/rtv/media/media_files/2025/02/16/9bGFosPlBGKgAMKGuvHm.webp)
Tirumala
Alert To Devotees Of Tirumala
ఇక తెప్పోత్సవాల్లో భాగంగా రాత్రి 7 నుంచి 8 గంటల వరకూ శ్రీవారు పుష్కరిణిలో భక్తులకు దర్శనమిస్తారని ఆలయ కమిటీ తెలిపింది. తెప్పోత్సవాల్లో భాగంగా తొలిరోజు సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి తెప్పలపై విహరిస్తారని వెల్లడించారు. శ్రీవారి పుష్కరిణిలో మూడు చుట్లు తిరిగి భక్తులకు అభయప్రదానం చేస్తారని వివరించారు. ఇక రెండో రోజు రుక్మిణీ సమేత శ్రీకృష్ణ స్వామి తెప్పలపై పుష్కరిణిలో విహరిస్తూ భక్తులకు కనువిందు చేస్తారు. మూడోరోజు మార్చి 11న మలయప్పస్వామి మూడుసార్లు పుష్కరిణిలో చుట్టి భక్తులను అనుగ్రహిస్తారు. అలాగే నాలుగోరోజైన మార్చి12వ తేదీన మలయప్పస్వామి ఐదు చుట్లు పుష్కరిణిలో విహరిస్తారు. చివరి రోజైన మార్చి 13న ఏడుసార్లు తెప్పపై పుష్కరిణిలో విహరించి భక్తులను కటాక్షిస్తారని ఆలయ కమిటీ తెలిపింది.
Also Read: అమెరికా నుంచి ఇజ్రాయిల్కు చేరుకున్న MK-84 బాంబులు.. ఏ క్షణమైనా యుద్ధం..!
మరోవైపు శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఫిబ్రవరి 17న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగనుంది. అనంతరం ఫిబ్రవరి 18 నుంచి 26వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్బంగా ఫిబ్రవరి 17న సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఫిబ్రవరి 18న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహిస్తారు. ఉదయం 8.15 నుంచి 8.40 గంటల మధ్య ధ్వజారోహణం జరుగనుంది. అంతకుముందు తిరుచ్చి ఉత్సవం నిర్వహిస్తారు.. రాత్రి 7 గంటల నుంచి పెదశేష వాహన సేవ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలు సందర్భంగా ఉదయం, సాయంత్రం వేళ స్వామివారు వాహన సేవలపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
Also Read: వారి సాయం లేకుండా మేం బతకడం కష్టమే.. జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు