ్మద్ బాషాపై కేసులు ఉన్నాయి. టీడీపీ పొలిట్‌బ్యూరో నేత శ్రీనివాసుల రెడ్డిపై పోలీసు స్టేషన్‌లోనే దాడి చేసేందుకు అహ్మద్ బాషా యత్నించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కడప పోలీసులు ఆయనను అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం ముంబయి నుంచి కడపకు తీసుకువస్తున్నారు. సోమవారం కడప కోర్టులో అహ్మద్ బాషాను హాజరు పరిచే అవకాశముంది.

Also Read :  దేశానికి స్ఫూర్తినిచ్చిన పోరాటం..ఆ భూములపై కేటీఆర్ బహిరంగ లేఖ

మరోవైపు పోలీస్ స్టేషన్‌ నుంచి తన అనుచరుణ్ని అంజాద్ బాషా బలవంతంగా తీసుకెళ్లడం శనివారం సంచలనం రేపింది. కడప పట్టణంలోని రాజారెడ్డి వీధి, బుడ్డాయపల్లెకు చెందిన కొంతమంది మహిళల వద్ద మహేశ్వర్‌రెడ్డి అనే వ్యక్తి రూ.50 లక్షలు అప్పు తీసుకున్నారు. అయితే అప్పు తీసుకుని 13 ఏళ్లు దాటినా తిరిగి చెల్లించలేదు. దీంతో అప్పు ఇచ్చిన మహిళలు నిలదీయగా.. ఆ డబ్బులను ఇబ్రహీం మియా అనే వ్యక్తికి ఇచ్చానని చెప్పారు. ఇబ్రహీం మియా కోసం మహిళలు గాలించగా పాత బస్టాండు వద్ద శుక్రవారం కనిపించాడు. దీంతో మహిళలు ఇబ్రహీం మియాను పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం కడప ఒకటో పట్టణ పోలీసులకు అప్పగించారు.

Also read :  మరికొన్ని రోజుల్లో పెళ్లి... కాబోయే భర్త కళ్లముందే యువతి మృతి!

అయితే ఇబ్రహీం మియా అంజాద్ బాషా అనుచరుడని తెలిసింది. దీంతో అంజాద్ బాషా పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఇబ్రహీం మియాను బలవంతంగా అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. ఈ విషయం తెలుసుకున్న మహిళలు.. అంజాద్‌ బాషా ఇంటికి వెళ్లి ధర్నాకు దిగారు. వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. మరోవైపు ఈ వ్యవహారంలో పోలీసులు ఇరువర్గాల పైనా కేసులు నమోదు చేశారు. తనపై దాడి చేశారని ఇబ్రహీం మియా ఇచ్చిన ఫిర్యాదుతో మహిళలపై కేసు నమోదు చేశారు. అలాగే డబ్బులు ఇవ్వాలని అడిగితే అసభ్యకరంగా మాట్లాడాడని మహిళలు ఫిర్యాదు చేయడంతో ఇబ్రహీం మియాపైనా కేసు నమోదైంది.

Also Read : Ramnavami: రామాలయంలో అపశృతి.. టెంట్లు కూలీ భక్తుల తలలు పలిగాయి

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Aghori Arrest: అఘోరీకి బిగ్ షాక్.. సంగారెడ్డి సబ్ జైలుకు తరలింపు- 14 రోజులు అక్కడే

అఘోరీకి చేవెళ్ల కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆమెను సంగారెడ్డి సబ్ జైలుకు (కంది జైలు) తరలించారు. అదే సమయంలో అఘోరీ నుంచి వర్షిణీని వేరు చేసి భరోసా సెంటర్‌కు పంపించారు. అక్కడ వర్షిణీకి కౌన్సిలింగ్ ఇవ్వనున్నారు.

New Update

లేడీ అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్ పోలీసులకు చిక్కాడు. వర్షిణీని పెళ్లి చేసుకుని కనిపించకుండా పోయిన అఘోరీని పోలీసులు మంగళవారం సాయంత్రం మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నార్సింగి పోలీస్ స్టేషన్ కి తరలించారు. అక్కడ నుంచి చేవెళ్ల కోర్టుకు తీసుకెళ్లారు. 

ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

14 రోజుల రిమాండ్

విచారణలో భాగంగా లేడీ అఘోరీకి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆమెను సంగారెడ్డి సబ్ జైలుకు తరలించారు.  అదే సమయంలో శ్రీనివాస్ నుంచి వర్షిణీని వేరు చేసిన పోలీసులు భరోసా సెంటర్‌కు పంపించారు. అక్కడ వర్షిణీకి భరోసా సెంటర్ అధికారులు కౌన్సిలింగ్ ఇవ్వనున్నారు. 

ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

ఇదే విషయంపై అఘోరీ తరఫు లాయర్ మాట్లాడుతూ.. ‘‘కోర్టులో ఇప్పుడు వాదోపవాదనలు ఏం జరగలేదు.  కోర్టు కేవలం 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. కేసుకు సంబంధించి పూర్వపరాలు పరిశీలించి కేసు వాదించాలా లేదా అనేది జరుగుతుంది. కోర్టు తరఫున అడ్వకేట్‌ను పెట్టుకునే స్థోమత లేనివారికి కోర్టు నన్ను అపాయింట్ చేసింది. బెయిల్ గురించి ఇప్పుడే చెప్పలేం. కేసుకు సంబంధించి అన్నీ పరిశీలించిన తర్వాత ఒక టైం పడుతుంది. ’’ అని చెప్పుకొచ్చారు. 

కేసు ఏంటంటే?

రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలానికి చెందిన మహిళా ప్రొడ్యూసర్ అఘోరీపై చీటింగ్ కేసు పెట్టింది. 6 నెలల క్రితం ప్రొద్దటూర్‌లోని ప్రగతి రిసార్ట్స్‌లో డిన్నర్‌కు వచ్చిన అఘోరి ఆమెకు పరిచయం అయ్యింది. తర్వాత తరుచుగా ఆమెకు ఫోన్ చేసి వ్యక్తిగత వివరాలు తెలుసుకునేది. ఒక పూజ చేస్తే అంతా మంచి జరుగుతుందని మహిళా ప్రొడ్యూసర్‌కు మాయ మాటలు చెప్పింది అఘోరీ .

క్షుద్ర పూజలు చేయడానికి అడ్వాస్‌గా రూ.5 లక్షలు తన అకౌంట్‌లోకి వేయించుకుంది. తర్వాత యూపీ ఉజ్జయినిలోని ఫాం హౌస్‌కి తీసుకెళ్లి పూజ చేసింది. అప్పుడు మరో రూ.5 లక్షలు తనకు ఇవ్వాలని డిమాండ్ చేసింది అఘోరీ. లేకపోతే పూజ విఫలమై కుటుంబం నాశనమవుతుందని లేడీ అఘోరీ ఆమెను భయపెట్టింది. ఆ మాటలకు భయపడిన ఆ మహిళ మరో రూ.5 లక్షలు అఘోరీకి ముట్టజెప్పింది.

Also  read :  AP 10th Result: ఏపీ టెన్త్ ఫలితాల్లో అరుదైన రికార్డ్.. 600 కు 600 మార్కులు!

aghori Arrest | lady aghori arrest | Lady Aghori Sri Varshini | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment